ఈ జగన్ కు ఏమైంది?

Publish Date:Apr 17, 2023

Advertisement

మడమ తిప్పని, మాట తప్పని నేతగా తనని  తాను బ్రాండ్ గా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బ్రాండింగ్ క్రమంగా మసకబారుతోంది. అసలుజగన్ అంటేనే ధైర్యం, ధైర్యం అంటేనే జగన్ అంటూ విపరీతమైన ఫాలోయింగ్  సొంతం చేసుకున్న జగన్  ఇటీవలి కాలంలో ఆయనను అభిమానించే వారిని తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీని కాదని సొంత పార్టీ స్థాపించిన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం చిన్న విషయం కాదు.  11 కేసులలో 16నెలల జైలు జీవితం గడిపి కూడా ప్రజామోదం పొందడం ఒక్క జగన్ కే సాధ్యమైంది. జగన్ తెగువను, పట్టుదలను  ఆయన ప్రత్యర్థులు కూడా ఒప్పుకుని తీరాలి. అయితే ఇంత బలమైన వ్యక్తిత్వం ఉన్న జగన్ ఇటీవల జావకారిపోతున్నారు. సీఎం పదవిని చేపట్టిన మొదటి సంవత్సరం విజయాన్ని ఆస్వాదిస్తూ ప్రతిపక్షానికి 23 స్థానాలే వచ్చిన విషయాన్ని దెప్పిపొడుస్తూ గడిపేశారు జగన్. రోండవ సంవత్సరం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ ఆకర్ష్ ను విజయవంతంగా ప్రయోగించి చంద్రబాబుకు కంట్లో నలుసుగా మారాను జగన్. ఇక మూడో సంవత్సరం తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలను పార్టీ నుండి సాగనంపే పనిని జగన్ విజయవంతంగా పూర్తి చేశారు.

ఇక నాలుగో సంవత్సరం అంతా ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పెట్టే పనికి తన అనుయాయులతో కలిసి పదును పెట్టారు.  చంద్రబాబు ధర్మపత్నిని అసెంబ్లీలో నానా మాటలూ అని ప్రతిపక్ష నేత చేత  అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేయించగలిగారు.  గడిచిన నాలుగేళ్లూ స్విచ్ లు నొక్కుతూ, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతూ, సంక్షేమం పేరుతో పైసలు పంచుతూ కాలం గడిపిన జగన్ కు చివరి సంవత్సరం కఠిన పరీక్షలు పెడుతోంది. 2019 ఎన్నికల ముందడు జరిగిన కోడి కత్తి కేసు, వివేకా హత్య వంటి సంఘటనలు జగన్ కు గుది బండగా మారాయి. ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లి పనులు చక్కపెడుతున్నా.. సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదో అన్న అనుమానం జగన్కు కలగలేదని చెప్పాలి. ఢిల్లీలో ప్రతిభావంతులైన నాయకులకు బాధ్యతలు ఇచ్చిన జగన్ ప్రధాని కార్యాలయంలో చీమ చిటుక్కుమన్నా సమాచారం తెలుసుకునే ఏర్పాట్లు చేసుకున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయినా జగన్  అంచనాలకు అందకుండా ఢిల్లీలో పరిణామాలు జరుగుతున్నాయి అనే అనుమానం ఆయన పార్టీ నేతల్లో బలపడుతోంది.

ప్రస్తుతం జగన్ పరిస్థితికి.. ఇంత కాలం దేన్నీ సీరియస్ గా తీసుకోలేకపోవడమే కారణమని ఈ పార్టీ నేతలే చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీని మరింత డిఫెన్స్ లోకి నెట్టాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు రిఫరెండం కాదని బయటకు ఎంత చెప్పుకున్నా పార్టీలో డల్లతనాన్ని ఈ ఫలితాలు చెప్పకనే చెప్పాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ పరువు బజారున పడటంతో పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు అసమ్మతి నేతలంటూ నలుగురిని బయటకు పంపించి పార్టీ చేతులు దులుపుకుంది.  తాజాగా కోడి కత్తి వివాదంలో ఎన్ఐఏ రిపోర్టు జగన్ ను, పార్టీని ఇబ్బంది పెట్టగా, వివేకా హత్య కేసు జగన్ వ్యక్తిగత ప్రతిష్టకు సవాల్ విసిరింది. అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగియడంతో జగన్ ఇబ్బందులు పెరిగాయి. దీంతో అనంతపురం సభను, లండన్ పర్యటనను సైతం జగన్ రద్దు చేసుకున్నారు.  మైసూరు నుంచి ఆఘమేఘాల మీద లాబీయిస్టులు విజయవాడలో వాలిపోయారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్న వాస్తవం జగన్ కు బాగా తెలుసు. 

ఇదిలా ఉంటే అసలు భయమన్నదే ఎరుగని జగన్ కు పరిస్థితులు భయాన్ని పరిచయం చేశాయని విశ్లేషకులు అంటున్నారు.  చివరి సంవత్సరం గడ్డు కాలంగానే ఉంటుందన్నది ఇప్పటికే జగన్ కు అర్ధం అయి ఉండాలి. 2024 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పెద్ద బాధ్యతకు జగన్ సిద్ధం కావాల్సి ఉంది. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.