Publish Date:Jun 14, 2025
కృష్ణుడిలా ఛాన్స్ మిస్ చేసుకుని
చరిత్రలో దుర్యోధనుడిలా మిగిలారుగా!
చాలా మంది తెచ్చే పోలిక ఏంటంటే భావప్రకటనా స్వేచ్ఛ విషయంలో ఆనాడు రఘురామకృష్ణం రాజు, నేడు కొమ్మినేని అవలీలగా బెయిల్ తెచ్చుకోవడం. ఆయనకూ ఈయనకూ తేడా ఇదేనంటారు. ఆనాడు రఘురామ వైసీపీలోనే ఒక రెబల్ ఎంపీ గా ఉంటూ, అధినేత జగన్ పై తరచూ విరుచుకుపడేవారు. ఇద్దరి మధ్య ఎక్కడ ఏ ఇగో క్లాష్ వచ్చిందో తెలీదుగానీ మొత్తానికి ఆనాడు రఘురామ భారీ ఎత్తున వైసీపీ నావ మునిగిపోయేలా చేశారు. తర్వాత ఆయన తెలివిగా ఆ చిల్లుపడ్డ నావ నుంచి బయటకొచ్చారు. కూటమిలో చేరారు. ఇవాళ ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఏపీ డిప్యూటీ స్పీకర్ హోదాలో పొలిటికల్ కెరీర్ సెట్ చేసుకున్నారు.
ఇదంతా ఇలా ఉంచితే కొమ్మినేనికీ ట్రిపుల్ ఆర్ కి ఉన్న పోలిక విషయానికి వస్తే.. ఇద్దరూ ఈ స్వేచ్చ ద్వారా బయట పడ్డవారే. అయితే అక్కడ రఘురామ వ్యక్తిపై చేసిన దాడికీ, ఇక్కడ కొమ్మినేని వ్యవస్థపై జరిగిన దాడికి కారకులు. అలాగంటే ఆ మాటలు కూడా తాను అనలేదంటారు కొమ్మినేని. ఈ విషయంలో ఆయన్ను కొట్టిపడేయలేం. నిజానికి ఆయనేమీ ఈ మాట అనలేదు. కానీ తన డిబేట్ లో ఒక ఎనలిస్టు ఈ కామెంట్లు చేస్తుంటే.. దాన్ని ఆయన రక్షణార్ధం ఆపమని అన్నారేగానీ.. అమరావతి మహిళల మాన రక్షణార్ధం అనలేదు. ఇక్కడే ఆయన కృష్ణుడు కాదగిన అవకాశం మిస్ చేసుకున్నారని అంటారు.
ఇదే మహా భారత యుద్ధానికి లీడ్ పాయింట్ అయిన.. ద్రౌపదీ వస్త్రాపహరణంలో దుశ్శాసనుడి పాత్ర.. కృష్ణంరాజు తీసుకున్నారు. అమరావతి మహిళలంతా కలసి ద్రౌపది రూపంలోకి మారిపోగా.. ఇక్కడ ఒక దుర్యోధనుడిలా కొమ్మినేని వ్యవహరించినట్టు కనిపించింది. ఇక్కడ దుశ్శాసనుడ్ని కాపాడ్డమెలా అన్న కోణంలో దుర్యోధనడిలా కొమ్మినేని థింక్ చేశారేగానీ.. శ్రీకృష్ణ పరమాత్మలా వ్యవహరించలేక పోయారని అంచనా వేస్తారు.
బేసిగ్గా ఇలా చేయడం ఆయనకు కూడా చేటు తెచ్చేదే. ఎందుకంటే ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వార్తా సంస్థ కావచ్చు. దాని వెనకున్న పార్టీ కావచ్చు.. అమరావతికి పూర్తి వ్యతిరేకం. ఒక వేళ కొమ్మినేని ఆ సమయంలో అమరావతి వైపున ఉంటే ఆయనకున్న ఉద్యోగం సద్యోగం మొత్తం ఊడిపోయి ఉండేవి. దీంతో ఆయనెంతో తెలివిగా దుశ్శాసుడి (ఎనలిస్టు కృష్ణంరాజు) వైపే నిలిచారు. దీంతో ఆయన అమరావతి మహిళాలోకం దృష్టిలో దుర్యోధనుడిగా పేరు సాధించారే గానీ తనకు అందివచ్చిన కృష్ణావతారం దాల్చడానికి ఛాన్స్ తీస్కోలేక పోయారు కొమ్మినేని.
అంటే తన స్వార్ధం కోసం అమరావతి మహిళలను ఇక్కడ కొమ్మినేని ఫణంగా పెట్టినట్టే లెక్క. అందుకే ఆయనకు సుప్రీం బెయిల్ ఇచ్చినా.. అమరావతి మహిళల దృష్టిలో ఆయన జీవితకాలం దోషిగా నిలవక తప్పదన్న విశ్లేషణలు అందుతున్నాయ్. ఏమంటారు?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-freedom-of-expression-kommineni-39-199911.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.