విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా అస్త్రం.. కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకేనా?

Publish Date:Jan 24, 2025

Advertisement

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. రాజ‌కీయాల్లో త‌ల‌పండిన వారు సైతం ఊహించ‌ని విధంగా వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి శనివారం (జనవరి 25) రాజీనామా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. రాజ‌కీయాల‌కు తాను దూరంగా ఉంటాన‌ని.. రాబోయే కాలంలోనూ ఏ పార్టీలో చేర‌బోన‌ని స్ప‌ష్టం చేశాడు. ఒక విధంగా రాజకీయ సన్యాసం ప్రకటించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు శుక్రవారం ట్వీట్ చేశారు.   విజ‌య‌సాయిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణ‌యం వైసీపీ శ్రేణుల‌కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. వైసీపీ అధికారం కోల్పోయిన త‌రువాత ఒక్కొక్క‌రుగా ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీలో ఉండ‌లేమ‌ని బ‌య‌ట‌కు వ‌చ్చి ఇత‌ర పార్టీల్లో చేరారు. మ‌రికొంత మంది అదే బాట‌లో నడిచేందుకు రెడీ అవుతున్నారు.  అయితే, విజ‌య‌సాయిరెడ్డి లాంటి నేత‌  పార్టీని వీడుతార‌ని ఏ ఒక్క‌రూ ఊహించ‌లేదు. కానీ, ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

ఆయ‌న తాజా నిర్ణ‌యం వెనుక ప‌లు కార‌ణాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీటిలో ముఖ్యంగా పార్టీలో ఆయ‌నకు త‌గిన ప్రాధాన్య‌త లేక‌పోవ‌టం,  వెంటాడుతున్న కేసులు. వైసీపీలో ఉంటే త‌న‌ను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చున‌ని విజ‌య‌సాయిరెడ్డి కొద్ది రోజులుగా భ‌య‌ప‌డుతున్నాడ‌ని, ఈ క్ర‌మంలోనే కేసుల నుంచి త‌ప్పించుకునే ప్రయత్నాలలో భాగంలోనే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.   రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నా.. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి శనివారం (జనవరి 25) రాజీనామా చేయ‌బోతున్నా.. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ క్ర‌మంలో వైఎస్ఆర్‌ కుటుంబంపై, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆయ‌నకున్న అభిమానాన్ని చాటుకునే ప్ర‌య‌త్నమూ చేశారు.  వైఎస్ కుటుంబానికి రుణ‌ప‌డి ఉంటాన‌న్న విజ‌య‌సాయిరెడ్డి.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, భార‌తికి స‌దా కృత‌జ్ఞుడిగా ఉంటాన‌ని చెప్పారు. అంతేకాదు.. జ‌గ‌న్ కు మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబంపైనా, అదే విధంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పైనా విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా తాను చేసిన ట్వీట్ లో వారి పేర్లనూ ప్రస్తావించారు. తెలుగుదేశంతో రాజ‌కీయంగా విబేధించా.. అంతేత‌ ప్ప చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబంతో తనకు వ్య‌క్తిగ‌తంగా విభేదాలు లేవనీ,  ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనూ చిర‌కాల స్నేహం ఉందంటూ విజ‌యసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక‌ నుంచి రాజ‌కీయాల‌కు నాకు సంబంధం లేద‌ని..తన భ‌విష్య‌త్‌ మొత్తం వ్య‌వ‌సాయంపై దృష్టిపెడ‌తాన‌ని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. 

వాస్త‌వానికి విజ‌య‌సాయిరెడ్డి జ‌నంలో పెరిగిన నాయ‌కుడు కాదు. జ‌నం ఆద‌రించిన నాయ‌కుడు అంత‌కంటే కాదు. కేవ‌లం నామినేటెడ్ ప‌ద‌వుల ద్వారా ప్ర‌జ‌ల‌పై పెత్త‌నం చెలాయించిన నేత మాత్ర‌మే. వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి కుటుంబంతో మంచి ప‌రిచ‌యం ఉండ‌టంతో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో వైఎస్ఆర్ కు న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా మెలిగారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కంపెనీలు పెట్ట‌డంలో, అందుకు కావాల్సిన అన్ని విష‌యాల్లో విజ‌య‌సాయిరెడ్డి కీల‌క భూమిక పోషించారు. ఈ క్ర‌మంలోనే అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి. ఈడీ, సీబీఐ కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల్లో జ‌గ‌న్ నెంబ‌ర్ 1 అయితే,  విజ‌య‌సాయిరెడ్డి నెం.2గా ఉన్నారు.  ఇదిలా ఉంటే.. వైసీపీలో కూడా చాలా కాలం పాటు విజ‌య‌సాయిరెడ్డి నెం.2గా కొన‌సాగారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావ‌డంలో విజయసాయిరెడ్డి కీల‌క భూమిక పోషించారు. అయితే వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన కొద్ది కాలానికే ఆ పార్టీలో ఆయ‌న స్థాయి దిగ‌జారుతూ వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల ముందు మ‌ళ్లీ పార్టీలో కీల‌క నేత‌గా వ్య‌వ‌హరించిన‌ప్ప‌టికీ.. వైసీపీ ఘోర ఓట‌మి పాలైంది. ఆ త‌రువాత కాలంలో పార్టీ కార్యక్ర‌మాల్లో పెద్ద‌గా యాక్టివ్ గా విజ‌య‌సాయిరెడ్డి క‌నిపించ‌ లేదు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కేవ‌లం ఢిల్లీ రాజ‌కీయాల‌కే ప‌రిమితం అయ్యారు.

విజ‌య‌సాయిరెడ్డి రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్ప‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో బీజేపీతో ఉన్న‌ సంబంధాలుకూడా ఓ కార‌ణంగా తెలుస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతోపాటు అమిత్ షాతో విజ‌య‌సాయిరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. కొంత‌ కాలం రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌టం ద్వారా గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని ద‌క్కించుకోవ‌చ్చున‌న్న ఆలోచ‌న‌లో విజ‌య‌సాయిరెడ్డి ఉన్న‌ట్లు స‌మాచారం. బీజేపీ ముఖ్య‌ నేత‌ల నుంచిసైతం అందుకు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింద‌న్న వాద‌న వైసీపీ వ‌ర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నది. 

మ‌రోవైపు.. కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా అస్త్రాన్ని ప్ర‌యోగించార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయ‌న ఇటీవల ఈడీ  విచారణకు సైతం   హాజరయ్యారు. కాకినాడ సెజ్‌లో తన వాటాలను బలవంతంగా లాక్కున్నారన్న కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా విజ‌య‌సాయిరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన దందాల వ్య‌వ‌హారంకూడా వెలుగులోకి వ‌చ్చింది‌. వైసీపీ హ‌యాంలో చేసిన అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తుండటంతో త‌న‌ మెడ‌కు ఉచ్చుబిగిస్తున్నద‌ని భావించిన విజ‌య‌సాయిరెడ్డి వాటి నుంచి త‌ప్పించుకునేందుకు వ్యూహాత్మ‌కంగానే రాజీనామా అస్త్రాన్ని ఎంచుకున్నారన్న ప్ర‌చారం జ‌రుగుతున్నది.

రాజ‌కీయాల‌కు దూర‌మైతే ఏపీలోని కూట‌మి నేత‌ల‌తో   స‌త్సంబంధాలు ఏర్ప‌డ‌తాయ‌ని, ఆ త‌రువాత నెమ్మ‌దిగా బీజేపీ పెద్ద‌ల ద్వారా త‌న‌పై న‌మోదైన కేసులు, విచార‌ణ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని విజ‌య‌సాయిరెడ్డి ఆలోచ‌న‌గా వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఏదిఏమైనా వైసీపీకి విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా బిగ్ షాక్ అనే చెప్పొచ్చు.
విజయసాయి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గంటల వ్యవధిలోనే వైసీపీకి చెందిన మరో కీలక నేత అయోధ్యరామిరెడ్డి కూడా తాను వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. రాంకీ గ్రూప్ సంస్థల అధిపతి అయిన అయోధ్యరామిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు కూడా, జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఇద్దరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. అదే సమయంలో జగన్ నాయకత్వంపై ఆయనకు అత్యంత సన్నిహితులే విశ్వాసం కోల్పోయారని తేటతెల్లం చేసింది.

By
en-us Political News

  
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.