విశాఖ జగన్ ఈగో శాటిస్ ‘ఫ్యాక్షన్ ’రాజధానేనా?

Publish Date:Sep 23, 2023

Advertisement

జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విశాఖ కేంద్రంగా  పాలనకు సిద్ధమైంది. ఇందు కోసం దసరా ముహుర్తాన్ని కూడా నిర్ణయించింది. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే  ఈ విషయాన్ని ఇటీవలి కేబినెట్ సమావేశంలో వెల్లడించారు.  ఇందుకోసం విశాఖలో ఇప్పటికే కార్యాలయాలు, సీఎం నివాసం కూడా సిద్దమవుతున్నట్లు ఆయనే చెప్పారు. రాబోయే ఎన్నికలను అక్కడి నుంచే ఎదుర్కోవాలని వైసీపీ నిర్ణయించింది. అందుకే ఇప్పటికిప్పుడు ఎలాగైనా పరిపాలన విశాఖ నుండే చేయాలని కసరత్తులు ప్రారంభించింది. నిజానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే మూడు రాజధానులంటూ ప్రకటించింది.  అనంతరం అమరావతి రైతుల నిరసనలు, కోర్టు చిక్కులు, కరోనా కారణంగా మూడు రాజధానులకు బ్రేకులు పడ్డాయి. కోర్టుల నుండి తీవ్ర ఒత్తిడితో మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం అదే అసెంబ్లీ సాక్షిగా వెనక్కి తీసుకుంది.

ఇప్పుడు కూడా ఏపీ రాజధానిగా అమరావతి అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయినా  ప్రభుత్వం విశాఖ రాజధాని అంటూ ప్రకటనలు చేస్తూనే ఉంది. రాజధానుల అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు చెప్పినా జగన్ సర్కార్ విశాఖలో రాజధాని ఏర్పాట్లు చేపడుతూనే ఉంది. కొన్ని నెలలుగా దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలిస్తామని ప్రకటిస్తున్న సీఎం జగన్ తాజాగా కేబినెట్లోనూ ఈ మేరకు ప్రకటన చేసేశారు. ఆ దిశగా విశాఖకు రాజధానిని తరలించేందుకు విజయదశమిని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అంతే కాకుండా రుషికొండ వద్ద నిర్మిస్తున్న భవనాల పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్, కీలక హెచ్వోడీ కార్యాలయాలను విశాఖకు తరలించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు వేగంగా జరుగుతోంది. ఇదే విషయమై తాజాగా.. మంత్రి అమర్నాధ్ మాట్లాడుతూ అక్టోబర్ 23వ తేదీనుండి జగన్ వైజాగ్ లోనే ఉంటారని ప్రకటించారు. 

ప్రస్తుతం విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంపు కార్యాలయం, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, నివాసాలు, అవసరమైన సిబ్బంది క్వార్టర్స్ తదితరాల ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారులు బిజీగా ఉన్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వారంలో రెండు రోజులు జగన్ వైజాగ్ లో ఉండబోతున్నట్లు తెలిసింది. అదికూడా గురు, శుక్ర వారాల్లో విశాఖపట్నంలో ఉంటారని మిగిలిన రోజుల్లో అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటనలు చేయబోతున్నట్లు చెప్తున్నారు. అయితే, జగన్ ఏ ఉద్దేశ్యంతో విశాఖ నుండి పాలన చేయనున్నారన్న చర్చ ప్రజల మధ్య జరుగుతుంది. చట్ట పరిధిలో విశాఖకు రాజధాని తరలించడం సాధ్యమయ్యేది కాదు. కోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పగా.. చట్టాన్ని అతిక్రమించి రాజధాని తరలించే పరిస్థితి లేదు.

రాజధాని అమరావతి కోసం స్థానిక రైతుల వద్ద తీసుకున్న భూములు, వారితో ప్రభుత్వం చేసుకున్న చట్టబద్దమైన ఒప్పందాల ప్రకారం అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి. లేదంటే రైతులకు కొన్ని వేల కోట్లు పరిహారం చెల్లించాలి. వీటిని ఉల్లంఘించి రాజధానిని తరలించడం సాధ్యం కాదని హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. అంతేకాదు దీనిపై చట్టాలు కూడా చేసే అధికారం కూడా ప్రభుత్వానికి లేదని విస్పష్టంగా పేర్కొంది. ఈ అంశంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా కోర్టు నిర్ణయం డిసెంబర్ లో ప్రకటించే అవకాశం ఉంది. ఈలోగా రాజధాని తరలింపు సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు.

దీనిని బట్టి చూస్తే జగన్ ఇప్పుడు విశాఖకు రాజధాని తరలింపు సాంకేతికంగా జరిగే పని కాదు. కానీ, సీఎం ఎక్కడ నుంచైనా పరిపాలన చేసే అవకాశం ఉంటుంది అని స్వయంగా జగనే చెబుతున్నారు కనుక విశాఖ నుండి పరిపాలన చేయాలని ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్,  వైసీపీ చెప్తున్నట్లుగా ఇది రాజధాని తరలింపు కాదు కేవలం సీఎం ఇల్లు, ఆఫీసు. క్యాంప్ ఆఫీసు తరలింపు మాత్రమే. ఇది కూడా కేవలం విశాఖ నుండి పాలన చేశానని చెప్పుకోవడానికీ,  జగన్ తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం మాత్రమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుండి రాజకీయ లబ్ది పొందడం కోసమే ఎన్నికలకు ముందు కంటితుడుపుగా ఈ విశాఖ నుండి పాలన డ్రామా మొదలు పెట్టినట్లు చూడాల్సి ఉంటుంది. అయితే, సీఎం తన ఇల్లు, ఆఫీసు తరలిస్తే రాజధాని కాదు.. దానికి ఒక చట్టం ఉంది.. అనుమతులు కావాలి.. కేంద్రం నోటిఫై చేయాలి.. ప్రభుత్వ అధికారిక ముద్ర మారాలి. కానీ, అవేమీ లేని విశాఖ జస్ట్ జగన్ ఈగో శాటిస్ఫాక్షన్ రాజధాని మాత్రమే.

By
en-us Political News

  
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.