Publish Date:May 22, 2023
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆంధ్రప్రదేశ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. తెలంగాణలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయకముందే ఏపీ శాఖకు అధ్యక్షుడిని ఎంపిక చేసింది. అక్కడి నుంచి బీఆర్ఎస్ లో చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడమే కాకుండా..అలా చేరేవారికి వాహనాలు ఏర్పాటు చేసి మరీ హైదరాబాద్ కు తోలుకు వచ్చింది.
నగరమంతటా వారికి స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలూ ఏర్పాటు చేసింది. అంతే కాదు ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. విశాఖ స్టీల్ ప్రైవేటుపరం కాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుంది.. బిడ్ వేసి అవసరమైతే ఫ్యాక్టరీని సొంతం చేసుకుంటుందంటూ చాలా చాలా కబుర్లు చెప్పింది. అంతే ఆ తరువాత ఏపీలోని బీఆర్ఎస్ శాఖ అసలు ఉందో లేదో తెలియనంతగా సైలెంట్ అయిపోయింది. ఎంతా ఆర్భాటంగా విశాఖ స్టీల్ బిడ్ లో పాల్గొంటామంటూ సింగరేణి అధికారులను పంపి పరిశీలించిన తరువాత ఏమైందో ఏమో మిన్నకుండిపోయింది. దాంతో ఏపీలో బీఆర్ఎస్ పట్ల భ్రమలు.. ఏమైనా ఉంటే అవి పూర్తిగా అడుగంటిపోయాయి.
అలాగే ఏపీ సీఎం జగన్ది అప్పుల ప్రభుత్వం. కేసీఆర్ సంక్షేమ-అభివృద్ధి ప్రభుత్వాన్ని చూసి జగన్ చాలా నేర్చుకోవాలి అంటూ ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. ఇక తెలంగాణ మంత్రులు కూడా అవకాశం ఉన్నా లేకపోయినా.. సందర్భం ఉన్నా లేకపోయినా ఏపీ అభివృద్ధి లేమి గురిచి విమర్శలూ వ్యాఖ్యలూ చేశారు. అవన్నీ పక్కన పెడితే ఇంతని అంతని గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వస్తున్నారంటూ బిల్డప్ ఇచ్చారు. హడావుడీ, హంగామా చేశారు.
చివరకు ఆ కార్యాలయ ప్రారంభ కార్యక్రమం ఎవరికీ పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోంది అన్న చందంగా ఎవరికీ పట్టని ఒకె ప్రైవేటు కార్యక్రమంగా చప్పగా సాగిపోయింది. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చేసిన ప్రచారమూ ఉత్తుత్తిదేనని తేలిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/where-is-brs-in-ap-25-155735.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.