ప్రజాప్రతినిథుల విందు వెనుక లోకేష్ ప్లానేంటి?

Publish Date:Feb 27, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు, అలాగే  రాష్ట్రంలో రానున్న రోజులలో రాజకీయపరిస్థితులు ఎలా మారబోతున్నాయి. క్వాంటం, ఏఐ అంటూ సాంకేతికతపై చంద్రబాబు సర్కార్  చూపుతున్న ప్రాధాన్యత తదితర విషయాలపై ‘వాస్తవ వేదిక’తో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ చర్చించారు. అత్యంత విశ్లేషణాత్మకంగా సాగిన ఈ చర్చలో  నారా లోకేష్ ఆత్మీయ విందుపై డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ డిన్నర్ డిప్లమసీని తాను గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకున్నారన్నారు.  నారా లోకేష్ గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యేలతో, పార్టీ సీనియర్లతో పెరిగిన దూరాన్ని తగ్గించుకోవడానికి ఆత్మీయ విందును ఒక దౌత్య మార్గంగా లోకేష్ ఎంపిక చేసుకున్నారన్నారు. అంతే కాకుండా ముందుముందు ఆయన సీఎం కావడానికి ఈ ఆత్మీయ విందు కార్యక్రమం పీఆర్ ఎక్సర్ సైజ్ గా డోలేంద్ర ప్రసాద్ అభివర్ణించారు. గతంలో నారా లోకేష్ తనకంటూ ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో భాగంగా పార్టీ సీనియర్లను దూరం చేసుకున్నారనీ, ఇప్పుడు ఆ దూరాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నారనీ ఆయన పేర్కొన్నారు.

అందుకు డిన్నర్ డిప్లమసీని ఎంచుకున్నారని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఈ కార్యక్రమం భవిష్యత్ లో లోకేష్ సీఎం కావడానికి దోహదపడుతుందన్నారు. ఈ దశలో కంఠంనేని రవిశంకర్ లోకేష్ సీఎంగా ఉండేందుకు పవన్ కల్యాణ్ ఇష్టపడతారా అని ప్రశ్నించారు.  దీనికి డోలేంద్ర ప్రసాద్.. లోకేష్ సీఎం కావాలంటే కావలసింది పవన్ కల్యాణ్ సమ్మతి కాదనీ, ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరమని అంటూ.. పవన్ కల్యాణ్ ను రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు. పైగా ఈ ప్రతిపాదన ఢిల్లీ నుంచే వచ్చిందన్న సమాచారం ఉందన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లోపవన్ కల్యాణ్ సమ్మతి లేకుండా లోకేష్ సీఎం అవ్వడం కష్టసాధ్యమనీ, అందుకే ఆయనకు కేంద్ర మంత్రిపదవి అంటూ మోడీ ద్వారా నరుక్కువస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.  

అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మాత్రమే బిల్ గేట్స్ తాజా పర్యటన ఉపయోగపడుతుంది తప్ప మరోటి కాదన్నారు. గతంలో బిల్ గేట్స్ ఏపీ పర్యటన మైక్రోసాఫ్ అధినేతగా ఉన్నప్పుడు జరిగిందనీ, అయితే ఇప్పుడు ఆయన ఆ ఉద్యోగంలో లేరని గుర్తు చేశారు. పైగా ఇప్పుడు డిల్ గేట్స్  తన ఛారిటీ ద్వారా దాతృత్వ కార్యక్రమాలపై  దృష్టి సారించారనీ, అందువల్ల ఇప్పపటి ఆయన పర్యటన, విద్య, ఆరోగ్యం, పాలనలో టెక్నాలజీకి సహకారం అందే అవకాశం అయితే ఉందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.  ఇక చంద్రబాబు ఘనంగా, గొప్పగా చెప్పుకుంటున్న క్వాంటం వల్ల రాష్ట్రానికి సాంకేతిక గుర్తింపు లభిస్తుంది తప్ప సామాన్య ప్రజలపై, ఐటీ ఉద్యోగాలపై ఇది ఇప్పటికిప్పుడు చూపే ప్రభావం చాలా చాలా పరిమితమన్నారు. ఇక తక్షణ ప్రయోజనం కూడా దాదాపు శూన్యమేనని డోలేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. 

వాస్తవ వేదిక పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో ఈ కింది లింక్ ద్వారా వీక్షించండి

 

By
en-us Political News

  
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం త‌న వ‌ల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జ‌న‌రేటెడ్ వీడియో అన్నారు. ఇందులో త‌న ప‌రువు తీసే కుట్ర దాగి ఉంద‌న్న బీఆర్ నాయుడు.. త‌న‌తో పాటు టీటీడీ ప్ర‌తిష్ట మంట‌గ‌లిపే య‌త్నం ఉంద‌ని ఆరోపించారు. అందుకే తాను సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించానన్నారు.
ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాశీనత.. కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లైందని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విషయాన్ని కల్వకుంట్ల కవిత కోర్టు తీర్పు అనంతరం మీడియా సమావేశంలో ఎత్తి చూపారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి.
2047నాటికి ఆంధ్రప్రదేశ్ ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యం అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే అది జరిగి తీరుతుంది. ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించడమే తన ముందున్న కర్తవ్యమని చెప్పారు.
లిక్కర్ పాలసీపై తప్పుడు కేసు పెట్టి ఆమ్ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షాలు కుట్ర పన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ నమోదు చేసిన కేసులో తనతో పాటు అందరికీ క్లీన్ చిట్ ఇస్తూ న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు.
వైవీ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంలో ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదు కానీ, మిగిలిన వ్యవహారాల్లో మాత్రం ఆయన బాగానే సంపాపదించారని పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి తాను ఇంత వరకూ ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచానన్నబాలినేని, ఆ ఓడిపోయిన రెండు సందర్భాలలోనూ కూటమి చాలా బలంగా ఉందని గుర్తు చేశారు.
ఈ కేసులో తాను టార్గెట్ అయ్యాన‌న్నారు. తాను రాజ‌కీయ బాధితురాలిన‌ని, ఎవరిమీదో ఉన్న అక్కసుతో తనపై ఈ కేసు అన్యాయంగా బనాయించి జైలుకు పంపారని కవిత అన్నారు. ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
పన్నీర్ సెల్వం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు పొందారు. జయలలిత కోర్టు తీర్పుల కారణంగా సీఎంగా రాజీనామా చేయాల్సి వచ్చిన ప్రతిసారీ తన వారసుడిగా పన్నీర్ సెల్వంను సీఎం కుర్చిలో కూర్జోపెట్టడం రివాజు. అటువంటి పన్నిర్ సెల్వం జయలలిత మరణం తరువాత డీఎంకేలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.
మద్యం కుంభకోణం పాలసీ రూపకల్పనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందిపై మోపిన అభియోగాలను కొట్టివేస్తూ, వారిని నిర్దోషులుగా పేర్కొంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
ముఖ్యమంత్రి వెయ్యి కోట్ల రూపాయలను గాంధీ కుటుంబానికి పంపిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి నిధుల సమీకరణ కోసమే ఇళ్లను కూల్చివేసి, భూములను అమ్మే ప్రయత్నాలుచేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు పేదల గృహాలను నేలమట్టం చేస్తూ, మరోవైపు హైదరాబాద్‌లో ముఖ్య మంత్రి తన రెండో పాలస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.