తెలుగుదేశం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి కోపం వచ్చింది. నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశం నుంచి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వాకౌట్ చేశారు. తనకు సముచిత గౌరవం లభించలేదన్న ఆగ్రహంతో ఆయన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. నెల్లూరు జెడ్పీ కార్యాలయంలో ఆదివారం (నవంబర్ 3) జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభించిన ఆర్డీవో సమావేశానికి వచ్చిన ప్రజా ప్రతినిథులకు బొకెలు అందజేశారు.
అయితే మంత్రులు, ఎమ్మెల్యేలకు బొకేలు అందించి సభకు పరిచయం చేసిన ఆర్డీవో, ఎంపీ వేమిరెడ్డిని మాత్రం విస్మరించారు. దీంతో వేమిరెడ్డికి ఆగ్రహం వచ్చింది. అంతే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎంత సముదాయించినా.. గౌరవం లేని చోట ఉండలేనంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా భర్తతో పాటు సమావేశం నుంచి వెళ్లి పోయారు. ఇదేమీ చిన్న విషయం కాదు. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరడానికి కారణమే వైసీపీలో తనకు గౌరవం లభించడం లేదని. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాలలో చెప్పారు.
వేమిరెడ్డి వంటి స్టేచర్ ఉన్న వ్యక్తులు పదవులు, హోదాల కంటే రెస్పెక్ట్ ఉండాలని భావిస్తారు. వైసీపీలో అలా రెస్పెక్ట్ దొరకలేదనే ఆయన పార్టీ వీడారు. ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశంలో కూడా ఆయనకు ఎదురౌతోందని భావిస్తున్నారు. ఎంపీనైన తనను అధికారులు గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆయనను సముదాయించేందుకు ఆనం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అధికారులు తనను అవమానించారనీ, ఇంకెప్పుడూ సమీక్షా సమావేశానికి వచ్చేది లేదని వేమిరెడ్డి కుండబద్దలు కొట్టేశారు. అంతా అయిపోయిన తరువాత ఆనం రామనారాయణరెడ్డి అధికారలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటిది పునరావృతం కాకూడదని ఆదేశించారు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధి విషయంలో వంక పెట్టడానికి వీల్లేకుండా పని చేస్తున్నది. ఈ విషయంలో చంద్రబాబు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎక్కడైనా నేతలూ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తుంటే వెంటనే కరెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో నేతలకు సముచిత గౌరవం దక్కే విషయంపై కూడా దృష్టి పెట్టాలి. నేడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి జరిగినట్లు మరో రోజు మరో నేతకు జరగకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వేమిరెడ్డి విషయంలో జరిగింది పొరపాటు మాత్రమేననీ, మరోసారి పునరావృతం కాదనీ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయనకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చిన్న విషయమే కదా అని వదిలేస్తే ముందు ముందు ఇదో ఆనవాయితీగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రొటోకాల్ ను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vemireddy-walk-out-39-187841.html
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.