సంచలనం ఏమీ లేదు.. అనూహ్యమేమీ సంభవించలేదు. అంతా పక్కాగా, జగన్ స్క్రిప్టు ప్రకారమే జరిగిపోయింది. ప్లీనరీ వేదికగా వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ వైదొలిగారు. పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ప్లీనరీ విజయమ్మ రాజీనామాతోనే ఆరంభమౌతుందని తెలుగు వన్ ముందే చెప్పింది. అదే విధంగా జరిగింది.
అయితే తన రాజీనామా ప్రకటన సందర్భంగా విజయమ్మ మాట్లాడిన మాటలే ఒకింత నర్మగర్భంగా ఉన్నాయి. కన్న తల్లిగా తన మద్దతు తన బిడ్డలిద్దరికీ ఉందని చెబుతూనే తన భర్త వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం తెలంగాణ కోడలిగా తన కూతురు చేస్తున్న కృషికి మద్దతివ్వాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు.
జగన్ సమక్షంలోనే ఆమె ప్రసంగించారు. తెలంగాణ వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించి తెలంగాణలో వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న షర్మిలకు అండగా నిలవడం కోసమే తాను వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగలేనని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
విజయమ్మ రాజీనామా ప్రకటన అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగలేనంటూ చేసిన వ్యాఖ్య సంచలనంగా మారాయి. ఎంత జగన్ స్క్రిప్ట్ ప్రకారమే రాజీనామా ప్రకటన చేసినా.. ఆ ప్రకటన సందర్భంగా చేసిన ప్రసంగంలో మాత్రం ప్రస్తుత పరిస్థితులు అంటూ చేసిన వ్యాఖ్యలను విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు. రాజీనామా కోసం ఆమెపై వచ్చిన ఒత్తిడికి ఆ వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayamma-resigns-as-ycp-honorary-president-25-139317.html
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!