విజయ్ సాయిరెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. ఇన్నాళ్ల పాటు వ్యవసాయమే నా వ్యాపకం, జీవన పరమార్ధం అంటూ కబుర్లు చెప్పిన విజయసాయిరెడ్డి.. పార్లమెంటు అమారావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లును ఆమోదించిన వెంటనే సామాజిక మాధ్యమంలో క్యాస్ట్ రిలేటెడ్ పోస్టుతో రంగంలోకి దిగారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభలూ ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లును ఇలా ఆమోదించాయో లేదో అలా ఆయన అమరావతి ని కమ్మరావతి కాకుండా చూసుకోండి ఫస్ట్ అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ రెండు విషయాలు ప్రముఖంగా ప్రస్తావించాలి. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు. అసలు రాజకీయాలలోనే లేరు. వైసీపీకి రాజీనామా చేస్తున్నపుడు విజయసాయి ఇదే చెప్పారు. అన్నీ వదిలేసి తాను వ్యవసాయం చేసుకుంటానన్నారు.. అలాంటి వ్యవ-సాయిరెడ్డి అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేయడం వార్తల్లోకి రావడం తరచూ జరుగుతూనే ఉంది. బేసిగ్గా తాను రాజకీయ పార్టీ పెడతానో లేదో తెలీదుగానీ మీడియా సంస్థనైతే పెడతానని అన్నారు విజయసాయిరెడ్డి. అది కూడా ఎందుకులే.. ఖర్చు దండగ అనుకున్నారో ఏమో.. ఫ్రీగా ఒక ట్వీట్ పడేస్తే పోతుందనే కాడికి వచ్చేశారాయన.
నిజంగానే ఆయనకు తెలుగు సమాజం మీద అంతటి ప్రేమాభిమానాలే ఉంటే.. ఆ విధానం వేరుగా ఉండేది. ఇరవై నాలుగ్గంటలూ మీడియాను ఆడిపోసుకునే ఆయన.. ఈ రంగంలోకి దిగి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేవారు. కానీ ఇప్పటి వరకూ అలాంటిదేదీ చేయకుండా కాసేపు జనసేన అధినేత నాకు ఎప్పటి నుంచో మిత్రుడనడం.. ఇదిగో ఇప్పుడు చూస్తే కమ్మరావతి అంటూ కామెంట్ చేసి.. కులాల కార్చిచ్చు రేపడానికి ప్రయత్నించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
నిజానికి వీరందరికీ ఎందుకింత కడుపు మంట అంటే, విశాఖ లో అయితే అడిగే వారే ఉండరు. అందుకు వైసీపీ అధికార సమయంలో ఆయన చేసిన భూ దోపిడీయే నిలువెత్తు సాక్షి. అందుకే అందరి అమ్మలాంటి అమరావతిపై ఇలాంటి కామెంట్లు చేసి.. విజయసాయి కడుపు మంట చల్లార్చు కుంటున్నారంటున్నారు. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి అటు వాడే కానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ ఇటు వాడు కాడన్న మాట మరోమారు నిజమైందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayasaireddy-kammarawati-comments-spark-criticism-39-216616.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో యూనిట్ ఇంఛార్జ్లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.