Publish Date:Feb 11, 2020
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తోంది. ఏపీ, తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాకపోయినా జనాన్ని మాత్రం భయపెడుతోంది. అయితే, కరోరా వైరస్ పై రెండు తెలుగు రాష్ట్రాలూ కరోనాపై ముందుజాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తత పాటిస్తున్నాయి. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోరా వైరస్ గుర్తింపు పరికరాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రయాణికుడిని పరీక్షిస్తున్నారు. అయితే, ఇఫ్పటివరకు పలువురిని అనుమానితులుగా భావించి పరీక్షలు చేసినా ఒక్కరికీ కూడా పాజిటివ్ రాకపోవడంతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఊపిరిపీల్చుకుంటోంది.
మరోవైపు, ఏపీలో కూడా కరోనా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. ముఖ్యంగా విదేశీ ప్రయాణికులు రాకపోకలు సాగించే విశాఖలో కరోనాపై అలర్ట్ ప్రకటించారు. అలాగే, అతిపెద్ద పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం... పైగా ఉత్తర భారత్ నుంచి రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేజీహెచ్ లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడమే కాకుండా ఐసోలేషన్ కోసం మూడు పడకలను సిద్ధంగా ఉంచారు.
అయితే, ఇప్పటివరకు కరోనా కేసులేమీ నమోదు కాలేదని విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అయితే, కరోనా అత్యంత ప్రమాదకారి కావడంతో అన్ని ముందుజాగ్రత్తలు చేపట్టామన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి కర్ఛీఫ్ లేదా ఫేస్ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.
ఇక, విశాఖ కేజీహెచ్ లో కరోనా వైరస్ ముందస్తు ఏర్పాట్లను కేంద్ర వైద్యోరాగ్యశాఖ ఉన్నతస్థాయి బృందం పరిశీలించనుంది. కేజీహెచ్ అండ్ ఐడీ ఆస్పత్రుల్లో కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఏపీ వైద్యారోగ్యశాఖ చేపట్టిన సన్నద్ధత చర్యలను పరిశీలించనున్నారు. కరోనా ప్రత్యేక వార్డును పరిశీలించడంతోపాటు ఇంకా ఏమైనా ముందస్తు చర్యలు అవసరమైతే కేంద్ర వైద్య బృందం సూచించనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/visakhapatnam-coronavirus-alert-25-94102.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.