Publish Date:Sep 20, 2025
పాక్ కి వెళ్తే సొంతింటికి వెళ్లినట్టు ఉంటుందన్నారు కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల సలహాదారు శ్యాంపిట్రోడా. కొంపదీసి పిట్రోడా కూడా అద్వానీలా పాకిస్థాన్ లో పుట్టలేదు కదా అన్న అనుమానంతో ఆయన బయోగ్రఫీ తరచి చూసిన వారికి పిట్రోడా ఒడిశాలో పుట్టిన గుజరాతీ అని తెలిసింది. హమ్మయ్య బతికిపోయాం లేకుంటే ఈ రచ్చ ఎక్కడెక్కడికో వెళ్లిపోయేదన్న ఆందోళన నుంచి వారు ఒక్కసారిగా బయటపడ్డారు. నిజానికి ఒక ప్రాంతం పట్ల పైకి కనిపించేది వేరు లోపలికి కనిపించేది వేరు. టెన్ మిత్స్ అబౌట్ పాకిస్తాన్ అంటూ ఎప్పుడో రామచంద్ర గుహ వంటి వారు రాసిన వ్యాసాల సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కి సంబంధించి ఎన్నో అపోహలు ఉంటూనే ఉంటాయి. అక్కడ పైకి మనకు ఉగ్రవాదమే కనిపిస్తుంది. లోపల మరోలా ఉంటుంది. ఉండొచ్చు కూడా.
కానీ పిట్రోడా ఈ కామెంట్ చేయాల్సిన టైం మాత్రం ఇది కాదంటారు పరిశీలకులు. మొన్న ఆపరేషన్ సిందూర్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. పాక్ వల్ల భారత్, అమెరికా మధ్య తగువులొచ్చిన సీన్ కనిపిస్తోంది. ఇప్పటికీ పాక్, అమెరికా సాయంతో థర్డ్ పార్టీ మీడియేషన్ తో భారత్ తో సయోధ్యకు ప్రయత్నం చేస్తోంది. అందుకు భారత్ ససేమిరా అంటోంది. దానికి తోడు అమెరికా చేయి విడిచి చైనా, రష్యాలతో చెలిమి చేస్తోంది భారత్. దీనంతటికీ కారణం పాకిస్థానే.
ఎప్పుడైతే ట్రంప్ తన కుటుంబ పెట్టుబడులు పాక్ లో పెడుతున్నారో, అప్పటి నంచీ గతంలో ఎన్నడూ లేనంతగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ని దగ్గరకు చేర్చుకుంటున్నారు. అప్పటి నుంచీ అమెరికాకు మనకూ మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. భారత్, పాక్ ఘర్షణలు ఆపింది ట్రంపే అన్న కోణంలో పాక్ ఆయనకు నోబుల్ శాంతి బహుమతికి ప్రతిపాదించడం, భారత్ ఇందుకు ఒప్పుకోక పోవడం వంటి కారణాల రీత్యా ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య సంబంధాలు దిగజారుతూ వస్తున్నాయ్. దీనంతటికీ కారణం పాకిస్థానే.
ఈ క్రమంలో పిట్రోడా ఈ పిచ్చి ప్రేలాపన చేయడంతో అందరిలోనూ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పిట్రోడ్ పాక్ విషయంలో చేసిన కామెంట్లతో ఊరుకోకుండా.. నేపాల్, బంగ్లా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూడమంటున్నారు. ఇటీవలే నేపాల్ మొత్తం తగలబడగా.. ఇక బంగ్లా లో మిలటరీ వర్సెస్ తాత్కాలిక ప్రభుత్వంగా మారింది పరిస్థితి. తాత్కాలిక బంగ్లా ప్రధాని తో బంగ్లా ఆర్మీ పడలేక పోతోంది. కొత్తగా ఎన్నికలు జరిపి తీరాల్సిందే అని పట్టుబడుతోంది బంగ్లాదేశ్ సైన్యం. మొన్నా మధ్య విద్యార్ధులంతా రోడ్లపైకి వచ్చారు కూడా. పాత ప్రభుత్వం దిగిపోయేటపుడు బంగ్లాలో జరిగిన హింస కూడా ఏమంత తక్కువ కాదు. అలాంటి నేపాల్, బంగ్లా ల్లో ఆయనకు అంతటి శాంతి సౌభ్రాతృత్వాలు ఎక్కడ కనిపిస్తున్నాయో చెప్పాలని నిలదీస్తున్నారు నెటిజన్లు. ఇదంతా భారత్ వ్యతిరేక వాదనలో భాగమని అంటారు చాలా మంది. వీరు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఇక్కడున్న సమస్యలపై విమర్శలు చేయాలిగానీ మన బద్ధ శతృవు పాకిస్తాన్ సొంతిల్లు లాంటిదనడం.. పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ లు.. ప్రశాంతంగా ఉంటాయనడం సరికాదన్న సలహాలు అందుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-happend-to-shyam-pitroda-39-206529.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.