కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.. 990 కోట్ల వ్యయానికి వనరులశాఖ ఆమోదం

Publish Date:Jan 31, 2025

Advertisement

జగన్ ప్రభుత్వ నిర్వాకంతో  మూలన పడిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి పోలవరం ప్రాజెక్టు అని ప్రకటించిన చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ ఆ ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని అప్పట్లో ప్రాజెక్టును సందర్శించి పనులను పరుగులెత్తించేవారు.  దక్షణ భారతదేశంలో అత్యధిక నీళ్లు ఉండే ఏకైక నది గోదావరి. యేటా 3 వేల టీఎంసీల నీరు వృధాగా ఉప్పు సముద్రం పాలౌతోంది. ఆ నీటిని ఒడిసిపట్టి వినియోగించుకుంటే రాష్ట్రంలో కరవు అనేదే ఉండదు.

అటువంటి పోలవరం కోసం చంద్రబాబు 2014 ఎన్నికలలో గెలిచిన తరువాత తన దృష్టినంతా కేంద్రీకరించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేసే వరకూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది లేదని పట్టుబట్టి మరీ సాధించుకున్నారు.  చంద్రబాబు హయాంలో ఒకే రోజున 32,315 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసి గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించారు.   31 సార్లు క్షేత్రస్థాయిలో పోలవరంలో పర్యటించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయానికి ఊతం వస్తుందనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ క్లియర్‌ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.11, 762.47 కోట్లు ఖర్చు చేసింది.

అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్  ప్రభుత్వం పోలవరం పనులను నిలిపివేసింది. రివర్స్ టెండరింగ్ అంటూ అప్పటి వరకూ జోరుగా సాగుతున్న నిర్మాణాలను పడుకోపెట్టేసింది.   జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ప్రాజెక్టు పనులు నిలిపేసింది.   ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే పని చేసే ఏజెన్సీలను తొలగించింది. 2019 జూన్‌ నుండి నవంబర్‌ వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు చూసే ఏజెన్సీ కూడా లేదు. ఆ కారణంగానే   ఆ తరువాత వరదలతో డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. ఈ విషయాన్ని హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులు స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు పోలవరం అతీగతీ పట్టించుకోకుండా వదిలేయడంతో అప్పటికే  72శాతం పనులు పూర్తైన పోలవరం పరిస్థితి మొదటికి వచ్చినట్లుగా అయ్యింది. జగన్ నిర్వాకం కారణంగా సర్వనాశనమైన పోలవరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టినా బాగుపడుతుందనే గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టడంతో పోలవరంకు మంచి రోజులు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టుకు జగన్ శాపంగా మారితే.. చంద్రబాబు ఆశాకిరణంగా నిలిచారు. 

ఇప్పుడు మళ్లీ పోలవరం పూర్తిపై ఆశలు చిగురించాయి.  దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తగా 63,656మీటర్ల మేర సమాంతర డయాఫ్రమ్ వాల్ను నిర్మించేందుకు రూ.990 కోట్ల వ్యయం అవుతుందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు  సమర్పించిన అంచనాకు రాష్ట్ర జలవనరులశాఖ ఆమోదం తెలిపింది. కాగా కొత్త డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందంలోని అమెరికాకు చెందిన డియాన్ ఫ్రాన్ కో డి కికో, డేవిడ్ బి పాల్ శనివారం(ఫిబ్రవరి 1) పోలవరానికి రానున్నారు.

By
en-us Political News

  
అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు.
వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది.
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.