ఓట‌రా మేలుకో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని కాపాడుకో!

Publish Date:May 9, 2024

Advertisement

అభివృద్ధి జ‌ర‌గాలంటే ఆయుధం ఓటు.. ప్ర‌జా పాల‌న సాగాలంటే ఆయుధం ఓటు.. అవినీతి ప్ర‌భుత్వాల‌ను కుప్ప కూల్చాలంటే ఆయుధం ఓటు.. క‌క్ష‌పూరిత పాల‌న సాగిస్తున్న ప్ర‌భుత్వం మెడ‌లు వంచాల‌న్నా ఆయుధం ఓటే.. మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు బాగుండాలంటే ఆయుధం ఓటు.. ఆ ఆయుధం మ‌న చేతుల్లోనే ఉంది. మన‌ది ఒక్క ఓటే క‌దా వెయ్య‌క‌పోతే ఏమ‌వుతుందిలే అనుకుంటే అది పొర‌పాటే. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఓట‌ర్లు చేసిన ఆ పొర‌పాటే ఇప్పుడు వారి జీవితాల‌కు శాపంగా మారింది. రాజ‌ధాని లేని రాష్ట్రంగా చెడ్డ‌పేరు మూట‌గ‌ట్టుకోవ‌డంతోపాటు.. గంజాయికి నిల‌యంగా మారింది. క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఏపీ మారింది, అభివృద్ధి లేని రాష్ట్రంగా, ఉద్యోగాలు లేని రాష్ట్రంగా, ఉన్న కంపెనీల‌ను త‌రిమేసిన రాష్ట్రంగా.. మొత్తంగా మ‌రో శ్రీ‌ల‌కం దేశంగా మారేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం సిద్ధంగా ఉంది. అందుకు కార‌ణం ఏపీ ఓట‌ర్ల నిర్ల‌క్ష్య‌మే. ఏపీలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్ర భ‌విష్య‌త్తు అంధ‌కారంగా మారింది. అభివృద్ధి లేదు, రోడ్లు వేయ‌లేదు, ఉద్యోగాలు క‌ల్పించ‌లేదు, క‌నీస సౌక‌ర్యాలు లేవు.. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై దాడులు మాత్రం పెద్దెత్తున జ‌రిగాయి. గొంతెత్తి అడిగిన వారు  జైళ్ల‌కు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నిక‌ల్లో 79.64 శాతం పోలింగ్‌ న‌మోదైంది. దాదాపు 20శాతం మంది ఓట‌ర్లు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. వీరిలో 10శాతం మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ముందుకు వ‌చ్చినా ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ఇన్ని ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుండేవారు కాక‌పోవ‌చ్చు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డం, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాలకే ప‌రిమితం కావ‌డంతో   రాష్ట్రంలో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారి జీవ‌నోపాధి కోసం   చిన్న‌ాచితికా ప‌నులు కూడా దొర‌క‌క పోవ‌డంతో హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు రాష్ట్రాల‌కు పెద్ద సంఖ్య‌లో   వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇత‌ర రాష్ట్రాల్లో జీవ‌నం సాగిస్తున్న ఏపీ ఓట‌ర్లు.. సొంత రాష్ట్రం వెళ్లి ఓటువేసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌లేదు. ఫ‌లితంగా ఓటింగ్ శాతం త‌గ్గింది. దాదాపు 60 నుంచి 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో వెయ్యి నుంచి 10వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్య‌ర్ధులు ఓడిపోయిన ప‌రిస్థితి. ఇత‌ర ప్రాంతాల‌కు ఉపాధికోసం వెళ్లిన‌ ఏపీ ఓట‌ర్లు ఆశించిన స్థాయిలో త‌మ రాష్ట్రంకు వెళ్లి ఓటు వేయ‌క‌పోవ‌డంవ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గ‌త ఐదేళ్ల‌లో పీక‌ల్లోతు అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది.  

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి 151 సీట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ స‌గానికి పైగా స్వ‌ల్ప ఓట్ల మెజార్టీతో గెలిచిన సీట్లే. 20శాతం మంది ఓట‌ర్ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల వైసీపీ అధికారంలోకి రావ‌డం.. ఏపీ ప్ర‌జ‌లు ఉపాధి కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్ది రోజుల‌కే పేద‌ల‌కు అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిలో వేగంగా జ‌రుగుతున్న ప‌నుల‌ను నిలిపివేశారు.   ఏపీ సీఎంగా చంద్ర‌బాబు కొన‌సాగిన‌ స‌మ‌యంలో అమ‌రావ‌తి, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి దొరికింది. రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతున్న స‌మ‌యంలో కుల‌వృత్తుల వారికి పుష్క‌లంగా ప‌నులు దొర‌క‌డంతో ఆర్థికంగా వారికి వెసులుబాటు ఏర్ప‌డింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌క్ర‌బుద్ధితో వారి జీవ‌నోపాధిపై దెబ్బ‌కొట్టారు. అంతేకాదు.. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ఏపీ అభివృద్ధిలో పూర్తిగా వెనుక‌బ‌డి పోయింది. చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో ప‌లు ప్ర‌ముఖ కంపెనీలు పెద్దెత్తున పెట్టుబ‌డులు పెట్టాయి. జ‌గ‌న్ సీఎం హోదాలో వాట‌న్నింటిని ఏపీ నుంచి త‌రిమేశారు. అలాఅని కొత్త కంపెనీల‌నుకూడా ఏపీకి తీసుకురాలేదు. దీంతో యువ‌త ఉద్యోగాలు చేసుకునేందుకు అవ‌కాశం లేకుండా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేశారు. మ‌ట్టి, ఇసుక దోపిడీతో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు జేబులు నింపుకున్నారు. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డం, అక్ర‌మ కేసులు బ‌నాయించి చిత్ర హింస‌ల‌కు గురిచేశారు. వైసీపీ నేత‌ల ఆగ‌డాలు త‌ట్టుకోలేక పోయిన చాలా మంది ఏపీని వ‌దిలి జీవ‌నోపాధికోసం ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్లిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనంత‌టికీ కార‌ణం.. ఇత‌ర రాష్ట్రాల్లోని ఏపీ ఓట్లు పోలింగ్ స‌మ‌యంలో ఓటు హ‌క్కు వినియోగించుకోక పోవ‌టం వ‌ల్ల‌నేని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. 

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా క‌లిసి పోటీచేసి అధికారంలోకి వ‌చ్చాయి. 2014 నుంచి ఐదేళ్లు ఏపీలో ఎటుచూసినా అభివృద్ధి ఆన‌వాళ్లు క‌నిపించాయి. సీఎంగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టుద‌ల‌తో ఏపీని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న ప్ర‌ముఖ కంపెనీల‌ను ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా చేయ‌డం, పాత రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు, కొత్త రోడ్లు వేయ‌డం, యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌న‌, ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధానిని అద్భుతంగా నిర్మించేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. చంద్ర‌బాబు హ‌యాలో ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఆర్థికంగా అన్ని వ‌న‌రులుఉన్న‌ తెలంగాణ రాష్ట్రంతో పోటీప‌డింది. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అబివృద్ధి అనే ప‌దాన్ని మ‌ర్చిపోయి కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో పాల‌న సాగించి ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైకో పాల‌న‌తో ఐదేళ్లు న‌ర‌క‌యాత‌నకుగురైన ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌స్తుతం ఆ బారినుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం వ‌చ్చింది. ఓటు ద్వారా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బుద్దిచెప్పి మ‌ళ్లీ ప్ర‌జాపాల‌నను తెచ్చుకొనే అవ‌కాశం ఏపీ ప్ర‌జ‌ల‌కు వ‌చ్చింది. మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. రాష్ట్రంలోఉన్న ఓట‌ర్లు, ఇత‌ర రాష్ట్రాల్లోఉన్న ఏపీ ఓట‌ర్లు  పోలింగ్ రోజు ఏపీలోని వారి స్వంత ప్రాంతాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని. ఐదేళ్ల జగన్ దుర్మార్గ‌  పాల‌నకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది.   జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఓటు   ఆయుధంతో బుద్ధి చెప్పాలి.   నిర్ల‌క్ష్యం వీడి మేలుకో ఏపీ ఓటరా.. మ‌ళ్లీ ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు ఓటును ఆయుధంగా వినియోగించుకో.

By
en-us Political News

  
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.