Publish Date:Aug 11, 2022
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి, వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చరైంది. ఆయితే ఈ ప్రమాదంలో విజయమ్మ సురక్షితంగా బయట పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. దాదాపుగా ఇటువంటి ప్రమాదంలోనే ఇటీవల నలుగురు మరణించిన సంగతి తెలిసిందే.
దీంతో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చరైందనగానే అందరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారని తెలియగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విజయమ్మకు వైసీపీతో ఎటువంటి సంబంధాలూ లేవు. ఆమె పూర్తిగా తెలంగాణకే పరిమితమయ్యారు.
ఆమె కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల వెఎస్సార్ తెలంగాణ పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైఎస్ సతీమణిగా విజయమ్మకు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గౌరవం, మర్యాదా ఉన్నాయి. అందుకే ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందనగానే ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఉలిక్కి పడ్డాయి. ఆమె క్షేమంగా బయటపడ్డారని తెలియగానే ఊపిరి పీల్చుకున్నాయి. వైఎస్ స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayamma-escaped-from-accident-39-141740.html
కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.