Publish Date:Mar 24, 2025
జగన్, విజయసాయిరెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? వైసీపీకి రాజీనామా చేసిన తరువాత విజయసాయిరెడ్డి జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికి అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. నేరుగా జగన్ ను ఉద్దేశించి విమర్శనాత్మక వ్యాఖ్యలు ఏమీ చేయకపోయినా.. విజయసాయి మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారీ, అలాగే ఎక్స్ వేదికగా పెట్టిన ప్రతి పోస్టులోనూ జగన్ ను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు.
పైగా అవసరం, అవకాశం లేకపోయినా.. కల్పించుకుని మరీ జగన్ కు ఇబ్బందులు, చిక్కులు తెచ్చిపెట్టే వ్యాఖ్యలు, పోస్టులు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాకినాడ పోర్టు కేసులో సీబీఐ విచారణకు హాజరైన విజయసాయి.. ఆ కేసుకు సంబంధించి కర్త, కర్మ, క్రియా అన్నీ జగన్ కు బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే అని మీడియా ఎదుట కుండబద్దలు కొట్టేసి జగన్ కే కాదు.. మొత్తం వైసీపీకి షాక్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా, అదే మీడియా సమావేశంలో అసందర్భంగానే అయినా అత్యంత వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ మద్యం కుంభకోణం వెనుక ఉన్నది కసిరెడ్డి రాజశేఖరెడ్డేనని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అవసరమైతే ముందు ముందు వెళ్లడిస్తానంటూ ఉత్కంఠ రేపారు. జగన్ లో ఆందోళన నింపారు. అయితే విజయసాయి వెల్లడించే వరకూ ఆగకుండా నెటిజనులు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యవహారం అంతా సోషల్ మీడియాలో గుమ్మరిం చేశారు.
ఇక ఇప్పడు తాజాగా విజయసాయి చెన్నై వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన డిమిటేషన్ వ్యతిరేక సదస్సు విషయంలో విజయసాయి తనదైన స్టైల్ లో స్పందించారు. రాజకీయాల నుంచి వైదొలిగిన విజయ సాయి డీమిటేషన్ విషయంలో జగన్ ను పూర్తిగా విస్మరించి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు మద్దతుగా ఎక్స్ వేదికగా స్పందించారు. డిలిమిటేష్ పై కేసీఆర్ ప్రతిమాటకూ మద్దతు తెలిపిన విజయసాయి.. వ్యూహాత్మకంగా జగన్ ను విస్మరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన డీమిలిటేషన్ పై దక్షిణాది రాష్ట్యాల ఆందోళనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్ననని పేర్కొన్న విజయసాయి.. తన ట్వీట్ లో ఈ విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి చేసిన కంట్రీబ్యూషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కేసీఆర్ సూచించారు. దీనిపైనే ఎక్స్ వేదికగా విజయసాయి స్పందించారు. అయితే డీలిమిటేషన్ ను వ్యతిరేకించిన జగన్ గురించి మాత్రం ఈ మాజీ వైసీపీ నేత కనీసం ప్రస్తావించలేదు. జగన్ పేరు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదన్నట్లుగా ఆయన ట్వీట్ ఉంది. ఈ విధంగా జగన్ ను విస్మరించడం ద్వారా విజయసాయి.. జగన్ పట్ల తన అయిష్టతను, వ్యతిరేకతను ప్రస్ఫుటంగా చాటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి ఈ తీరు ముందు ముందు జగన్ ను చిక్కుల్లోకి నెట్టడం ఖాయమని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijaysai-ignores-jagan-praises-ktr-25-194878.html
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.