Publish Date:Sep 17, 2020
సాక్షాత్తు పార్లమెంట్లో న్యాయస్థానాలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అమరావతి భూములకు సంబంధించి ఏర్పాటైన సిట్ విచారణపై హైకోర్టు స్టే ఇవ్వడం పై విజయసాయిరెడ్డి సందర్భం లేకుండానే రాజ్యసభలో ప్రసంగించారు. దీనిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యంతరం చెప్పినా ఆయన ఆపలేదు. అంతేకాకుండా పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రాన్ని న్యాయ వ్యవస్థ విస్మరిస్తోందని అయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ధర్మాన్ని కాపాడాల్సిన వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులను కూడా హరిస్తున్నాయని, మీడియా గొంతు నొక్కుతున్నాయని న్యాయ వ్యవస్థ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా అయన డిమాండ్ చేశారు. తను ఏ జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం లేదని అయితే న్యాయస్థానాలు మాత్రం మీడియా నోరు నొక్కుతున్నాయని విమర్శించారు. విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్థపై ఈ స్థాయిలో విరుచుకుపడటానికి కారణం మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ విషయంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మీడియాలో, సోషల్ మీడియాలో రాకుండా హైకోర్టు ఆదేశాలివ్వడమే.
అయితే న్యాయ వ్యవస్థపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ నేతలు వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థ మీడియా గొంతు నొక్కిందని వైసీపీ నేతలు అంటున్నారని ఐతే వివేకా హత్య కేసులో విచారణ అంశాలు మీడియాలో రాకూడదని కోర్టుకు వెళ్లి మరీ స్టే తెచ్చుకున్న విషయం వారు మరిచిపోయారా అని ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు జడ్జిలను కూడా బెదిరింపులకు గురిచేస్తున్నారని.. అలాగే కోర్టులను కూడా బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఎపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని దీనికోసం న్యాయమూర్తులను భయబ్రాంతులకు గురి చేసైనా.. తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసిపి పై మండిపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijay-sai-reddy-sensational-comments-on-ap-high-court-25-104165.html
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు