వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం.. నిందితుల గుండెల్లో భయం!

Publish Date:Nov 19, 2024

Advertisement

గత ఐదేళ్లుగా డాక్టర్ వైఎస్ సునీత అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకులకు చట్ట ప్రకారం శిక్ష పడాలనీ, అలాగే హత్య కుట్రదారులు, సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలన్న సంకల్పంతో ఆమె గత ఐదేళ్లుగా శ్రమిస్తున్నారు. న్యాయపోరాటం చేస్తున్నారు.  వైఎస్ సునీత న్యాయపోరాటం ఫలితంగానే వైఎస్ వివేకా హత్య జరిగిన నాడు ఎవరైతే అప్పటి విపక్ష నేతలపై ఆరోపణలు గుప్పించారో వాళ్లే ఇప్పుడు నిందితులుగా, అనుమానితులుగా   బోనులో నిలబడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఆ కేసుతో  ఏం సంబంధం లేదని  విస్పష్టంగా తేలిపోయింది. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టయ్యారు. బెయిలుపై తిరుగుతున్న వారూ ఉన్నారు.  

అసలు వివేకా హత్య కేసు దర్యాప్తు అంతు అనేది కనిపించకుండా ఎందుకు సా..గుతూ ఉండడానికి,  ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా  పురోగతి లేకుండా నిలిచిపోవడానికి కారణమేంటి, కారణం ఎవరు అన్న విషయంలో ఇప్పుడు ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేకుండా పోవడానికి  కూడా వైఎస్ సునీత అలుపెరుగని పోరాటమే కారణం.  అసలీ కేసు ఇంత వరకూ వచ్చి.. ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగుతుండడానికి కారణం కూడా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మాత్రమే అనడంలో ఇసుమంతైనా సందేహానికి తావు లేదు.  తన తండ్రి  హంతకులు, వారి వెనుకనున్న ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయ పోరాటం   నిస్సందేహంగా  చారిత్రాత్మకం. ఈ పోరాటంలో ఆమె ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు.  స్వయానా పెదనాన్న కుమారుడు, సోదరుడు అయిన జగన్ ముఖ్యమంత్రిగా ఉండి తన న్యాయపోరాటానికి అడుగడుగునా అవరోధంగా నిలిచినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి జగన్ అండగా నిలిచి కాపాడుతూ.. తనను వేధింపులకు గురిచేసినా తట్టుకుని నిలబడ్డారు. 

సరే ఇప్పుడు గత ఐదేళ్ల  జగన్ అరాచక పాలనకు ఇప్పుడు తెరపడింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక వివేకా హత్య కేసు దర్యాపు వేగం పుంజుకుని దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని అంతా భావించారు. అయితే కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి ఐదు నెలలైనా వివేకా హత్య కేసు దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ లోగా వివేకా హత్య కేసులో అరెస్టైన వారందరికీ బెయిలు వచ్చేసింది. వారు దర్జాగా బయట తిరుగుతున్నారు.  
ఈ పరిస్థితుల్లో డాక్టర్ సునీత మరో సారి న్యాయపోరాటానికి కొంగు బిగించారు. తండ్రి హత్య కేసు పురోగతిపై ఆరా తీస్తున్నారు. సత్వర న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే  ఇటీవల ఆమె  కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిశారు. వివేకా హంతకులకు శిక్ష పడేలా చేయడంలో సహరించాలని కోరారు. దీనికి ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారు. ఆ తరువాత సునీత మంగళవారం (నవంబర్ 19) ఏపీ అసెంబ్లీకి వచ్చి  డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుతో భేటీ అయ్యారు. ఆయనతో వివేకా హత్య కేసు గురించి చర్చించారు. ఇప్పటికే ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత తో  భేటీ అయ్యారు. తండ్రి హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసి దోషులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేయాలని కోరారు. వారిరువురూ కూడా సానుకూలంగా స్పందించారు.  

తాజాగా అసెంబ్లీలోని పీఎంవో కార్యాలయానికి వెళ్లిన సునీత అక్కడి అధికారులతో తన తండ్రి వివేకా హత్య కేసు పురోగతిపై చర్చించారు. అంతకు ముందు ఇటీవల సచివాలయంలో చంద్రబాబుతో సునీత భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు హుకిల్డ్ బాబాయ్ అన్న సస్పెన్స్ కు తొందరలోనే తెరపడుతుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సునీత అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్, పీఎంవో అధికారులతో భేటీ అవ్వడం తండ్రి హత్య కేసు పురోగతిపై చర్చించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగు రోజుల కిందట కడప ఎస్పీతో భేటీ సందర్భంగా వివేకా హత్య కేసుకు సంబంధించి కొన్ని కేసులు హైదరాబాద్ లో నమోదై ఉన్నాయనీ, వాటిని ఇక్కడకు బదలీ చేసి సత్వర దర్యాప్తు జరిపే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్ హయాంలో పూర్తిగా నిర్వీర్యంగా మారిపోయిన వ్యవస్థలు ఇప్పుడిప్పుడే జవసత్వాలు కూడగట్టు కుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు విచారణ, దర్యాప్తులో వేగంగా కదలికలు కనిపిస్తు న్నాయి. డాక్టర్ సునీత అలుపెరుగని పోరాటం ఒక తార్కిక ముగింపునకు వచ్చేలా ఉంది. ఔను త్వరలోనే హు కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు సమాధానం లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

By
en-us Political News

  
ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.
సహజంగా దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తమ్ముడు కేశినేని చిన్నితో వైరం మాత్రం పెరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో భాగంగా ఒక ధర్నాలో పాల్గొన్న అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిరసనల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.