విరాట్ కోహ్లీ సంచలనం.. టెస్ట్ కెప్టెన్సీకి గుడ్బై..
Publish Date:Jan 15, 2022
Advertisement
విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీకి బై బై చెప్పేశారు. ఇప్పటికే విరాట్ టీ20 ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పగా.. అందుకు రివేంజ్గా అన్నట్టు బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పించింది. అప్పటి నుంచీ అసంతృప్తిగా ఉన్న విరాట్.. తాజాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓడిపోవడంతో.. ఇక తను టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు సంచలన నిర్ణయం ప్రకటించారు. ఈ న్యూస్ ఫ్యాన్స్కు నిజంగా షాకింగ్ న్యూసే. ‘‘దాదాపు ఏడేళ్లపాటు సారథిగా జట్టును సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేశా. బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వర్తించా. ప్రతి దానికి ముగింపు అనేది ఉంటుంది. అది నా టెస్టు కెప్టెన్సీకి కూడానూ. ఇప్పటి వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను అనుభవించా. అయితే కృషి, నమ్మకం లేకుండా ఏ రోజూ ఆడలేదు. విజయం కోసం 120 శాతం కృషి చేశానని బలంగా నమ్ముతున్నా. జట్టు కోసం హృదయ పూర్వకంగా పనిచేశా. ఈ సందర్భంగా బీసీసీఐ, రవిశాస్త్రి, ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు చెప్పాలి. మరీ ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో నా మీద నమ్మకం ఉంచిన ఎంఎస్ ధోనీ కృతజ్ఞతలు’’ అంటూ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది.
http://www.teluguone.com/news/content/virat-kohli-goodbye-to-his-test-captaincy-39-130227.html