తెలుగుదేశం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి కోపం వచ్చింది. నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశం నుంచి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వాకౌట్ చేశారు. తనకు సముచిత గౌరవం లభించలేదన్న ఆగ్రహంతో ఆయన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. నెల్లూరు జెడ్పీ కార్యాలయంలో ఆదివారం (నవంబర్ 3) జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభించిన ఆర్డీవో సమావేశానికి వచ్చిన ప్రజా ప్రతినిథులకు బొకెలు అందజేశారు.
అయితే మంత్రులు, ఎమ్మెల్యేలకు బొకేలు అందించి సభకు పరిచయం చేసిన ఆర్డీవో, ఎంపీ వేమిరెడ్డిని మాత్రం విస్మరించారు. దీంతో వేమిరెడ్డికి ఆగ్రహం వచ్చింది. అంతే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎంత సముదాయించినా.. గౌరవం లేని చోట ఉండలేనంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా భర్తతో పాటు సమావేశం నుంచి వెళ్లి పోయారు. ఇదేమీ చిన్న విషయం కాదు. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరడానికి కారణమే వైసీపీలో తనకు గౌరవం లభించడం లేదని. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాలలో చెప్పారు.
వేమిరెడ్డి వంటి స్టేచర్ ఉన్న వ్యక్తులు పదవులు, హోదాల కంటే రెస్పెక్ట్ ఉండాలని భావిస్తారు. వైసీపీలో అలా రెస్పెక్ట్ దొరకలేదనే ఆయన పార్టీ వీడారు. ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశంలో కూడా ఆయనకు ఎదురౌతోందని భావిస్తున్నారు. ఎంపీనైన తనను అధికారులు గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆయనను సముదాయించేందుకు ఆనం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అధికారులు తనను అవమానించారనీ, ఇంకెప్పుడూ సమీక్షా సమావేశానికి వచ్చేది లేదని వేమిరెడ్డి కుండబద్దలు కొట్టేశారు. అంతా అయిపోయిన తరువాత ఆనం రామనారాయణరెడ్డి అధికారలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటిది పునరావృతం కాకూడదని ఆదేశించారు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధి విషయంలో వంక పెట్టడానికి వీల్లేకుండా పని చేస్తున్నది. ఈ విషయంలో చంద్రబాబు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎక్కడైనా నేతలూ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తుంటే వెంటనే కరెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో నేతలకు సముచిత గౌరవం దక్కే విషయంపై కూడా దృష్టి పెట్టాలి. నేడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి జరిగినట్లు మరో రోజు మరో నేతకు జరగకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వేమిరెడ్డి విషయంలో జరిగింది పొరపాటు మాత్రమేననీ, మరోసారి పునరావృతం కాదనీ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయనకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చిన్న విషయమే కదా అని వదిలేస్తే ముందు ముందు ఇదో ఆనవాయితీగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రొటోకాల్ ను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vemireddy-walk-out-25-187842.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.