షర్మిలపై దుష్ప్రచారం.. ఇక విమలమ్మ వంతు?

Publish Date:Apr 15, 2024

Advertisement

కడపలో వైఎస్ కుటుంబ రాజకీయాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో దోషులు ఎవరు? ఆయన హత్య ఎందుకు జరిగింది? అన్న విషయంలో కోర్టులు ఇంకా నిర్దుష్టమైన తీర్పు వెలువరించలేదు. కేసు విచారణ జరుగుతోంది. సీబీఐ దర్యాప్తు కూడా సాగుతోంది. అయితే ఈ ఐదేళ్లలో వివేకా హత్య ఎవరు ఎందుకు చేశారు? చేయించారు? అన్న ప్రశ్నలకు ప్రజలకు మాత్రం స్పష్టమైన సమాధానం లభించేసింది. 

అయితే జగన్ శిబిరం మాత్రం ఇంకా వివేకా హత్య విషయంలో అవినాష్ సుద్దపూసే అంటూ వస్తోంది. అక్కడితో ఆగకుండా వివేకా కుమార్తె సునీతపైనే ఆరోపణలు చేస్తున్నది. ఇప్పుడు సునీతకు మద్దతుగా షర్మిల కూడా అవినాష్ కు వివేహా హంతకుడిగా అభివర్ణిస్తూ హంతకుడికి మద్దతుగా నిలుస్తున్న జగన్ కు ఓటే వేయద్దని, నిజమైన వైఎస్ వారసురాలిగా తనను కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిపించాలని కొంగు జాచి అభ్యర్థిస్తున్నారు. దీంతో జగన్ శిబిరంలో ఆందోళన  మొదలైంది. షర్మిలపైనా వైసీపీ సోషల్ మీడియాలో  ట్రోలింగ్ ఆరంభమైంది. అక్కడితో ఆగకుండా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా షర్మిలను పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ కు స్వయానా చెల్లెలు అయిన షర్మిలపై వైసీపీ విమర్శలు మర్యాద గడప దాటేస్తున్నాయి. ఆమె వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ ప్రతిష్ట మసకబార్చడానికి కూడా వెనుకాడటం లేదు. అయితే వాటన్నిటికీ దీటుగా బదులిస్తూ జగన్ పై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ షర్మిల ముందుకు సాగుతున్నారు. 

అయితే షర్మిల కడపలో ప్రచారం ఆరంభించగానే త్రాసు ఆమె వైపు మెగ్గినట్లు స్పష్టంగా తెలిసిపోవడంతో జగన్ తన మేనత్త విమలమ్మను రంగంలోకి దింపారు. దీంతో ఇప్పుడు సొంత మేనత్తే షర్మిలపై దుష్ప్రచారానికి నడుంబిగించినట్లు అయ్యింది. దీంతో వైఎస్ కుటుంబ రాజకీయ పోరు కుటుంబంలోని మహిళల మధ్య మాటల యుద్ధానికి దారి తీసినట్లైంది  షర్మిల, సునీత ఒకవైపు.. జగన్, అవినాష్ రెడ్డి మరో వైపుగా గా ఉన్న కుటుంబ యుద్ధంలోకి   విమలమ్మ ఎంట్రీ ఇచ్చారు.  క్రైస్తవ మత ప్రచారానికే పరిమతమైన విమలమ్మ  జగన్ కు, అవినాష్ కు మద్దతుగా రాజకీయ ప్రచారానికి నడుంబిగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డిల చెల్లెలైన విమలమ్మ వైఎస్ మరణం తరువాత కుటుంబంలో జగన్ పక్షాన నిలిచిన ఏకైక వ్యక్తిగా చెప్పుకోవచ్చు.

షర్మిల చెబుతున్నట్లు విమలమ్మ కుమారుడికి సీఎం జగన్ వర్క్స్ ఇవ్వడం వల్లనే ఆమె ఆర్థికంగా స్థిరపడి ఆ కృతజ్ణతతో జగన్ పక్షాన నిలిచి ఉండొచ్చు కానీ ఇక్కడ విషయం అది కాదు..  సొంత అన్న వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ కు మద్దతుగా విమలమ్మ గళం విప్పడమే ఆమె ప్రతిష్టను కడప వాసులలో మసకబారేలా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అక్కడితో ఆగకుండా మేనకోడళ్లు షర్మిల, సునీతలను ఆమె నోరు మూసుకోమంటూ గదమాయించేలా మాట్లాడడాన్ని కూడా వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వారిలో ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు.  అవినాష్ రెడ్డిని ఏమీ తెలియని చిన్న పిల్లాడిగా అభివర్ణిస్తూ ఆమె మీడియా సమావేశంలోఅవినాష్‌రెడ్డిని చిన్నపిల్లాడిగా అభివర్ణించిన విమలమ్మ  షర్మిల, సునీతలు వైఎస్ కుటుంబ ప్రతిష్టను రోడ్డుకీడ్చారు అనడాన్ని తప్పుపడుతున్నారు.  

అలాగే షర్మిల, సునీతలు చంద్రబాబు చెప్పినట్లల్లా ఆడుతున్నారంటూ విమర్శించడాన్ని జీర్ణించు కోలేకపోతున్నారు. గత ఎన్నికల సమయంలో అన్న విజయం కోసం కాళ్లరిగేలా తిరిగిన షర్మిలకు అన్న జగన్ ఇచ్చిన మర్యాద, గౌరవం ఏమిటని నిలదీస్తున్నారు.  మేనత్త   వ్యాఖ్యలు,  హెచ్చరికలపై షర్మిల ఘాటు స్పందనను స్వాగతిస్తున్నారు.   
ఇప్పుడు జగన్ విమలమ్మను షర్మిల సానుకూల ఓట్లను చీల్చేందుకు ప్రచారానికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు కడప రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతోంది.  షర్మిలకు వ్యతిరేకంగా విమలమ్మ ప్రచారానికి పెద్దగా స్పందన లభించే అవకాశం ఉందని పరిశీలకులు భావించడం లేదు.  

By
en-us Political News

  
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు... నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఈ  ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ  గల్ఫ్ జెఏసి చైర్మన్, గుగ్గిల్ల రవిగౌడ్ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి
దేశంలోనే అత్యంత రిచెస్ట్ సి.ఎం.గా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఎంపీ అభ్య‌ర్థుల్లో ధ‌న‌వంతుడు గా పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. ఈ ఇద్ద‌రి గురించి దేశ‌వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంపాద‌న‌ను, నా సంపాద‌న‌తో పోల్చ‌వ‌ద్దు. ఆయ‌నది అక్ర‌మ సంపాద‌న అని సీబీఐ చెబుతోంది. నాది అలా కాదు. నేను ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాయించుకున్నా. సో.. ఆయ‌న‌తో న‌న్ను పోల్చ‌వ‌ద్దంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్.
తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.తెలంగాణ  పిసిసి అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కాంగ్రెస్ , బిజెపి నేతల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణల పర్వానికి శ్రీకారం చుట్టారు. 
ఎన్నికల వేళ ప్రచారంలో పై చేయి సాధించడానికి రాజకీయ నాయకులు, పార్టీలూ రోజు కో వ్యూహంతో ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకుని ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ డిస్పరేట్ గా తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఎపిలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. వైకాపా హాయంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. సహజవనరులను సైతం కొల్లగట్టడంతో ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. అధికారపార్టీ ఆగడాలకు అంతే లేకపోవడంతో చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది.  
ఎండలు మండిపోతున్నాయి. ఎండలో ఇంట్లోంచి కాలు బయటకి పెట్టాలంటే యువత కూడా భయపడిపోతున్న పరిస్థితులు.
వల్లభనేని వంశి నోటి వెంట వచ్చే మాటలన్నీ పోలింగ్ కు ముందే తన ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. వల్లభనేని వంశీ 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన తరువాత వైసీపీలోకి జంప్ చేశారు. అంతుకు ముందు ఎన్నికలలో అంటే 2014 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
గత రెండు విడతలుగా జరిగిన పోలింగ్ సరళిని చూస్తే, జనాలకు మోడీ విషయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించడం లేద‌ని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మొదటి విడత ఓటింగ్ చూసి షాక్ తింటే, రెండవ విడతలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ఇంకా నిరాశ పడాల్సి వస్తోంది
చేసేవన్నీ ఇల్లీగల్ పనులు.. అసలు విషయం బయటపడ్డాక నాకేమీ సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు..
​వనపర్తి జిల్లా భూత్పూరు గ్రామానికి చెందిన రైతు శేఖర్ ఆదివారం నాడు తన పొలానికి
ఏపీ ఊడిపోయే సీఎం జగన్ మొన్న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టే విడుదల కార్యక్రమాన్ని సౌండ్ మ్యూట్
కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం దూసుకెడుతోంది. ఆ పార్టీ అభ్యర్థి మాధవీరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైసీపీ కంచుకోట బీటలు వారిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా తెలుగుదేశం జోరు కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ కడప అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ప్రజా నిరసన సెగ తగులుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.