ముహూర్తం చూసుకుని గృహప్రవేశం చేస్తారు, తారాబలం చూసి పెళ్లిచేస్తారు, మంచి సమయంలో పను లు ఆరంభించడానికి అనేక నమ్మకాలమీద ఆధారపడటం పరిపాటి. అది చాలా సహజంగా జరిగితే మరీ బాగుంటుంది. అంతేకాని ఫలానా కార్యక్రమం చేపడుతున్నాను, పిల్లిని ఎదురురాకుండా చూడండి అనో, ఆవును ఎదురుగా తీసుకురండి అనో, పాలపిట్టను పట్టి తెమ్మనో చెబితే అది మనసుకు ఆనందా న్నిస్తుందా. అది గొప్ప ప్రయోజనం చేకూరుస్తుందా అంటే కష్టమే. కానీ ఇటువంటి సరికొత్త బలవంతపు నమ్మకాన్నే తెలం గాణా సీఎం కేసీఆర్ అనుసరించారు. దసరా రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభం కలుగుతుందని తెలం గాణా అంతటా గొప్ప నమ్మకం. కేసీఆర్ మాత్రం నిరాశపడటం ఇష్టంలేకనే తన నివాసానికి పాలపిట్ట నే రప్పించుకున్నారు.. పంజరం లో.
చిలుక జోస్యం చెప్పేవారు చిలుకను పంజరం పట్టి తిరుగుతూంటారు. అలా పాలపిట్ట దొరకదు పంజరం లో ఠపీమని పట్టి బంధించడానికి. దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలన్న రెండింతల ఉత్సహంతో ఉరకలు వేస్తు న్న కేసీఆర్కు పాలపిట్ట జోస్యం చెప్పదు. దర్శనంతోనే అన్ని శుభాలు కలుగుతాయన్నది నమ్మకం. ఆ నమ్మకంతోనే పాలపిట్ట దర్శనాన్ని కోరుకున్నారు. అలాగని దాని కోసం తోటలోనో, మేడమీదనో వేచి ఉండడం కష్టం.. అందుకే తెమ్మని పురమాయించారనే అనుకోవాలి. ఎందుకంటే దాన్ని పట్టి పంజరంలో తెప్పించడం,కేసీఆర్ కుటుంబసభ్యులే దాన్ని ప్రత్యేకంగా దర్శించుకోవడం, ఆనందించడం అయింది.
శుభదర్శనం ప్రభావం అదృష్టాన్ని మారుస్తుందా? అనేది కోటి మంది వేస్తున్న ప్రశ్న. ఎందుకంటే, కేసీ ఆర్ దేశరాజకీయాల్లోకి వెళ్లడానికి టీఆర్ ఎస్ను బీఆర్ ఎస్గా మార్చి అందరినీ కలుపుకుంటూ దూసుకు పోవాలనుకుంటున్నారు. కానీ పార్టీ కి కొత్తపేరు పెట్టడానికి ఏర్పాటయిన నామకరణోత్సవానికి పార్టీ వారు తప్ప ఆయన ఆశించినట్టు ఇతర రాష్ట్రాలవారు ఎవ్వరూ పరుగున వచ్చి అభిమానం ప్రదర్శిం చలేదు. ఒక్క కర్ణాటక మాజీముఖ్యమంత్రి తప్ప. చిత్రమేమంటే కనీసం హలో అని పలక రించ లేదు. అంతేకాదు ఆదిలోనే హంసపాదులా ఇపుడు కేసీఆర్ ఎత్తుగడకు అడ్డంకి వచ్చిపడింది. బీఆర్ఎస్ నామకరణోత్సవానికి వచ్చి ఫోటోలు దిగి శుభాకాంక్షలు చెప్పిన కన్నడిగులు ఇపుడు కరచా లనానికి కాదు పొమ్మన్నారు. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ కర్ణాటకకు పూలగుచ్ఛంతో పాటు పాలపిట్టనీ చూసి వెళ్లా ల్సిందేమో.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-happened-due-to--belief-25-145085.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.