మాజీ మంత్రి బాలినేని.. ఏరీ? ఎక్కడా?

Publish Date:Dec 25, 2024

Advertisement

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మౌనం ప్రస్తుతం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ, అధికారం కోల్పోయిన తరువాత ఆయన జనసేన గూటికి చేరేంత వరకూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఆయన మాట్లాడితే ఒక సంచలనం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. ఎవరు ఔనన్నా కాదన్నా బాలినేని ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడు. ఇందులో సందేహం లేదు.  జిల్లా వ్యాప్తంగా ఆయనకు ప్రజలలో పరపతి ఉంది. జగన్ తొలి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న బాలినేని. ఆ తరువాత మూడేళ్లకు జరిగిన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో కేబినెట్ లో స్థానం కోల్పోయారు. అప్పట్లో ఆయన వ్యక్తం చేసిన అసంతృప్తి జగన్ ను గాభరా పెట్టింది. సజ్జల వంటి వారి రాయబారాలు కూడా ఫలించకపోవడంతో జగనే స్వయంగా రంగంలోకి దిగి బాలినేనిని బుజ్జగించాల్సి వచ్చింది. జగన్ కు బంధువు కూడా అయిన బాలినేని.. ఇక అప్పటి నుంచీ జగన్ ప్రభుత్వం పతనమయ్యే వరకూ వైసీపీలోనే కొనసాగినా.. నిత్య అసమ్మతి వాదిగా మిగిలిపోయారు. ఒక దశలో ఆయన జగన్ పాలిట రెండో ఆర్ఆర్ఆర్ (అప్పటి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు)లా మారిపోతారా అన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జోరుగా సాగింది.

ఏది ఏమైనా తన మాట చెల్లినా చెల్లకపోయినా బాలినేని మాత్రం ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలయ్యేంత వరకూ పార్టీలోనే ఉన్నారు. అయితే జగన్ తో ఆయన తీరు టామ్ అండ్ జెర్రీని తలపించేది. అలగడం, అవమానాలు భరించడం, అప్పుడప్పుడు ధిక్కార స్వరం వినిపించడం ద్వారా ఆయన అప్పట్లో జగన్ కు నిత్య తలనొప్పులు తెచ్చి పెట్టారు. మంకు పట్టు పట్టి మరీ ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి వైసీపీ నుంచి టికెట్ సాధించుకున్నా.. తాను కోరిన విధంగా మాగుంటకు ఒంగోలు లోక్ సభ టికెట్ ఇప్పించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. సరే ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా ఒంగోలులో పరాజయాన్ని  చవి చూశారు. ఆ తరువాత ఆయన వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు.  అక్కడి వరకూ బానే ఉంది. ఆయన జేనసేనలో చేరే సమయంలో పెద్ద ఎత్తున హంగామా చేయాలని భావించినప్పటికీ జనసేనాని పడనివ్వలేదు. బుద్ధిగా ఒక్కడిగా వచ్చి పార్టీ కండువా కప్పుకోవాలని విస్ఫష్టంగా చెప్పడంతో ఆయన జేనసేనలో చేరిక నిరాడంబరంగా జరిగిపోయింది. 

ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి.. మందీ మార్బలంతో ఆర్బాటంగా జనసేన కండువా కప్పుకోవాలని ఆయన భావించినా జనసేనాని అంగీకరించలేదు. మంగళగిరి వచ్చి ఒక్కడిగా పార్టీ కండువా కప్పుకోవాలని ఆదేశించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన ఆ పని చేశారు. అప్పట్లో కొంత విరామం తరువాత జనసేన తరఫున ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జనసేనానినిని తీసుకువస్తానని అప్పట్లో బాలినేని చెప్పినప్పటికీ నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా పడలేదు. అలాగే పార్టీ పదవి, మండలి సభ్యత్వం ఆశించిన బాలినేనికి జనసేనాని వాటిని ఆవిరి చేశారని బాలినేని అనుచరులు చెబుతున్నారు. నాగబాబుకు మండలి సభ్యత్వం, కేబినెట్ లో స్థానం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక బాలినేనికి రాజ్యసభ స్థానం జనసేన ద్వారా అందని ద్రాక్షేనని తేలిపోయింది.

అసలు ఆయన జనసేన చేరికను ఆ పార్టీ మిత్రపక్షం తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల నుంచి తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది. వాటన్నిటినీ అధిగమించి ఎలాగోలా జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేనికి ఆయన ఆశించిన ప్రాధాన్యతా పార్టీలో దక్కకపోవడం నిరాశనే మిగిల్చింది. అయితే ఎలాగోలా జనసేనలో ఒకింత ప్రాధాన్యత సాధించుకోవాలన్న తాపత్రయంతో అదానీ నుంచి జగన్ కు ముడుపులు అందినట్లు అమెరికాలో కేసు నమోదైన సందర్భంలో బాలినేని మీడియా ముందుకు వచ్చి అప్పట్లో తాను మంత్రిగా ఉన్నానని గుర్తు చేసి మరీ అప్పట్లో తనను అర్ధరాత్రి లేపి మరీ సంతకాలు చేయమని జగన్ ఒత్తిడి చేశారని చెప్పి ఒకింత సంచలనం సృష్టించారు. అయితే అదేమీ ఆయనకు జనసేనలో పెద్ద పీట వేయడానికి దోహదపడలేదు. పార్టీ అధిష్ఠానం బాలినేనిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో  బాలినేని గత్యంతరం లేని పరిస్థితుల్లో మౌనాన్ని ఆశ్రయించారు.  ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో బాలినేని ఏరీ? ఎక్కడా అంటూ చర్చ జరుగుతోంది. 

By
en-us Political News

  
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.