నేనేమీ చేశాను నేరం.. శోక సంద్రంలో మాజీ హోంమంత్రి

Publish Date:Apr 29, 2022

Advertisement

మేకతోటి సుచరిత... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మాజీ మంత్రి. ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉండి కూడా ఈ సుచరిత... ఏనాడు.. ఎఫ్పుడు... ఎక్కడా.. అధికారం అడ్డం పెట్టుకుని.. హల్‌చల్ చేయలేదు. మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న ఆమె.. ఎన్ని ప్రెస్‌మీట్లు పెట్టిందంటే మాత్రం వెళ్ల మీద లెక్క పెట్టి మరీ చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే.. అంతా కామ్ గోయింగే. తన పనేదో తనదే... ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే మాత్రం తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు వస్తేనే కానీ ఈ హోం మంత్రిగారు ప్రెస్ మీట్ పెట్టీ నోరు విప్పిరంటూ సుచరిత మీద ప్రతిపక్ష టీడీపీ అయితే ఓ అపవాదు కూడా వేసి పారేసింది. 


అయితే జగన్ కేబినెట్ ఇటీవల కొత్తగా కొలువు తీరడం.. ఆ క్రమంలో సుచరిత కామెంట్స్ చేయడం.. ఫ్యాన్ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ.. రంగంలోకి దిగి ఆమె ఇంటికి వెళ్లడం.. ఆయన చేతినే సుచరిత.. తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా లేఖ ఇవ్వడం.. ఇదే విషయాన్ని సుచరిత కుమారుడు, కుమార్తె స్వయంగా మీడియాకు వెళ్లడించడం... ఆ క్రమంలో సుచరిత నివాసం వద్ద ఆమె అనుచరులు అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఓ రెంజ్‌లో ఫైర్ కావడం.. ఆ తర్వాత సీఎం జగన్‌తో సుచరిత భేటీ అవడం.. అనంతరం ఆమె కూల్‌గా మీడియా ముందుకు వచ్చి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేదు.. ఏమీ లేదు.. అంటూ ముక్తాయింపు ఇవ్వడం జస్ట్ మూడు నాలుగు రోజుల్లో అంత సద్దుమణిగిపోయింది. 


అయితే మేకతోటి సుచరిత హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె మాజీ మంత్రి అయ్యే వరకు.. సొంత పార్టీలోనే చాలా సమస్యలు ఎదుర్కొన్నారని సమాచారం. హోం మంత్రిగా ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉన్నా.. ఆమెకు ఈ జగన్ ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వలేదని మేకతోటి సుచరిత తరచు తన సన్నిహితుల వద్ద వాపోయే వారట. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి అయినా ఆమెకు సరైన ప్రోటోకాల్ కూడా పాటించేవారు కాదని సుచరిత సొంత నియోజకవర్గ ప్రజలే గుసగుసలాడుకోవడం గమనార్హం. ఇక ఆమె ప్రెస్‌మీట్ పెట్టాలంటే.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రావాలని.. ఈ నేపథ్యంలో ఒకానొక సమయంలో ఆమె తీవ్ర  నిరాశా నిస్పృహాలోకి వెళ్లిపోయారని పత్తిపాటులోని కేడర్‌లో ఓ టాక్ అయితే నేటికి వైరల్ అవుతోంది. 


అంతేకాదు.. మంగళగిరి నియోజవకర్గంలో అయితే కొన్నిప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సైతం శిలాఫలకాలపై ఆమె పేరు ఉండేది కాదట... ఈ విషయం ముందుగానే తెలుసుకుని.. ఆయా కార్యక్రమాలకు సుచరిత డుమ్మా కొట్టేవారని నియోజకవర్గ ప్రజలే చెప్పుకోవడం గమనార్హ:. మరోవైపు తన శాఖను అనదికారికంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా సార్లు నిర్వహించడం పట్ల సుచరిత.. లోలోపల రిగిలిపోయే వారని సమాచారం.  అంతేకాదు.. జగన్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా నిర్వహించే ప్రపంచ మహిళా దినోత్సవం తదితర కార్యక్రమాల్లో విడుదల రజినీ, రోజా, వాసిరెడ్డి పద్మ, తానేటి వనిత తదితరులు ఉన్నా.. అక్కడ సుచరిత లేక పోవడం పట్ల .. పార్టీ మహిళల్లోనే ఓ సందేహాలు వ్యక్తమయ్యేవని సమాచారం. 

అదీకాక సుచరిత భర్త మేకతోటి దయాసాగర్. ఆయన ఐఆర్ఎస్ అధికారి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఆయన కీలక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఆగమేఘాల మీద రంగంలోకి దిగి.. భార్య కీలక మంత్రి పదవిలో ఉండి.. భర్త మరో కీలక పదవిలో ఉండడం చట్టాలకు విరుద్దమంటూ సదరు కీలక నేతలు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేయడమే కాదు..నాటి హోం మంత్రి సుచరిత భర్తను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు బదిలీపై సాగనంపే వరకు సదరు ఫ్యాన్ పార్టీ నేతలు విశ్రమించిందే లేదని సమాచారం. ఆ తర్వాత ఈ విషయాలన్నీ తెలుసుకున్న సుచరిత.. తనలో తానే కన్నీరుమున్నీరు అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఎప్పుటికప్పుడు మిన్నకుండి పోవడం తాను చేసిన పెద్ద తప్పని సుచరిత తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.