ఉదయం లేదా సాయంత్రం.. ఏ సమయంలో విటమిన్-డి వేగంగా లభిస్తుంది?

Publish Date:Nov 20, 2025

Advertisement


విటమిన్ డి ఉత్పత్తికి సూర్యరశ్మి చాలా ముఖ్యం.  అందుకే  దీనిని  సన్ లైట్ విటమిన్ అని కూడా  పిలుస్తారు. శీతాకాలంలో చాలా మంది  విటమిన్ డి లోపాన్ని ఎదుర్కొంటారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు.  కానీ ప్రధాన కారణం మాత్రం  శీతాకాలంలో సూర్యరశ్మి సూర్యుడి ప్రకాశం తక్కువగా ఉండటం. వాతావరణంలో పొగమంచు,  కాలుష్యం కారణంగా సూర్యకిరణాలు నేలను సరిగ్గా చేరుకోలేవు. ఇది మాత్రమే కాకుండా శీతాకాలంలో చలి కారణంగా వెచ్చని దుస్తులు ధరిస్తుంటాము.   చర్మం సూర్యరశ్మికి గురి కాకుండా ఉండటానికి ఇది కారణం అవుతుంది.  విటమిన్ డి మన శరీరానికి, ముఖ్యంగా ఎముకల బలం,  రోగనిరోధక శక్తికి చాలా అవసరం. ఉదయం లేదా సాయంత్రం.. ఏ సమయంలో సూర్యరశ్మికి గురి కావడం వల్ల విటమిన్-డి బాగా లభిస్తుందో తెలుసుకుంటే..

విటమిన్-డి.. ఏ సమయంలో లభిస్తుంది..

అతినీలలోహిత B సూర్యకాంతి బలంగా ఉన్నప్పుడు మన శరీరాలు విటమిన్ D ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయట. ఇది సాధారణంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు వాతావరణం ద్వారా అతి తక్కువ దూరం ప్రయాణిస్తాయి.

మద్యాహ్న సూర్యకాంతి మంచిదా?


శీతాకాలంలో సన్‌స్క్రీన్ లేకుండా శరీరంలోని కొన్ని ప్రాంతాలను.. అంటే.. చేతులు, ముఖం వంటి ప్రాంతాలను  20-30 నిమిషాలు ప్రత్యక్ష సూర్యకాంతికి గురిచేస్తే సరిపోతుందట. ఈ  వ్యవధిలో శరీరం తగినంత మొత్తంలో విటమిన్ డిని వేగంగా సంశ్లేషణ చేస్తుందట.

కాలం, భౌగోళిక స్థానం..

విటమిన్ డి సంశ్లేషణ వ్యవధి భౌగోళిక స్థానం అంటే భూమధ్య రేఖ నుండి నివసించే దూరం, సీజన్,  చర్మం రంగుపై ఆధారపడి ఉంటుందట. ముదురు రంగు చర్మం ఉన్నవారికి లేత చర్మం ఉన్నవారి కంటే విటమిన్ డి సంశ్లేషణ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందట. అందువల్ల అవసరాలకు అనుగుణంగా,  జాగ్రత్తగా సూర్యరశ్మిని తీసుకోవడం మంచిది.

జాగ్రత్తలు..

మధ్యాహ్న సూర్యరశ్మి  విటమిన్ డి కి ఉత్తమమైనది అయినప్పటికీ, ఇది చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందట. అందువల్ల చర్మవ్యాధి నిపుణులు  చర్మ రకం,  భౌగోళిక స్థానం ఆధారంగా ఎండలో ఎంతసేపు ఉండాలనే విషయాన్ని అవగాహన చేసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్న  సమయంలో సూర్యరశ్మిలో ఉండేవారు  30 నిమిషాల కంటే ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికాకుండా ఉండాలట.   చర్మం కొద్దిగా గులాబీ రంగులోకి మారుతున్నట్టు అనిపించగానే వెంటనే నీడలోకి వెళ్లడం సన్ స్క్రీన్ రాసుకోవడం వంటివి చేయాలి.  విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి విటమిన్-డి ఆహారాలు, మంచి పోషకమైన ఆహారాలు తీసుకోవాలి.

                               *రూపశ్రీ.

By
en-us Political News

  
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  
ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.