ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిదేనా? అలా చేస్తే  జరుగుతుందో తెలుసా?

Publish Date:Oct 24, 2025

Advertisement

ఆహారం ఔషదం అని అంటారు. మనం తీసుకునే ఆహారమే శరీరానికి మూలాధారం. అదే శక్తిని ఇస్తుంది. సాధారణంగా ఆహారం తినేటప్పుడు, తిన్న వెంటనే నీరు తాగడం అనేది చాలామంది అలవాటు. కొందరు ఆహారం తిన్నంత వరకు అస్సలు నీరు తాగరు. కానీ ఆహారం తిన్న తరువాత మాత్రం కనీసం అరలీటరు నీళ్లు వేగంగా తాగేస్తుంటారు.  కానీ ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అనే చర్చ ఇప్పుడు దుమారం లేపుతోంది. దీని గురించి ఆరోగ్య నిపుణులు స్పందించారు. ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం ఎంత వరకు కరెక్ట్? అలా నీరు తాగితే జరిగేదేంటి? అనే విషయాల గురించి కూడా స్పష్టత ఇచ్చారు.

ఆహారం తినేటప్పుడు నీరు తాగడం అవసరమేనా?

ఆహారం తినేటప్పుడు నీరు తాగడం చాలా మంది అలవాటు. ఆహారం తినేటప్పుడే కాదు తిన్న తరువాత కూడా నీరు తాగడం అస్సలు అవసరమే లేదన్నది ఆహార నిపుణులు, వైద్యుల మాట. ఎందుకంటే ఆహారం తినేటప్పుడు దాన్ని బాగా నమిలి తింటే నోట్లో ఊరే లాలాజలంతో కలిసి ఆహారం తగినంత ద్రవంగా మారుతుంది. ఇది నేరుగా జీర్ణాశయానికి వెళ్లి అక్కడ జీర్ణ ఎంజైమ్ లతో కలిసి సులువుగా జీర్ణమవుతుంది. అందుకే ఆహారం తినేటప్పుడు అస్సలు నీరు తాగాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆహారం కారంగా ఉన్నా, ఎక్కువ ఘనపదార్థాలు అయినా దానికి తగినట్టు చాలా కొద్ది మొత్తంలో ఒక అరగ్లాసు లోపు నీరు తాగడం మంచిది. అంతకు మించి నీరు తాగాల్సిన అవసరమే లేదని ఆహార నిపుణులు చెబుతున్నారు.

ఆహారం తిన్నవెంటనే నీరు తాగితే  ఏం జరుగుతుంది?
 
ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం అనేది సరైన పని కాదని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. కొందరు ఆహారం తిన్న వెంటనే సుమారు పావు లీటర్ నుండి అరలీటర్ నీరు  తాగేస్తుంటారు. దీనివల్ల చాలా పెద్ద ఇబ్బందే ఎదువుతుంది.  
 
ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్ లు పలుచబడిపోతాయి. ఇలా జీర్ణ ఎంజైమ్ లు పలుచబడిపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. జీర్ణక్రియ చాలా నెమ్మదిస్తుంది. ఇది జీర్ణ సంబంధ వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.  ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి.

మరొక షాకింగ్ విషయం  ఏమిటంటే.. ఆహారం తిన్న వెంటనే ఎక్కువగా నీరు తాగేవారు చాలా తొందరగా ఊబకాయం సమస్యకు గురవుతున్నారు.  అలాగే ఆహారంలో తీసుకున్న పోషకాలు ఏవీ శరీరానికి అంత సులువుగా అందవు.  దీనివల్ల సరైన ఆహారం తీసుకున్నా సరే పోషకాహార లోపానికి గురవుతారు.

ఆహారం తిన్న తరువాత ఎన్ని నిమిషాలకు నీరు తాగాలి? ఆహారం జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది?

ఏదైనా ఆహారం తిన్న తరువాత జీర్ణం కావడానికి 3గంటల సమయం పడుతుంది. అయితే జీర్ణాశయంలోని చిన్న ప్రేగులలో ఈ ఆహారం సుమారు 7గంటల వరకు ఉంటుంది. ఇలా జీర్ణమైన ఆహారం పెద్ద ప్రేగు గుండా ప్రయాణించడానికి 15 గంటల నుండి 28 గంటల వరకు ఉంటుంది.  24 గంటలు గడిచినా మలవిసర్జన జరగకపోతే శరీరంలో చాలా అసౌకర్యంగా అనించడానికి కారణం ఇదే..

ఇకపోతే ఆహారం తిన్న వెంటనే నీరు తాగే అలవాటు ఉంటే దాన్ని మానుకోవడం చాలామంచిది. వీలైనంతవరకు ఆహారం కారం, ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకుంటే నీరు తాగాల్సిన అవసరం అంతగా ఉండదు. అలాగే ఉడికించిన కూరగాయలు బాగా తీసుకుంటే వాటిలో ఉండే నీటి శాతం ఆహారాన్ని జీర్ణం చెయ్యడానికి సహకరిస్తుంది. అదేవిధంగా రసం,  మజ్జిగ వంటివి కూడా జీర్ణాశయంలో ద్రవాల సమతుల్యతను  చేకూరుస్తాయి.  ఆహారం తిన్న తరువాత కనీసం 40నిమిషాల సేపు నీరు తాగకుండా ఉండటం మంచిది.

ఆహారం తిన్న తరువాత నీరు తాగాలని అనిపిస్తే  కేవలం ఒకటి రెండు గుక్కల నీరు మాత్రమే తాగవచ్చు. అది కూడా గోరువెచ్చగా ఉండే నీరు తాగడం మంచిది. అదే విధంగా తిన్న వెంటనే నీరు తాగాలని అనిపిస్తే లాలాజలాన్ని బాగా ఉత్పత్తి చేసే కారం, ఉసిరి ముక్క వంటివి తినవచ్చు. తేలికపాటి నడక కూడా మంచిదే.

                                        *నిశ్శబ్ద.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్..
శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి....
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.