చెత్తగా ఆడాం.. ఓటమిపై టీమ్ ఇండియా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్.!
Publish Date:Jul 8, 2026
Advertisement
క్రికెట్ లో గెలుపు, టములు సహజమే అయినా.. కొన్ని ఓటములు మాత్రం అభిమానులను, జట్టును కోలుకోలేని దెబ్బ తీస్తాయి. తాజాగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టుకు అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ మ్యాచ్లో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా ఇది భారీ ఓటమి కావడం గమనార్హం. ఈ దారుణ వైఫల్యంపై టీమిండియా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. జట్టు ప్రదర్శన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, మైదానంలో ఆడిన తీరు చెత్తగా ఉందంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆటగాళ్ల బాధ్యతారాహిత్యాన్నిగట్టిగా విమర్శించారు. పిచ్ 200 పరుగులు సాధించే అంత సులువుగా ఏమీ లేదన్న శ్రేయస్ అయ్యర్.. టీమ్ ఇండియా బౌలర్లు ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేదన్నాడు. ఇక 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటింగ్ విభాగం పేకమేడలా కూలిపోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ముఖ్యంగా పవర్ప్లేలోనే 4 కీలక వికెట్లను కోల్పోవడం జట్టును కోలుకోలేని దెబ్బ తీసిందని శ్రేయస్ అయ్యర్ విశ్లేషించాడు. పవర్ప్లే ముగిసేసరికే మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపు మలుపు తిరిగిందని, అంతటి ఒత్తిడిలో భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యంగా మారిందని చెప్పాడు. India vs England T20, Team India Loss, Trent Bridge T20, Shreyas Iyer Angry, Teluguone
http://www.teluguone.com/news/content/very-poor-performence-36-225347.html





