విజయ్ ప్రమాణ స్వీకారం.. ముహూర్త బలం ఎలా ఉందంటే?

Publish Date:May 10, 2026

Advertisement

బేసిగ్గా అష్టమి, నవములు కష్టమి రోజులని అంటారు. మే 10, ఆదివారం ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకార ముహుర్తం.. సెంటిమెంటు ప్రకారం ఇది నవమి. మరి ఆయన జాతకానికి జ్యోతిష పరంగా ఎలాంటి ఆటంకాలు ఏర్పడుతాయి? అసలే సంకీర్ణ ప్రభుత్వం, దీన్నిఆయనకున్న జాతక బలం ఎలా హ్యాండిల్ చేస్తుంది?

సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు.  నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది. ఇందుకు పరిహారమేంటో చూస్తే..  ఒకవేళ అభిజిత్ లగ్నంలో అంటే, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో.. ప్రమాణ స్వీకారం చేస్తే కొన్ని దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుందని చెబుతారు.

మే 10 ఆదివారం కావడం విజయ్‌కు ఒక రకంగా కలిసి వచ్చే అంశం. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు అధికారానికి, ప్రభుత్వానికి కారకుడు. ఆదివారం రోజు అధికారం చేపట్టడం వల్ల ఆయనకు వ్యక్తిగతంగా ఒక రకమైన తేజస్సు.. నిర్ణయాధికారం లభిస్తుంది. జాతక బలం చూస్తే విజయ్ జాతకంలో రవి, కుజుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆయన పుట్టిన తేదీ.. జూన్ 22, మిథున రాశి/కర్కాటక లగ్నం ప్రకారం చూస్తే.. ఇది ఆయనకు ప్రజల్లో ఉండే ఇమేజ్‌ను కాపాడుతుంది. 

సంకీర్ణ ప్రభుత్వం వర్సెస్  జాతక బలం అంశం పరిశీలిస్తే.. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం అనేది ఓ సాహసం లాంటిదే. ఇందుకు శని, గురు గ్రహాల బలం చాలా అవసరం. ఇక సవాళ్లు ఎలా ఉంటాయో చూస్తే.. సంకీర్ణంలో భాగస్వాములు పదే పదే బ్లాక్ మెయిల్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ముహూర్తంలో దోషం ఉంటే, ప్రభుత్వం పూర్తి కాలం అంటూ ఐదేళ్లు   సాగడంపై నీలినీడలు కమ్ముకునేలా ఉందని జ్యోతిష్య పండితులు అంటున్నారు.  విజయ్ జాతకంలో గజకేసరి యోగం వంటివి ఉంటే..  ఆయన తన వాగ్ధాటితో, ప్రజాకర్షణతో సంక్షోభాలను ఎదుర్కోగలరు. కానీ.. శని ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం మిత్రపక్షాల వల్ల మానసిక ఒత్తిడి తప్పదు.

మే 2026 నాటికి గురువు మిథున రాశిలో, లేదా కర్కాటకంలోనో సంచరించే అవకాశం ఉంది. ఇది విజయ్‌కు రాజకీయంగా గౌరవాన్నిస్తుంది కానీ, రాహు, కేతువుల సంచారం వల్ల సొంత పార్టీలోనే అంతర్గత కుట్రలు లేదా నమ్మకద్రోహాలు జరిగే అవకాశం ఉంది. ఇక ముహూర్త బలం సంగతి చూస్తే..  ఉదయం 10 గంటల సమయం అనేది సాధారణంగా వృషభ లేదా మిథున లగ్నం అయ్యే అవకాశం ఉంటుంది. లగ్నంలో శుభ గ్రహాలు ఉంటేనే ఈ సంకీర్ణ ప్రభుత్వం సాఫీగా సాగుతుంది.

విజయ్ ఒక విక్రమార్కుడి లాగా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారు. అయితే..   సంకీర్ణ ప్రభుత్వం అనేది పూలపాన్పు కాదు. జ్యోతిష్య రీత్యా నవమి తిథిని ఎంచుకోవడం ఆయన ధైర్యానికి నిదర్శనమో లేక గ్రహబలంపై ఉన్న నమ్మకమో తెలియదు కానీ, ముహూర్త బలంతో పోలిస్తే ఆయన ప్రజా బలం, వ్యక్తిగత జాతక బలం మాత్రమే ఈ సంకీర్ణాన్ని నెట్టుకురావడానికి తోడ్పడాలి. శత్రువుల నుంచి.. ముఖ్యంగా పాత రాజకీయ శక్తుల నుంచి.. ఆయనకు నిరంతర సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. దీనిని ఆయన తనదైన సినిమాటిక్ నాలెడ్జ్ తో హ్యాండిల్ చేస్తారా లేక  పోరాడుతూనే ఉంటారా అనేది తేలాల్సి ఉంది.

By
en-us Political News

  
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.