Publish Date:Jun 19, 2025
ఉమ్మడి చిత్తూరు జిల్లా అనగానే వైసీపీ కంచుకోట అనేలా గత ఐదు సంవత్సరాలు పాలన సాగించారు. ఓవైపు పెద్దిరెడ్డి, ద్వారకానాథ రెడ్డి, మిథున్ రెడ్డి, మరో వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, ఇంకో వైపు కరుణాకర్ రెడ్డి ఇలా ఒక్కరేమిటి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే లు, వైసీపీ కీలక నాయకులు చేసిన హడావిడి అంతాఇంతా కాదు. అలాంటి నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అరాచశక్తుల అరెస్టుల పై నోరు మెదపడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గా ఎన్నికై ఆ తరువాత వెనక్కి ఇచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నోరేసుకుని ముందు వరసలో నిలబడే మాజీ మంత్రి రోజా, దొంగ ఓట్లు నమోదు చేయించడంలో సిద్దహస్తుడైన ప్రస్తుత ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు ఏమీ మాట్లాడటం లేదు. గడిచిన రోజుల్లో భూకబ్జాలు, మఠం భూముల స్వాహాపై పెద్దిరెడ్డి పై వచ్చిన ఆరోపణలు, మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర పై ఆరోపణలు, ఇక తాజాగా అరెస్టు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతా జిల్లా నేతలే అయినా నోరెత్తి మాట్లాడేందుకు వైసీపీ నేతలకు ధైర్యం చాలడం లేదు.
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఎన్నికైన వారు సైతం అప్పుడో.. ఇప్పుడో ప్రెస్ మీట్లు పెట్టి నాలుగేళ్ల తరువాత తాము అధికారంలోకి వస్తాం, అంతుచూస్తాం అంటూ బీరాలు పలుకుతున్నారు తప్ప, తమ వారు చేసింది కరెక్టేనన్న మాట చెప్పడానికి వారికి నోరు రావడం లేదు దీనిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారు కనునకే ఇప్పుడు వారికి తగిన శాస్తి జరుగుతోంది. వారికి శిక్ష పడాలి అంటూ బాహాటంగానే చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు, క్యాడర్ మాత్రం కలుగులో దాక్కున్నట్లుగా మనదాకా రాకుంటే బాగుండును అనుకుంటూ మౌనంగా ఉంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/where-are-ycp-leaders-39-200267.html
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ బుధవారం అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలతో పాటు నిలుచుని, జేబులో నుండి ఐదు రూపాయలు చెల్లించి క్యాంటీన్లో భోజనం అందుకున్నారు.
ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టులో పది రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సభాపతి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
మొన్నటి విశ్వవసు నామ సంవత్సర ఉగాది పంచాంగం చదువుతుండగా ఆ పండితుడు చెప్పిందేంటంటే జగన్ కి స్త్రీ మూలక సమస్యలు ఎక్కువగా వస్తాయని. ఆ సరికే ఆయన తన తల్లి చెల్లితో పీక లోతు పోరాటం చేస్తున్నారు. కేసులు గట్రా వ్యవహారాలు నడుస్తున్నాయ్.
కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో నాలుగురు మృతి చెందారు. గాంధీ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న సీతారామం అనే వ్యక్తి మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బ తీసేలా వివిధ సంస్థలకు వైసీపీ శ్రేణులు ఈ మెయిల్స్ పెట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటించారు.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తీవ్రంగా ఖండించారు.
మామిడి రైతుల పరామర్శ కోసం చిత్తూరు జిల్లా బంగారుపాళెంకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అడుగడుగునా ఉల్లంఘన చేస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ బంగారుపాలెం పర్యటనలో ఓ మీడియా ఫొటో గ్రాఫర్ శివకుమార్పై వైసీపీ అల్లరి మూకలు దాడి చేశారు. మాజీ సీఎం అక్కడ రైతులతో మాట్లాడే ఫోటోలు తీసున్న ఫోటోగ్రాఫర్ దాడి చేశారు.
కర్ణాటకం మరోమారు తెరపై కొచ్చింది. నిజానికి.. కర్ణాటకలో రెండేళ్ళ క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కౌన్ బనేగా ముఖ్యమంత్రి అనే సీరియల్ తెర పైకి వచ్చింది. అయితే.. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య సంధి కుదిర్చింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకరరావును ఇప్పటికే పలు మార్లు విచారించిన సిట్ అధికారులు తాజాగా ఆయన ఫోన్ ను,ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులను గుర్తించిన సిట్.. బాధితులకు కూడా నోటీసులు ఇచ్చి వారి వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నది.
రాజస్థాన్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ జాగ్వర్ ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ కుప్పకూలింది. చురు జిల్లాలోని రతన్గఢ్ ప్రాంతంలో క్రాష్ అయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఏంటని ఇండియాలో గల్లీలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అదీ ఐపీఎల్ కు ఉన్న వాల్యూ. అదీ ఐపీఎల్కున్న క్రేజ్, ఫేమ్. ప్రతి ఏటా కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరిస్తూ.. అంతకంతకు ఆదరణను పెంచుకుంటోంది