Publish Date:Dec 24, 2019
రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు న్యాయం జరిగేలా తన వంతు ప్రయత్నిస్తానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాజధానిని తరలించొద్దంటూ పెద్దఎత్తున ఆందోళనలు చేస్తోన్న అమరావతి రైతులు, కుటుంబాలు... ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. రాజధానిని తరలిస్తే అమరావతి కోసం భూములిచ్చిన తమ పరిస్థితేంటని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. మోడీ భూమిపూజ చేసిన చోట రాజధాని నిర్మాణాన్ని నిలిపివేస్తుంటే తమ నిద్ర పట్టడం లేదని... కనీసం అన్నం కూడా సహించడం లేదని అమరావతి రైతులు, మహిళలు... ఉపరాష్ట్రపతికి తమ బాధను చెప్పుకున్నారు. రాజధాని వివాదంపై జోక్యం చేసుకోవాలని కోరిన రైతులు... ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగేలా కేంద్రంతో ప్రకటన చేయించాలని కోరారు.
అయితే, తాను రాజకీయాలు మాట్లాడకూడదంటూ అమరావతి రైతులు, మహిళలకు నచ్చజెప్పిన వెంకయ్యనాయుడు... మీ బాధను అర్ధం చేసుకోగలను.... ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుందో అది జరిగేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు... దేశ భవిష్యత్ కు ఏది మంచిదో అదే చేస్తానని... ఎవరికి ఏం చెప్పాలో అదే చెబుతానని భరోసా కల్పించారు. అయితే, తాడేపల్లిగూడెం నిట్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు.... అభివృద్ధి వికేంద్రీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కేవలం జిల్లా కేంద్రాలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరముందన్నారు. అయితే, తన వ్యాఖ్యలను ప్రస్తుతం ఏపీలో వికేంద్రీకరణ రగడతో ముడిపెట్టొద్దని సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/venkaiah-naidu-sensational-comments-on-ap-3-capitals-issue-25-92524.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.