కాంగ్రెస్ కొత్త సారథి ఎవరు? రాహుల్ అభీష్టం మేరకే గాంధీ కుటుంబం బయటి వ్యక్తికే పగ్గాలు?

Publish Date:Aug 25, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి కొత్త అధ్యక్షుడు కచ్చితంగా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తినే ఎన్నుకోవడం దాదాపు ఖాయమైపోయిందా అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే అంటున్నారు. సోనియాగాంధీ ఆరోగ్య సమస్యలతో పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగడానికి సుముఖంగా లేని సంగతి విదితమే. ఇక రాహుల్ గాంధీ అయితే తాను పట్టిన పట్టు విడవబోనని ఖరాఖండీగా తేల్చేశారు.

తాను పార్టీ పగ్గాలు చేబట్టబోననీ విస్పష్టంగా తెలియజేయడంతో పార్టీ ప్రియాంక గాంధీవైపు మొగ్గు చూపినా ఆమె కూడా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించారని చెబుతున్నారు. దీంతో అనివార్యంగా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఎదురైంది. దీంతో పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న చర్చ పార్టీలో విస్తృతంగా సాగుతోంది. పార్టీ అధ్యక్ష పగ్గాలు ఎవరు చేపట్టినా వారు గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడే అయి ఉండాలన్నది బయటకు చెప్పని కండీషన్ గా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

పార్టీలో పాత తరం, కొత్తతరం నేతలను కలుపుకుపోగలిగిన వ్యక్తి... అదే సమయంలో గాంధీ కుటుంబానికి ఆమోదయోగ్యమైన వ్యక్తి కోసం అన్వేషణ ప్రారంభమైందని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ప్రముఖంగా అశోక్ గెహ్లాట్, అంబికాసోని, మల్లికార్జున్ ఖర్గే, ముకుల్ వాస్నిక్, కేసీవేణుగోపాల్, మీరాకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ప్రస్తుత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అశోక్ గెహ్లాట్ వైపే మొగ్గు చూపుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నారు. అశోక్ గెహ్లాట్ ను పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే రాజస్థాన్ సీఎంగా రాహుల్ గాంధీకి సన్నిహితుడైనా రాజేష్ పైలట్ కు అవకాశం దక్కుతుందని, ఇది ఉభయతారకంగా ఉంటుందనీ ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే  సోనియాగాంధీ ఈ విషయమై అశోక్ గెహ్లాట్ ను ఢిల్లీకి పిలిపించి మాట్లాడినట్లు చెబుతున్నారు. వయోభారం కారణంగా ఆయన కూడా పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేరని, ఇదే విషయాన్ని ఆయన సోనియాకు చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కానీ అసలు విషయమేమిటంటే.. తాను రాజస్థాన్ ను వదిలి వస్తే పైలట్ రాష్ట్ర సీఎం పగ్గాలు చేపడతారనీ, అదే జరిగితే రాష్ట్రంలో తన పట్టు సన్నగిల్లుతుందనీ ఆయన భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా అశోక్ గెహ్లాట్ కనుక పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఇష్టపడకపోతే రేసులో  అంబికా సోనీ మల్లికార్జున్ ఖర్గే  మీరాకుమార్ కేసీ వేణుగోపాల్ ముకుల్ వాస్నిక్ లలో ఎవరో ఒకరికి ఆ పదవి దక్కే అవకాశం ఉందని పరిశీలకలు అంటున్నారు. వారందరూ కూడా గాంధీ కుటుంబానికి విధేయులేనన్న విషయం తెలిసిందే.

ఏది ఏమైనా ఈ నెల 28న జరగనున్న కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశంలో పార్టీ అధ్యక్ష ఎన్నికల తేదీని ఖరారు చేయడమే కాకుండా.. తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంలో కూడా పార్టీ కేడర్ కు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సీడబ్ల్యుసీ భేటీలో అధ్యక్ష ఎన్నిక తేదీని ప్రకటించడమే కాకుండా.. తదుపరి అధ్యక్షుడు ఎవరన్న క్లారిటీని కూడా క్యాడర్ కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  గాంధీ కుటుంబీకులు కాకుండా మరెవరైనా సరే కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి పార్టీని నడపడం అంటే వారికి కచ్చితంగా కత్తిమీద సాము వంటిదే. ఆ పదవిలో ఉండి స్వతంత్రంగా వ్యవహరించడం అంత సులువు కాదు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా సొంత నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీ నరసింహరావుకు.. ఆ తరువాత పార్టీలో జరిగిన మర్యాద ‘తెలిసిందే’ అలాగే సీతారాం కేసరి కూడా. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు పార్టీలో ఎవరూ కూడా పెద్దగా ఆసక్తి చూపడంలేదని అంటున్నారు. అందరూ ముక్త కంఠంతో రాహుల్ గాంధీయే మా నాయకుడు అంటూ చివరి క్షణం వరకూ ఆయనే పార్టీ పగ్గాలు చేపట్టేలా ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. 

By
en-us Political News

  
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.