తిరుపతి లడ్డు వివాదం ..ధర్మారెడ్డి ఏరీ? ఎక్కడ?

Publish Date:Sep 23, 2024

Advertisement

తిరుమల తిరుపతి లడ్డూ వివాదంతో దేశం అట్టుడికిపోతున్నది. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందన్న విషయం ల్యాబ్ నివేదికతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. జగన్ హయాంలో దేవాలయాలపై జరిగిన అరాచకాలు, దాడులను మించి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగం.. ప్రజల మనోభావాలను తీవ్రాతి తీవ్రంగా దెబ్బతీసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశ ప్యాప్తంగా జనం ఆందోళనలకు దిగుతున్నారు. జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద కూడా బీజేపీ ధర్నా చేసింది. జగన్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. ఇక జాతీయ మీడియా తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై డిబేట్లు నిర్వహించింది. అంటే జగన్ హయాంలో తిరుమల పవిత్రత దెబ్బతిందని ప్రజలు సందేహాలకు అతీతంగా నిర్ధారణకు వచ్చేశారు.  ఒక్క చాన్స్ అంటూ ప్రజలను అభ్యర్థించి అధికారంలోకి వచ్చిన జగన్  ఐదేళ్ల పాటు బాధ్యతారహితంగా అరాచక పాలన సాగించారు. దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష సాధింపులే తన పాలనా విధానం అన్న రీతిలో జగన్ పాలన సాగింది. అదంతా పక్కన పెడితే..

 తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై మాట్లాడాల్సిన అప్పటి  తిరమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారం కూడా లేదు.  జగన్ హయాంో ఐదేళ్లపాటు  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఈ లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై మాట్లాడాలి. కానీ ఆయన ఆచూకీ తెలియడం లేదు.  

జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐదేళ్లు వెలగబెట్టిన ధర్మారెడ్డి.. 2024 ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు పదవీ విరమణ చేశారు.  జగన్ హయాంకు ముందు వరకూ టీటీడీ ఈవోలుగా పని చేసిన వారంతా ఐఏఎస్ అధికారులు మాత్రమే. కానీ  జగన్ అధికారం చేపట్టిన తరువాత టీటీడీ ఈవో నియోమకం విషయంలో సంప్రదాయానికీ, ఆనవాయితీకి పంగనామాలు పెట్టేసి ఐడీఈఎస్ (ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్)కి చెందిన ధర్మారెడ్డిని ఏరి కోరి మరీ టీటీడీ ఈవోగా నియమించుకున్నారు.  జగన్ అప్పగించిన బాధ్యతను ధర్మారెడ్డి తు.చ.తప్పకుండా నిర్వర్తించారు. తిరుమల పవిత్రతను మంటగలిపే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరిగినా పట్టించుకోలేదు. రాజకీయ ప్రసంగాలకు వేదికగా తిరుమల మారుతున్నా మాట్లాడలేదు. టీటీడీలో అన్యమతస్తులను కొలువులు కట్టబెట్టారు. ఇలా టీటీడీ జగన్ హయాంలో ధర్మారెడ్డి జాగీర్ అన్నట్లుగా మారిపోయింది. ధర్మారెడ్డి జాగీరు అంటే జగన్ జాగీరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సరే ఇప్పుడు జగన్ అధికారంలో లేరు. జగన్ హయాంలో టీటీడీలో రాజ్యమేలిన అరాచకం, అకృత్యాలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని వెలుగులోనికి వచ్చింది. వీటన్నిటికీ తొట్ట తొలుత బాధ్యత వహించాల్సింది అప్పటి ఈవో ధర్మారెడ్డి మాత్రమే. ఆ తరువాత అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయనకు మందు టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే వీరిలో ధర్మారెడ్డి మాత్రం కనిపించడం లేదు. వినిపించడం లేదు.  

ఐదేళ్ల పాటు డిప్యూటేషన్ పై ఆంధ్ర సర్వీస్ లో ఉన్న ధర్మారెడ్డి, తనకు జూన్ 30 వరకూ ఎక్స్ టెన్షన్ ఇవ్వాల్సిందిగా ఎన్నికలకు ముందు కోరారు. అందుకు కేంద్రం అంగీకారం కూడా తెలిపింది. అయితే ఎన్నికలలో జగన్ రెడ్డి పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ధర్మారెడ్డిని సెలవుపై పంపింది.  జూన్ 30తో ఎక్సటెన్షన్ ముగియటంతో సొంత క్యాడర్ లో చేరి ఉండాలి కానీ చేరారా లేదా అన్న సమాచారం లేదు.   

By
en-us Political News

  
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.