సంపద సృష్టితోనే అభివృద్ధి, సంక్షేమం.. బాబు తారకమంత్రం అదే!

Publish Date:Sep 25, 2023

Advertisement

కంప్యూటర్లు కూడు పెడతాయా అన్న  రోజులలో ఒకే ఒక్కడుగా ఐటీ పరిశ్రమ కోసం ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా శ్రమించారు. యువత ఉజ్వల భవిష్యత్ కోసం కలలుగని, ఆ కల నెరవేర్చుందుకు శ్రమించి, తపించి సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్ గా మార్చారు. అది చాలదా..? ఒక్క ఐటీ పరిశ్రమ వల్ల ఒక్క సారిగా ఏపీ ముఖచిత్రమే మారిపోయింది.

వేలు, లక్షల మందికి జీవితంలో స్థిరపడేలా ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. మంచి జీతాలతో ఉద్యోగాలు పొందిన వారు వెంటనే సొంతింటి నిర్మాణంపై దృష్టిసారించాయి. దీంతో వారు హోంలోన్ లు తీసుకున్నారు. బ్యాంకింగ్ రంగం వృద్ధి చెందింది. అపార్ట్ మెంట్ల నిర్మాణం జోరందుకుంది. నిర్మాణ రంగం పరుగులు తీసింది. వారి కొనుగోలు శక్తి పెరిగింది. బ్రాండెడ్ దుస్తుల కొనుగోళ్లు పెరిగి టెక్స్ టైల్ ఇండస్ట్రీ వృద్ధి చెందింది.  వీకెండ్ విహారాలు పెరిగాయి. పర్యాటక రంగం జోరందుకుంది. అంతేనా ఎంటర్మైన్ మెంట్, ఏవియేషన్ ఇండస్ట్రీ అభివృద్ధిలో, పురోగమనంలో కొత్త పుంతలు తొక్కాయి. సొంత ఇంటిని సుందరంగా తీర్చిదిద్దుకోవడం, హంగుల ఏర్పాటుపై ఐటీ ఉద్యోగులు దృష్టి పెట్టారు. టీవీ, గృహోపకరణాల కొనుగోళ్లు పెరిగాయి, హోంఅప్లయెన్సెస్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా, శాఖోపశాఖలుగా విస్తరించింది.  అంతేనా ఆన్ లైన్ కొనుగోళ్లు పెరిగాయి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. ఫుడ్ ఇండస్ట్రీ అనూహ్యంగా జోరందుకుంది. ఇలా ఒకటేమిటి.. ఇప్పుడు దేశంలో కనిపిస్తున్న ప్రతి పురోగతి వెనుకా చంద్రబాబు విజనే ఉంది.  ప్రజల ఆర్థిక ప్రమాణాలు పెరగడం టాక్స్ పేయర్ల ను పెంచింది. దిగువ మధ్యతరగతి మధ్యతరగతిగా ఎదిగింది. మధ్యతరగతి ఎగువ మధ్య తరగతిగా ఎదిగింది.

ఇలా ఎదిగిన ప్రతి కుటుంబమూ మా వాడికి, మా అమ్మాయికీ ఐటీ ఉద్యోగం వచ్చింది, మంచి జీతం వస్తోంది అందుకే బాగుపడ్డాం అని చెబుతారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ లక్షలాది మంది తెలుగు యువకులను విదేశాలకు వెళ్లి లక్షల్లో వేతనాలు సంపాదించేలా చేసింది. ఉభయ తెలుగురాష్ట్రాలలో లక్షల కుటుంబాలు చెప్పే జవాబులు ఇవే. అంతే కానీ ఎవరూ కూడా ఫలానా ఉచిత పథకం వల్ల మా దశ తిరిగింది. మేం బాగుపడ్డాం అని చెప్పే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మాట సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాజాభివృద్ధికి అవసరం. అభివృద్ధి ద్వారా సృష్టించిన సంపదని సమాజానికి పంచాలి. తప్ప అప్పులు, పన్నులు ద్వారా కాదు. అందుకే జనం ఆలోచించాలి.  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి 

తాత్కాలిక లబ్దిపై వల్ల ప్రయోజనం ఉండదు. దీర్ఘకాలిక దృష్టి ఉండాలి. చంద్రబాబులో ఉన్నది అదే. అందుకే ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తే ఆయన దార్శనికత కారణంగా బాగుపడిన ప్రతి యువకుడూ ఆవేదన చెందుతున్నారు. తమ కంఫర్ట్ జోన్ ను వదిలి పోలీసు ఆంక్షలను సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఐయామ్ విత్ బాబు అంటూ సంఘీభావం తెలుపుతున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది.
చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు తిరుమల శ్రీవారి పేరును పెట్టాలని ప్రతిపాదించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేశ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
బోయింగ్ డ్రీమ్‌లైనర్ అత్యాధునిక విమానమని అన్ని ఎయిర్‌వేస్ సంస్థలు కొనుగోలు చేశాయి. అయితే ఇప్పుడు ఆ విమానాల్లో ఎక్కడానికి ప్రయాణీకులు భయపడే పరిస్థితులు నొలెకొన్నాయి.
కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తెగా మాత్రమే కాదు.. ఎంపీగా, పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా తనదైన ప్రత్యేక గుర్తింపు పొందిన నేత.
ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు కూటమి సర్కార్ అండగా నిలిచింది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి సవిత, మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని షర్మిల ఆరోపించారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం లో అప్పు తీర్చలేదు అని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై బాధితులతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాల్ లో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 400 నుండి 600 మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధుల ఫోన్‌లను ట్యాపింగ్‌ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI159 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే టేకాఫ్ కు ముందు ఈ సమస్యను గుర్తించడంతో పెను ముప్పు తప్పింది.
వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లుక్ ఔట్ నోటీసు ఉండగా ఆయన దేశం విడిచి శ్రీలకంకు వెళ్లేందకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు చెవిరెడ్డి భాసక్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంకారావు అనే వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సన్మానం కోసం పిలిపించిన ఆయనను.. ఏకంగా సలహాదారుగా తీసుకుంటున్నట్టు అక్కడికక్కడే ప్రకటించి సీఎం చంద్రబాబు ఓ సంచలనమే రేపారు.
యువ‌ర్ అటెన్ష‌న్ ప్లీజ్. హాంకాంగ్ టూ ఢిల్లీ ఫ్లైట్ నెంబ‌ర్ ఏ1315 బోయింగ్ 7878 డ్రీమ్ లైన‌ర్ చిన్న సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో తిరిగి హాంకాంగ్ లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయ‌బోతున్నామ‌ని ప్ర‌కటించ‌డంతో ఒక్క‌సారిగా ప్ర‌యాణికుల గుండెలు అర‌చేతిలోకి వ‌చ్చేశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.