Publish Date:Aug 11, 2022
భక్తి, ప్రేమలు మనసులో ఉండాలే గాని మైకుల్లో గోలచేయ నక్కర్లేదు. భారీ ప్రచారాలేమీ అక్కర్లేదు. చిన్న పాటి పని చాలు. అమృతోత్సవ్ పేరు తో బీజేపీవారికున్నంత దేశభక్తి మాకు లేదుగాని మాకున్నంతలో మాదీ దేశభక్తే అంటున్నారు కూర గాయల మార్కెట్లో దుకాణాలవారూ. నిజమే రాజకీయనాయకులకు, పారిశ్రామిక వేత్తలకే కాదు అందరికీ ఉంటుంది. ఎవరి స్థాయిలో వారు దాన్ని ప్రదర్శిస్తారు.
ఇది ఏ ఊరు, ఎక్కడా అన్నది అవతలపెడితే, అసలు ఇలా కూడా దేశభక్తిని ప్రదర్శించవచ్చన్న ఆలోచనకే జయహో అనొచ్చు. మార్కెట్లో వారంతా ఆశ్చర్యపోయారు. అందరూ ఇలానే వారి దుకాణాల ముందు ఏర్పాటు చేశారు. పారిశ్రామిక వేత్తలు వారి సంస్థల పైనా జెండా ఏర్పాటు చేస్తారు, నాయకులు వారి వారి కార్యాలయాల్లో, స్కూళ్లలో ఉపాధ్యాయులు. కూరగాయలు అమ్మేవారు మార్కెట్లో పెట్టుకున్నారు. వీరి ప్రయత్నం బహుశా రైతుల పరంగా దేశభక్తిని ప్రకటిస్తున్నారేమో! దేశానికి వెన్నెముక రైతాంగం అనేది అనాదిగా మన దేశం గురించి చెప్పుకుంటూన్నాం. కానీ ప్రభుత్వాలేవీ ఇటీవలి కాలంలో వారి గోడే పట్టించుకోవడం లేదు. అందుకే వారు ఆగ్రహించి ఎదురుతిరుగుతున్నారు. ఇదే ఆ మధ్య గుజరాత్ రైతాంగం చేసి నది. ధడిసి, ఏమీ చేయలేని స్థితిలో కేంద్రం దిగివచ్చింది.
రైతుల సంరక్షణే మా లక్ష్యం అంటూ అజెండాల్లో రాసుకునే మహానేతలు రైతుల వెన్నే విరుస్తున్నారు. తిండిపెడుతున్నవారికే తిండి లేకుండా చేయడానికి సాహసిస్తున్నారు. అంతా పారిశ్రామిక వాడలవుతున్నాయే గాని పంటభూములు దెబ్బతింటు న్నాయన్నది తెలియకా కాదు. ఏదో ఒక పండగరోజునో, స్వాతంత్య్రదినోత్సవం రోజునో రైతాంగాన్ని ఆకాశానికి ఎత్తే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రైతుల్ని గుర్తుచేసుకోవడమే అవుతోంది. కానీ వారి దేశభక్తి ఉందన్నది కూరగాయలు అమ్మేవారి ద్వారా ప్రకటించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vegetable-vendors-patriotism-25-141776.html
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.