నిలువెల్లా హిందూ వ్యతిరేకత.. ప్రకాష్ రాజ్ కు ఏమైంది?

Publish Date:Sep 26, 2024

Advertisement

తిరుమ‌ల తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర స్వామిని హిందువులు భ‌క్తిశ్ర‌ద్ధలతో కొలుస్తుంటారు. స్వామివారి ద‌ర్శ‌నం కోసం తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశం, ప్ర‌పంచంలోని ప‌లు ప్రాంతాల నుంచి హిందువులు ప్ర‌తీరోజూ పెద్ద‌సంఖ్య‌లో త‌ర‌లి వ‌స్తుంటారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే తిరుమ‌ల అంటే ఓ ఆధ్యాత్మిక ప్ర‌పంచం.. ఆ ప్రాంతం ప‌విత్ర‌మైన‌దిగా ప్ర‌తీ హిందువూ భావిస్తారు. కానీ, ఐదేళ్లు ఏపీలో అరాచ‌క పాల‌న సాగించిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.. తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామిని కూడా వ‌దిలిపెట్ట‌లేదు.

తిరుమ‌ల ల‌డ్డూ అంటే భ‌క్తులు ఎంతో ప‌విత్రంగా  భావిస్తారు. తిరుమ‌ల వెళ్లిన‌వారు రద్దీయో, మరో కారణంతోనో స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోలేక‌పోయినా తిరుప‌తి ల‌డ్డూ తీసుకొని వ‌స్తుంటారు. అలాంటి ల‌డ్డూ త‌యారీలో జంతువుల కొవ్వుతో క‌ల్తీ అయిన నెయ్యి వినియోగించి జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌హా పాపానికి ఒడిగ‌ట్టింది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నెయ్యి శాంపిల్స్ కేంద్రం గుర్తింపు పొందిన ల్యాబ్‌కు పంపించ‌గా.. అందులో జంతువుల కొవ్వు క‌లిపిన‌ట్లు తేలింది. ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో దేశ‌వ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. తిరుప‌తి ల‌డ్డూలో క‌ల్తీనెయ్యి వాడిన ఘ‌ట‌న‌లో అస‌లైన దోషుల‌ను ప‌ట్టుకునేందుకు సీఎం చంద్ర‌బాబు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని( సిట్) ఏర్పాటు చేశారు. అయితే ఈ సమయంలో సినీ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ మాత్రం ఈ విష‌యంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. 

సినిమాల్లో ప్ర‌కాశ్ రాజ్ న‌ట‌న అంటే ప్ర‌తీఒక్క‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. అందులో హిందువులు, ముస్లింలు, క్రైస్త‌వులు అనే తేడాలేదు. కానీ, ప్రకాశ్ రాజ్  మాత్రం చెత్త‌మాట‌ల‌తో హిందువుల మ‌నోభావాల‌ను ఎప్పుడూ దెబ్బ‌తీస్తూనే ఉన్నారు. హిందుత్వ గురించి మాట్లాడితే అదేదో పెద్ద‌పాపం, ఇత‌ర మ‌తాల‌పైదాడి అన్న‌ట్లుగా ప్ర‌కాశ్ రాజ్ చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. తాజాగా తిరుప‌తి ల‌డ్డూ వివాదంలోనూ అదే విధానాన్ని ప్ర‌కాశ్ రాజ్ అనుస‌రించ‌డం హిందువుల‌ ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతోంది. ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి విష‌యంపై జ‌న‌సేన అధినేత‌, ఏపీ ఉపముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్ చేశారు. భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంద‌ని పవన్ పేర్కొన్నారు. దీనికి ప్ర‌కాశ్ రాజ్ స్పందిస్తూ.. త‌న హిందుత్వ వ్య‌తిరేక వాదాన్ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టుకున్నారు. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌  స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హిందుత్వం గురించి మాట్లాడేట‌ప్పుడు ప్ర‌కాశ్ రాజ్ ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌కాశ్ రాజ్ స్పందిస్తూ.. నా ట్వీట్‌ను స‌రిగ్గా చ‌దివి అర్ధంచేసుకోండి.. నేను 30వ తేదీ త‌రువాత వ‌స్తాను.. అప్పుడు మాట్లాడ‌తాను అంటూ రిప్లై ఇచ్చాడు. కానీ, హిందువుల‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సత్యం సుందరం చిత్రం ఈవెంట్‌లో హీరో కార్తీ పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో యాంక‌ర్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు.. ల‌డ్డూ విష‌యం ఇప్పుడ చాలా సెన్సిటివ్ దాని గురించి మాట్లాడొద్దంటూ వ్యాఖ్యానించాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కార్తీ వ్యాఖ్య‌ల‌ను కూడా త‌ప్పుబ‌ట్టారు. వెంట‌నే కార్తీ స్పందించి... పవన్ సర్ ఎలాంటి దురుద్దేశం లేకుండా నేను చేసిన కొన్ని కామెంట్స్ అపార్థానికి దారి తీశాయి. అందుకు క్షమాపణలు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నాకు మన సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంది అంటూ ట్వీట్ చేసి వివాదానికి ముగింపు పలికాడు. ప‌వ‌న్   అందుకు కార్తీని అభినందించారు. కానీ, ప్ర‌కాశ్ రాజ్‌లో మాత్రం హిందుత్వ‌పై వ్య‌తిరేత క‌ట్ట‌లు తెచ్చుకుంటూనే ఉంది. త‌న‌కు సంబంధంలేని ప‌వ‌న్‌, కార్తీ మ్యాట‌ర్ లోకి ప్ర‌కాశ్ రాజ్‌ త‌ల‌దూర్చ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నీదికాని విష‌యంలో నువ్వెందుకు త‌ల‌దూర్చుతున్నావ్ అంటూ ఆయ‌నపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ల‌డ్డూ వివాదం విష‌యంలో ప్ర‌కాశ్ రాజ్ దూకుడు వెన‌క ఎవ‌రు ఉన్నార‌నే విష‌యం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది. గ‌తంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్ర‌కాశ్‌రాజ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు వైసీపీ నేత‌ల‌తోనూ ఆయ‌నకు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

ప్ర‌కాశ్ రాజ్ జీవితంలోకి ఓసారి తొంగిచూస్తే ఆయ‌న నిత్యం వివాదాల‌ను కోరుకుంటూ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డంలో దిట్ట అనే విష‌యం అర్ధ‌మ‌వుతుంది. త‌ద్వారా ప్ర‌తీ విష‌యాన్ని రాజ‌కీయం చేయాల‌ని చూస్తుంటారు. భార‌త‌దేశంలో హిందుత్వ గురించి మాట్లాడితే త‌ప్పుచేసిన‌ట్లుగా ప్ర‌కాశ్ రాజ్ మాట‌లు ఉంటాయి. బీజేపీపై నిత్యం విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బెంగళూరు సెంట్రల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్ర‌కాశ్ రాజ్ పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు.  తొలి నుంచీ కూడా  అన‌వ‌స‌ర విష‌యాల్లో త‌ల‌దూరుస్తూ మ‌తాల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నారన్న విమ‌ర్శ‌లు ప్రకాశ్ రాజ్ పై ఉన్నాయి.  దేశంలో బీజేపీ, హిందుత్వ ఉండ‌కూడ‌దు అనే ప‌రిస్థితికి వెళ్లిపోయారని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. 

తాజాగా తిరుప‌తి ల‌డ్డూ వివాదం విష‌యంలోనూ ప్ర‌కాశ్ రాజ్‌ అన‌వ‌స‌రంగా త‌ల‌దూర్చారు. తిరుప‌తి ల‌డ్డూ గురించి మాట్లాడితే ముస్లిం, క్రైస్త‌వుల‌పై దాడి చేయ‌టమే అనే వాద‌న‌ను ఆయ‌న తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్ ఆలోచ‌న‌లు బ‌ట్టిచూస్తే.. హిందూ ధ‌ర్మాన్ని న‌మ్మ‌డం అంటే ఇత‌ర మతాల‌ను ద్వేషించ‌డ‌మా..? 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంద‌ని పవన్ అంటే.. ప్ర‌కాశ్ రాజ్‌కు వ‌చ్చిన నొప్పి ఏమిటి?  కార్తీ క్ష‌మాప‌ణ‌లు చెబితే ప్ర‌కాశ్ రాజ్‌కు ఇబ్బంది ఏమిటి?  ప్ర‌కాశ్ రాజ్ వ్యాఖ్య‌ల వెనుక ఎవ‌రు ఉన్నారు? ఆయ‌న ద్వారా మ‌తాల మ‌ధ్య అల్ల‌ర్లు సృష్టించేందుకు ఎవ‌రైనా ప్ర‌య‌త్నం చేస్తున్నారా?  నిత్యం మీడియాలో క‌నిపించాల‌ని ప్ర‌కాశ్ రాజే అలా చేస్తున్నారా? ఆయ‌న ఉద్దేశం ఏదైనా.. ఆయ‌న వెన‌క ఎవ‌రు ఉన్నా.. స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణ బోర్డు ఏర్పాటు చేయ‌డం అంటే.. ఇత‌ర మ‌తాల‌పై దాడి చేయ‌డం కాద‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికైనా ప్ర‌కాశ్ రాజ్ గుర్తిస్తే బాగుంటుంది. అలాకాకుండా..  స‌మ‌సిపోయిన వివాదాన్ని మ‌ళ్లీ తెర‌పైకి తేవాల‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను విమ‌ర్శించి దేశ రాజ‌కీయాల్లో మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారాల‌ని ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌య‌త్నిస్తే హిందువుల నుంచే కాదు.. ముస్లిం, క్రైస్త‌వుల నుంచి కూడా ఆయ‌న ప్ర‌తి దాడులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.