Publish Date:Oct 20, 2021
బోసడీకే. ఏపీలో ట్రెండింగ్ పదం. కొందరికి ఈ పదం పాతదే అయినా.. చాలామందికి ఈ పదం ఇప్పుడే తెలిసింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి.. సీఎం జగన్ను ఉద్దేశించి బోసిడీకే అనే పదాన్ని వాడటం.. అది రచ్చ రచ్చకు దారి తీయడం.. ఏపీలో తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. వైసీపీ రౌడీ మూకలు.. టీడీపీ కార్యాలయాలపై పడి విధ్వంసం సృష్టించారు. కట్ చేస్తే.. వైసీపీ దాడులను సీఎం జగన్ సమర్థించడం, పలువురు మంత్రులు మళ్లీ టీడీపీనే బెదిరించడం.. పోలీసులు సైతం ఏకంగా నారా లోకేశ్తో పాటు పలువురు నాయకులపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేయడం.. చంద్రబాబు 36 గంటల దీక్షకు దిగుతుండటం.. రాష్ట్రపతి పాలన విధించాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షాను డిమాండ్ చేయడం.. ఇలా ఏపీ రాజకీయాలు రావణకాష్టంలా రగులుతున్నాయి. ఇంతటి రచ్చ రంభోలాకు కారణం.. పట్టాభి వాడిన బోసిడీకే అనే పదం. ఇంతకీ బోసీడీకే అంటే అర్థం ఏంటి? అది తిట్టేనా? లేక, మరేదైనా మీనింగ్ ఉందా? అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
తాజాగా, బోసిడీకే పదానికి అర్థం ఏంటో వివరించారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. బోసడీకే అంటే తిట్టు కాదని తేల్చారు. బోసడీకే అంటే అర్థం ‘మీరు బాగున్నారా’ అని గూగుల్లో ఉందని రఘురామ తెలిపారు.
‘‘టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారు అన్న ఈ పదానికి అర్థం ఏంటా? అని నా స్నేహితులు పాతికమందిని అడిగా. వైసీపీలోని నా అజ్ఞాత స్నేహితులను కూడా అడిగా. ‘ఏమో మాకూ తెలీదు.. ఏదో బూతు పదమేమో’ అని చెప్పారు. అప్పుడు నేను గూగుల్లో వెతికా. అందులో చాలా స్పష్టంగా ఉంది. ‘సర్.. మీరు బాగున్నారా’ అనేది సంస్కృతంలో బోసడీకే అనే పదానికి అర్థం.’’ అని రఘురామ రాజు వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-the-meaning-of-bhosdike-25-124872.html
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రతిష్ఠాత్మక సంస్థలు తరలి వస్తున్నాయి. తాజాగా మరో ప్రతిష్ఠాత్మ విద్య సంస్థ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. అమరావతిలో న్యాయ విశ్వవిద్యాలయం లా యూనివర్శిటీ ఏర్పాటు కానుంది.
వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు న్యాయశాస్త్ర ప్రవేశ పరీక్ష (లాసెట్)కు హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఆయన లాసెట్ పరీక్ష రాశారు.
జగన్ కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డికి విజిలెన్స్ నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పని చేశారు.
తొక్కిసలాటతో తప్పెవరిది? జనం ఇంతగా ఎగబడుతున్నారేంటి? పుష్ప 2 రిలీజ్ సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందగా... ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఇప్పటికీ కోలుకోలేదు. ఇక వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో తొక్కిసలాట జరిగి టీటీడీ చరిత్రలోనే అతి భారీ ప్రాణ నష్టం సంభవించింది.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదైంది. ఇష్టారీతిగా నోరు పారేసుకోవడమే కాకుండా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై పట్టభిపురం పోలీసులు స్టేషన్ లో కేసు నమోదైంది.
పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం అగ్ర ప్రాథాన్యత ఇస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా చంద్రబాబు చేసిన ట్వీట్ లో ప్రకృతి ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తిరుమa లడ్డూ ప్రసాదం లో వినియోగించే నెయ్యి కలుషితం అంశంపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది.
సెలవు దినాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ కుటుంబం తో గడపాలని, లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని చూస్తారు. కానీ ఈ గవర్నమెంట్ టీచర్ రూటే సెపరేటు. గురువుగా తన విద్యార్థులకు విజ్ణాన బోధతో పాటు వినోదం, విహారలతో విషయపరిజ్ణానం అందించాలని భావిస్తారు.
తిరుమల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియమితులైనగా మరళికృష్ణ బుధవారం (జూన్ 4) బాధ్యతలు స్వీకరించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం క్రూరమైనదనీ, అరాచకమైనదనీ అన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (జూన్ 5) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు.అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.