చరిత్రలో కలుస్తున్న 135 ఏండ్ల సెంట్రల్ జైలు

Publish Date:Jun 2, 2021

Advertisement

హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న సచివాలయం నేలమట్టం అయింది... ఇప్పుడు అదేబాటలో తెలంగాణ రాష్ట్రంలో మరో చరిత్రాత్మక కట్టడం కనుమరుగు కానుంది.135 ఏళ్ల కాలం నాటి వరంగల్ ప్రాంతీయ కారాగారం కథ ముగిసిపోతోంది. సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని తలపెట్టిన కేసీఆర్ సర్కార్... చకాచకా అడుగులు వేస్తోంది. సర్కార్ ఆదేశాలతో జైలును ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు, సిబ్బంది ఖైదీలను తరలించే పని మొదలుపెట్టారు. మంగళవారం తొలి రోజు పటిష్ట భద్రత నడుమ 119 మంది ఖైదీలను హైదరాబాద్ చర్లపల్లికి తరలించారు. అందులో 80 మంది పురుషులు 39 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. జైలు నుంచి తరలి వెళ్లే సమయంలో పలువురు మహిళా ఖైదీలు కంటతడి పెట్టారు.

జైలులో వెయ్యి మంది ఉండేలా ఏర్పాట్లు ఉండగా, ప్రస్తుతం 27 బ్యార‌క్​లలో 956 మంది జైలులో ఉన్నారు. బ్యార‌క్‌లే కాకుండా అధికారుల‌కు, సిబ్బందికి వ‌స‌తి గృహాలు కూడా లోప‌లే నిర్మించారు. ఖైదీల ఆరోగ్య ప‌రిరక్షణకు 70 ప‌డ‌క‌ల ఆస్పత్రి కూడా ఉంది. వరంగల్ కేంద్ర కారాగారంలోని ఖైదీలను హైదరాబాద్​లోని చర్లపల్లి, చంచల్​గూడాతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ జైళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15 నుంచి 20 రోజుల్లోగా వరంగల్ కేంద్ర కారాగారాన్ని పూర్తిగా తరలిస్తామని జైళ్ల శాఖ డీజీ రాజీవ్​త్రివేది  చెప్పారు. 267 మంది జైలు సిబ్బంది ఉండగా, వారి ఇష్టానుసారంగా అనుకూలమైన చోటుకు ట్రాన్స్​ఫర్​ చేస్తామన్నారు. మామునూరు ప్రాంతంలో అత్యాధునిక హంగులతో అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త జైలును రెండేళ్లలోగా నిర్మించనున్నామని తెలిపారు. 

వరంగల్ సెంట్రల్ జైలుకు 135 ఏండ్ల చరిత్ర ఉంది మొత్తం 54.5 ఎక‌రాల్లో విస్తరించి ఉన్న సెంట్రల్​ జైలును 1886 లో నిర్మించారు. వ‌రంగ‌ల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా ఆటోన‌గ‌ర్‌కు వెళ్లే ర‌హ‌దారిని ఆనుకుని, కేఎంసీ కాంపౌండ్ వాల్ వ‌ర‌కు రోడ్డుపొడ‌వునా కేంద్ర కారాగారం విస్తరించి ఉంది. దాదాపు అర కిలోమీట‌ర్ మేర ర‌హ‌దారి ప్రశాంతంగా క‌నిపిస్తూ ఉంటుంది. 

సెంట్రల్​ జైలులో అప్పటి స్వాతంత్ర్య సమరయోధులు ఎంతో మంది కాలం గడిపారు. ప్రస్తుత సీనియర్​ రాజకీయ నాయకులు, ఎంతో మంది తెలంగాణ ఉద్యమ నాయకులు కూడా అందులో శిక్ష అనుభవించిన వారు ఉన్నారు. జైలు అధికారులు కేవ‌లం శిక్ష అనుభవించ‌డానికే కాకుండా ఖైదీల్లో ప‌రివ‌ర్తన తీసుకొచ్చే విధంగా స‌మూల మార్పులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఖైదీల‌తో వ్యవసాయం, ఇత‌ర ప‌నులు చేయించ‌డ‌మే కాకుండా వారికి ప్రతిఫలం కూడా అందిస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల పెట్రోల్‌ బంక్ కూడా ఏర్పాటు చేశారు. శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీల‌తోపాటు, విడుద‌లైన వారికి ఈ బంక్‌లో ఉపాధి క‌ల్పిస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో మాస్కులు, శానిటైజ‌ర్లు, ఫినాయిల్ లాంటివి త‌యారు చేయిస్తూ విక్రయిస్తున్నారు. అంతేకాదు దుప్పట్లు, కార్పెట్లు కూడా ప్రత్యే ఔట్‌లెట్ ఏర్పాటు చేసి ఖైదీల చేత విక్రయిస్తుంటారు. 

వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లాలో వివిధ నేరాల కింద శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీల‌ను వారి కుటుంబ స‌భ్యుల‌ను క‌లుసుకోవ‌డానికి ఇక నుంచి ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంది. జైలు త‌ర‌లింపు నేప‌థ్యంలో ఖైదీల‌కు ఇత‌ర జిల్లాల్లోని జైళ్లలో ఆవాసం కల్పిస్తారు. ఇక‌మీద‌ట వారిని కుటుంబ సభ్యులు క‌లుసుకోవాలంటే.. ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వ‌నుంది.

By
en-us Political News

  
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.