వైసీపీ నేతల దారేది?.. బెయిలా..జెయిలా.. హాస్పటలా?

Publish Date:Mar 28, 2025

Advertisement

ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఐదేళ్లు ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించాడు. ఇక ప్ర‌తిప‌క్ష నేత‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల వ‌ల్ల చంద్ర‌బాబుతో స‌హా అనేక‌మంది జైళ్ల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. జగన్ హయాంలో  కొంద‌రు  వైసీపీ నేత‌లు   హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. బూతుల‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ స‌హా వారి కుటుంబ స‌భ్యుల‌పైనా విరుచుకుప‌డ్డారు. అసెంబ్లీ వేదిక‌గా చంద్ర‌బాబు కుటుంబాన్ని దారుణంగా అవ‌మానించారు. వారిలో  వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని, రోజా ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది.   
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేత‌లు అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రించారు. వైఎస్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచి కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌న్న ధీమ‌తో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డంతోపాటు.. సామాన్య ప్ర‌జ‌ల‌నుసైతం నానా ర‌కాలుగా ఇబ్బందులు పెట్టారు. సీన్ క‌ట్ చేస్తే గ‌త ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా వైసీపీకి ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదంటూ వైసీపీకి కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.  ఐదేళ్లు అధికారం మ‌త్తులో హ‌ద్దులుమీరి ప్ర‌వ‌ర్తించిన నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీస్తూ ఒక‌వైపు.. అధికారం మ‌త్తులో నోరుపారేసుకున్న నేత‌ల‌పై మ‌రోవైపు కేసులు న‌మోదు చేసి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటున్నది. ఇప్పటికే వైసీపీ హయాంలో విర్రవీగి.. ఇష్టారీతిగా నోరు పారేసుకున్న నేతలు, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో రెచ్చిపోయిన నాయకులు కేసుల చట్రంలో ఇరుక్కున్నారు. బోరుగడ్డ అనీల్ లో మొదలెడితే పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కటకటాలు లెక్కిస్తున్నారు. 

ఒకళ్లా ఇద్దరా పదుల సంఖ్యలో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. అలా కేసులు నమోదైన వారిలో  మాజీ మంత్రులు కొడాలి నాని, ఆర్కే రోజా, విడదల రజని, పేర్ని నాని, జోగు రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, తదితరులపై కేసులు నమోదయ్యాయి. ఇంకా   వల్లభనేని వంశీ, బోరుగడ్డ అనిల్,  పోసాని కృష్ణ మురళి,  వర్రా రవీంద్రారెడ్డి, నందిగం సురేష్, జోగి రాజీవ్ ఉన్నారు.  చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి,  గోరంట్ల మాధవ్, దువ్వాడ శ్రీనివాస్, అలాగే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. వీరిలో పలువురు జైలు పాలయ్యారు. కొందరు బెయిలుపై ఉన్నారు.  దీంతో వైసీపీ నేత‌ల్లో భ‌యం ప‌ట్టుకుంది. కేసులు నమోదైన వారిలో పలువురు అరెస్టయ్యారు. ఇంకొందరు బెయిలుపై ఉన్నారు. ఇంకా మరి కొందరు బెయిలు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది చాలదన్నట్లు అనారోగ్యం అంటూ ఆస్పత్రుల పాలౌతున్నారు. మొత్తం మీద ఇప్పుడు వైసీపీకి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.  

పోసాని కృష్ణమురళి వంటి వాచాలురు జైలు కెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే బెయిలు కూడా దొరక్క రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. అనారోగ్యం, బ్యాక్ పెయిన్ అంటూ బెయిలు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అవినీతి కేసులో మాజీ మంత్రి విడదల రజనీ హైకోర్టును ముందస్తు బెయిలు కోసం ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. నేడో రేపో ఆమె కూడా అరెస్టు కాక తప్పదన్న ప్రచారం జరుగుతోంది. అదే విధంగా క్వార్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మరో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ అరెస్టు భయంతో వణికి పోతున్నారు. ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ విచారణ వాయిదా వేసిన కోర్టు.. తాత్కాలిక ఊరట ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆయన మెడపై కూడా అరెస్టు కత్తి వేళాడుతోంది. ఇక బూతుల మంత్రిగా సుప్రసిద్ధుడైన కొడాలి నాని కూడా అరెస్టు భయంతో వణికిపోతున్నారు. తీవ్ర ఒత్తిడితో అనారోగ్యం పాలై హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు గుండె సంబంధిత సమస్యలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తన అక్రమాలకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన భూ కబ్జాలకు సంబంధించి దర్యాప్తు వేగం పుంజుకోవడంతో ఆయన కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇటీవల తన నివాసంలో బాత్ రూంలో జారిపడి చేయి విరక్కొట్టుకుని ఆస్పత్రి పాలయ్యారు. 

మొత్తంగా చూస్తుంటే జగన్ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కేసులనమోదు కావడంతో ఎప్పుడు, ఏ క్షణంలో పోలీసలు వచ్చి తలుపుతడతారా అన్న భయంతో వారి హెల్త్ దెబ్బతింటోందని నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు.  అనారోగ్యం కారణంగా  ముందస్తు బెయిల్ దొరికే చాన్స్ లు ఎక్కువ ఉంటాయని వైసీపీ నేతలు భావిస్తున్నట్లుగారని నెటిజనులు ఎగతాళి చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే  వైసీపీ నేతల అనారోగ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

ముందుగా  కొడాలి నాని విషయం తీసుకుంటే.. కొడాలి నాని  కొడాలి నాని గ్యాస్టిక్ ట్రబుల్ తో ఆస్పత్రిలో చేరారు. ఇన్ పేషంట్ గా చేరి రకరకాల పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు గుండెనొప్పి అని ప్రచారం జరిగింది.   గుండెల్లో బ్లాక్స్ ఉన్నాయని చెబుతున్నారు    గుడివాడలో నమోదైన కొన్ని కేసుల్లో కొడాలి ప్రమేయంపై ఆధారాలు సేకరించారు.  కొంత మంది ఖాతాల్లో డబ్బులు వేసి  ఆ తరువాత తన ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లుగా గుర్తించారు. ఇక అరెస్టు ఖాయమని అనుకున్న సమయంలో ఆయన ఆస్పత్రి పాలు కావడం జరిగింది. 

ఇక మద్యం కుంభకోణంలో  ప్రధానంగా వినిపిస్తున్న మిథున్ రెడ్డి, భూ, గనుల వ్యవహారాల్లో దోపిడీకి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా అరెస్టు కత్తి వేళాడుతోందంటున్నారు. మిధున్ రెడ్డి అయితే మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకూ ఆయన పేరు నమోదు కాలేదు. అయినా అరెస్టు భయంతో ముందస్తు బెయిలు తెచ్చుకన్నారు. తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతికి సర్జరీ జరిగిందంటూ  మిథున్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు.  ఇలా మొత్తంగా జగన్ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించి చట్టాలను చుట్టాలుగా చేసుకుని చెలరేగిపోయిన వారంతా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయినట్లుగా కనిపిస్తున్నది. 

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.