ఈ అబ్బాయి చాలా మంచోడు.. అల్లుడికి అత్త కితాబు

Publish Date:May 26, 2023

Advertisement

సొంత అన్న కొడుకే  ముఖ్యమంత్రిగా ఉన్నారు. హత్య జరిగి నాలుగేళ్ల అయినా... ఆ హత్యకు స్కెచ్ వేసిన సూత్రదారులు వీళ్లేనంటూ.. పాత్రదారుల్లో ఒకరు అప్రూవర్‌గా మారి సీబీఐ ఎదుట స్వయంగా వాంగ్మూలం ఇచ్చినా.. నిందితులు ఇంత వరకు అరెస్ట్ కాలేదు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సైతం.. ఈ కేసును ఛేదించ లేక.. నిసత్తువతో చతికిలి పడిపోయినట్లుగా వ్యవహరిస్తోంది. మరోవైపు ఈ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే.. అత్యంత దారుణంగా హత్యకు గురైన వివేకానందరెడ్డికి బంధాలు, అనుబంధాలు, అక్రమ సంబంధాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లు అంటగడుతూ.. ఆయన క్యారెక్టర్ అసిసినేషన్ చేసేందుకు ఏ మాత్రం వెనకాడకుండా ఆరోపణలు గుప్పిస్తున్నారు.  వైఎస్  ఫ్యామిలీ నుంచి ఇలా ఒకరి తర్వాత ఒకరు తెరపైకి వచ్చి.. తమ తమ అభిప్రాయాలు వ్యక్తీకరిస్తున్నారు. దీంతో వివేకా హత్య కేసు.. ఓటీటీలో రిలీజ్ అయిన ఓ పెద్ద సైజ్ వెబ్ సిరీస్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందనే ఓ అభిప్రాయం  ఉమ్మడి కడప జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది.

తాజాగా వైయస్ ఫ్యామిలీ నుంచి వైయస్ వివేకా సొంత సోదరి వైయస్ విమలమ్మ.. మీడియా ముందుకు వచ్చి గొంతు సవరించుకొన్నారు. ఆ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్ అవినాష్ రెడ్డి అమాయకుడని.. చిన్ననాటి నుంచి మైల్డ్‌గా ఉండేవాడని.. చెప్పుకొచ్చారు. అలాగే ఈ హత్య కేసులో అసలు సిసలు సూత్రదారులు మాత్రం ప్రస్తుతం నడిరోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతోన్నారని.. ఈ కేసుతో ఏ మాత్రం సంబంధం లేని వారు మాత్రం జైళ్లలో   మగ్గుతోన్నారని ఆమెఆవేదన వ్యక్తం చేశారు. 

మరో వైపు తన తండ్రి హత్య కేసులో.. తమ కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని... గతంలో  వివేకా కుమార్తె వైయస్ సునీత స్వయంగా స్పష్టం చేశారని.. కానీ ఆ తర్వాత.. అదే  సునీత.. మాట మార్చారంటూ  విమలమ్మ పేర్కొనడమే కాదు, సునీత వెనుక దుష్టశక్తులు ఉన్నాయంటూ ఆమె ఆరోపించారు. అయితే  విమలమ్మ వ్యాఖ్యలపై ఉమ్మడి కడప జిల్లా వాసులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

అంతే కాదు విమలమ్మకు ఈ సందర్బంగా వారు పలు సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో వివేకా హత్య కేసులో..అవినాష్ రెడ్డి అమాయకుడు అయితే.. సీబీఐకి ఆయన ఎందుకు భయపడుతున్నారని.. అలాగే సీబీఐ విచారణకు రమ్మంటే.. ఆయన ఎందుకు ముఖం చాటేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. 

ఓ వేళ ఈ హత్య కేసులో  అవినాష్ నిర్దోషి అయితే.. సీబీఐ విచారణకు హాజరై... తన నిర్ధోషత్వన్ని నిరూపించుకోంటే సరిపోతోంది కాదా అని కడప జిల్లా వాసులు ప్రశ్నిస్తారు. మరో వైపు మీ మరో మేనల్లుడు వైయస్ జగన్ ప్రభుత్వమే కదా.. ఆంధ్రప్రదేశ్ ‌రాష్ట్రంలో అధికారంలో ఉంది. అలాంటప్పుడు వైయస్ వివేకా హత్య కేసును త్వరితగతిన ఛేదించాలంటూ.. సీబీఐపై ఆయన కానీ.. ఆయన ప్రభుత్వం కానీ ఎందుకు ఒత్తిడి చేయడం లేదని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక   సునీత వెనుక దుష్టశక్తులు ఉన్నాయన్నారు కదా? ఆ దుష్ట శక్తులు ఎవరో ప్రకటించాలని ఈ సందర్భంగా వైయస్ విమలమ్మను వారు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా మీ ప్రియమైన సోదరుడి కుమార్తె   సునీత ఎందుకు మాట మార్చారో మీకు తెలియదా? అంటూనే.. తన తండ్రి హత్య కేసులో దోషులు ఎవరో తేల్చాలంటూ... సోదరుడు ప్లస్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వద్దకు స్వయంగా వెళ్లి సునీత విజ్జప్తి చేయగా...  సీఎం వైయస్ జగన్ నుంచి వచ్చిన సమాధానం.. విన్న ఆమె.. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకొని.. ఏం చేసిందో.. ఏమిటో మీకు తెలియదా? అంటూ వైయస్ విమలమ్మకు ఉమ్మడి కడప జిల్లా వాసులు తలంటుతోన్నారు. 

అదీకాక వైయస్ అవినాష్ వెనుక సీబీఐ పడుతోందంటూ విమలమ్మ వ్యాఖ్యానించడం పట్ల జిల్లా వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి చెప్పిన సాక్ష్యమే కాదు.. వైయస్ వివేకా హత్య జరిగిన సమయానికి ముందు ఆ తర్వాత  వైయస్ అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్‌ డేటాపై సీబీఐ ఆరా తీయడం.. ఆ క్రమంలో పలువురిని పిలిచి విచారించడం... ఆ తర్వాత ఈ హత్య కేసులో అసలు సిసలు సూత్రదారులు వీరేనంటూ సీబీఐ రంగంలోకి దిగిందని... అంతేకానీ వైయస్ అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఇరికించాలనే తాపత్రయం సీబీఐకి ఎందుకు ఉంటుందని సదరు జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు.  

ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత ఇంటి మనిషి ఇలా హత్య కావింప బడితే.. ఈ కేసులో ఆయన స్పందన.. అదీ ముఖ్యమంత్రిగా నేటికి స్పందించకపోవడం పట్ల.. జిల్లా వాసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో అసలు సిసలు దోషులను ఏ మాత్రం విడిచిపెట్టవద్దంటూ సీఎం వైయస్ జగన్ మీద మీరైనా తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని జిల్లా వాసులు మనస్పూర్తిగా కోరుతున్నారు. 

ఏదీ ఏమైనా వైయస్ వివేకాను అత్యంత దారుణంగా హత్య చేయడం.. తొలుత ఆయనది గుండెపోటు అని చెప్పడం.. ఆ తర్వాత హత్య అని తేటతెల్లం కావడం.. అనంతరం ఈ హత్య కేసులో చోటు చేసుకొన్న వరుస పరిణామాల నేపథ్యంలో ఈ నాలుగేళ్లగా వైయస్ సునీతకు అందని న్యాయం... వైయస్ ఫ్యామిలీలోని ఇటువంటి పెద్ద వాళ్ల ప్రార్థనలతో.. ఈ వైయస్ వివేక హత్య కేసులో తప్పించుకొని.. బయట విచ్చలవీడిగా తీరుగుతోన్న అసలు సిసలు సూత్రదారులు ఎవరో వారిని కనిపెట్టి పట్టుకొని.. వారికి కఠిన శిక్ష పడేలా చేయడం ద్వారా ఈ కేసు విచారణకు శుభం కార్డు పడితే అదే తమకు ఇది అని కడప జిల్లా వాసులు క్లియర్‌ కట్‌గా స్పష్టం చేస్తుండడం విశేషం.

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.