ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ఇక ముగిసిన అధ్యాయమే.. కారణం జగన్ నిర్వాకమే!

Publish Date:Nov 20, 2024

Advertisement

కత్తి వాడటం మొదలు పెడితే, నా కన్నా బాగా ఎవడూ వాడలేడు అంటూ మిర్చి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. దానికి కొంచం మార్చి మనుషులను వ్యవస్థలను వాడుకోవడంలో తనను మించిన వాడు ఎవడూ ఉండడు అన్నట్లుగా  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలనూ తనకు అనుకూలంగా ఇష్టారీతిగా వాడేసుకున్నారు. ఆ వాడకంలో ఆయన తన కోసం తన చేత తానే సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది. వాడకం పూర్తయిన తరువాత జగన్ అంత కాలం తన కోసమే పని చేసిన మనుషులను, వ్యవస్థలను కూడా కూరలో కరివేపాకులా విసిరి అవతల పారేశారు. అలా పారేశిన వాటిలో వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది.

అందుకే ఇప్పుడు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉనికి కూడా లేకుండా పోయింది. ఆయన కోసం అన్నీ వదులుకుని నామమాత్రపు వేతనాల కోసం వాలంటీర్లుగా చేరిన లక్షలాది మంది యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది. ఔను ఇదే విషయాన్ని శాసనమండలి వేదికగా  మంత్రి డోలా బాలవీరాంజనేయులు చెప్పారు. జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ అన్నదే లేకుండా పోయిందని ఆయన కుండబద్దలు కొట్టేశారు.  గత ఏడాది ఆగస్టు నుంచే రాష్ట్రంలో  వాలంటీర్ వ్యవస్థ ఉనికి మాయమైపోయిందని శాసన మండలి జీరో అవర్ లో మంత్రి డోలా బాల వీరాంజనేయ శర్మ చెప్పారు. జగన్ గత ఏడాది ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించాల్సి ఉందనీ, కానీ ఆయనా పని చేయకపోవడంతో ఆ నాటి నుంచి  ఆ వ్యవస్థ రాష్ట్రంలో లేకుండా పోయిందనీ అన్నారు. జగన్ నిర్వాకం వల్ల గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థకు కాలం చెల్లిందని వివరించారు.

వాలంటీర్లను కొనసాగిస్తామంటూ తాము ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేద్దామన్నా చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వాలంటీర్లను కొనసాగించి వారికి వేతనాలు ఇద్దామని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించిందని చెప్పిన మంత్రి డోలా  కొలువులో లేని ఉద్యోగికి ప్రభుత్వం నుంచి వేతనం ఇవ్వడానికి ఎలా సాధ్యమౌతుందని సభా ముఖంగా ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్లనే   వాలంటీర్లను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొనసాగించడానికి అవకాశం లేకుండా పోయిం దని స్పష్టం చేశారు. వాలంటీర్ల వ్యవస్థను జగన్ సర్కార్ పునరుద్ధరించి ఉన్నట్లైతే తమ సర్కార్ ఇప్పుడు దానిని తప్పని సరిగా కొనసాగించేదని డోలా బాల వీరాంజనేయులు సభా ముఖంగా చెప్పారు.  

జగన్ హయాంలో  రాష్ట్రంలో  2,63,000 మంది వాలంటీర్లు ఉండేవారనీ, వారిలో లక్షా ఏడు వేల మంది సరిగ్గా ఎన్నికలకు ముందు రాజీనామాలు చేసి వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపిన మంత్రి ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా పది వేల మంది వాలంటీర్లు మాత్రమే ఉన్నారని వివరించారు.   రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇప్పుడు వైసీపీ నేతల ఒత్తిడి కారణంగానే తాము అప్పట్లో రాజీనామాలు చేశామని చెబుతున్నారు. తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నట్లుగా భావించి తిరిగి కొలువులోకి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే వాలంటీర్ల పట్ల ప్రజలలో ఏ మాత్రం మంచి అభిప్రాయం లేదు. వారు వైసీపీ ఏజెంట్లని ప్రజలందరికీ తెలుసు. అందుకే వారిని కొనసాగించాలన్న వాదనలో ఇసుమంతైనా పస లేదు. అయినా వాలంటీర్ల ప్రాథమిక బాధ్యత సామాజిక పింఛన్ల పంపిణీ, అది ఈ ఐదు నెలలుగా వారు లేకుండా కూడా సజావుగా సాగుతోంది. అటువంటప్పుడు  ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా వాలంటీర్లను కొనసాగించడంలో అర్ధం ఉండదని డోలా బాల వీరాంజనేయులు శాసనమండలి జీరో  అవర్ లో స్పష్టంగా చెప్పారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.