కడప బిడ్డను విస్మరించిన కడప బిడ్డ

Publish Date:Jan 27, 2022

Advertisement

పాత సమస్యలు దారి మళ్లించేందుకు రోజుకో కొత్త ఇష్యూ చొప్పున క్రియేట్ చేస్తున్న ఆంధ్రా సీఎం జగన్... తాజాగా మరో వివాదానికి కారణమయ్యారు. కొత్త జిల్లాల పేరుతో ప్రజల్ని కాస్తో కూస్తో ఊరడిద్దాం అనుకుంటున్న జగన్ కు ఊహించని కొత్త సమస్య వచ్చి పడింది. ఏపీకి  అద్భుతమైన పేరు-ప్రఖ్యాతులు రావడంలో, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటడంలో, అనేక సాంఘిక దురాచారాలను, కులాల కుత్సితపు కట్టుబాట్లను, అగ్రవర్ణ దురహంకారాన్ని తీవ్రంగా ఎండగట్టిన వీరబ్రహ్మేంద్రస్వామికి కొత్త జిల్లాల్లో చోటే దక్కకపోవడంపై ఆంధ్రా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి బోధనలు, ఆచరణల్లో ఎంతో పారదర్శకత, ఎంతో సామాజిక శ్రేయోకాంక్ష మాత్రమే గాక సర్వమానవాళికి వినిపించిన ఆయన కాలజ్ఞానం తెలుగుప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది. అందుకే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ వీరబ్రహ్మేంద్రస్వామిని ఈ ప్రపంచం మరచిపోకుండా అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు. దానికి టైటిల్ కూడా శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర అంటూ ఆయన పట్ల ఎంతో భక్తిభావం చాటుకున్నారు. తెలుగునేలపై నడిచిన దైవంగా అన్నగారి అభిమానులు ఎన్టీఆర్ ను కీర్తిస్తున్నట్టే... వీరబ్రహ్మేంద్రస్వామిని సైతం తెలుగుప్రజలు అలాగే భావిస్తారు. 

అలాంటి ఎన్టీఆర్.. వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధకుడిగా మారిపోయి ఎంతో నియమ నిష్టలతో స్వామివారి చరిత్రను నభూతో, నభవిష్యత్ అన్న రీతిలో తెరక్కించారు. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ తాను ఒంటిపూట భోజనం చేశానని, యోగాభ్యాసం చేశాననని, చాప మీదే శయనించి బ్రహ్మచర్యం పాటించానని, ఆ షూటింగ్ జరిగినన్ని రోజులూ తనను ఆ వీరబ్రహ్మేంద్రస్వామి ఆవహించినట్టుగానే ఉండేదని, ఏదో అద్భుత శక్తి తనను నడిపిస్తున్నట్టు, తనతో మాట్లాడిస్తున్నట్టు అనిపించేదని పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పుకొని ఎంతో  ఉప్పొంగిపోయారు. ఆ సినిమాను తన జీవిత లక్ష్యంగా కూడా చెప్పుకున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి పేరుతో గతంలో పలువురు సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నించినప్పుడు వారికి అనుకోని సంఘటనలు ఎదురయ్యాయని, అనేక అవాంతరాలు కలిగాయని, సినిమా కోసం ముందుకొచ్చి వారెంతో నష్టపోయారంటూ తన శ్రేయోభిలాషులు హెచ్చరించారని చెప్పుకున్నారు. అయినా తానెంతో నిష్టగా ఆ సినిమాను చేయడం వల్ల సాక్షాత్తూ ఆ వీరబ్రహ్మేంద్రస్వామే అన్నీ ముందుండి చూసుకున్నాడని, అందువల్లే ఆ సినిమా హిట్టయ్యి తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించిందని చెప్పుకొని మురిసిపోయారు. ఇదంతా వీరబ్రహ్మేంద్రస్వామి పట్ల ఎన్టీఆర్ కు ఉండే భక్తిప్రపత్తులకు తార్కాణంగా చెప్పుకోవాలి. 

మరోవైపు ఎన్టీఆర్ పేరిట కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న క్రమంలో ఫిబ్రవరి 26 వరకు ప్రజల అభిప్రాయాలు, సూచనలు కూడా వినేందుకంటూ నోటిఫికేషన్ వెలువరించారు. అయితే ఎన్టీఆర్ పేరిట జిల్లా ఏర్పాటును టీడీపీ శ్రేణులు, పలువురు ప్రముఖులు స్వాగతిస్తుండగా రాజకీయ నిపుణులు మాత్రం అందులోని జగన్ చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు మంచిదే కానీ.. ఆయన దైవంగా భావించిన వీరబ్రహ్మేంద్రస్వామిని విస్మరించడాన్ని ఎలా సమర్థించుకుంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఓట్ల రాజకీయాల్లో భాగంగా రాష్ట్రంలో పలు ముఖ్యమైన సామాజికవర్గ సమీకరణల్ని దెబ్బ తీయడం కోసమే చేస్తున్నారు తప్ప.. చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదంటున్నారు. నిజంగా జగన్ కు చారిత్రక పురుషులపై అంతగా అభిమానం ఉంటే వీరబ్రహ్మేంద్రస్వామిని విస్మరించేవాడే కాదంటున్నారు. ఆంధ్రాతో ఏ సంబంధం లేని తెలంగాణ కవి, గాయకుడు గోరటి వెంకన్న రాయలసీమ గొప్పతనాన్ని, అక్కడి చారిత్రక ఔన్నత్యాన్ని అద్భుతంగా అక్షరీకరించారు. శ్రీరాములయ్య సినిమాలో... నను గన్న నా తల్లి రాయలసీమ, రతనానల సీమ అంటూ ఆ పాటలో వెంకన్న ఎంతో ఉద్వేగాన్ని మేళవించారు. రాయలసీమ కవిపుంగవులు కూడా ఇంత బాగా రాయలేరేమోనన్న అద్భుతమైన కితాబును వెంకన్న అందుకున్నారు. 

మరి రాయలసీమకు అందులోనూ బ్రహ్మంగారి మఠం వెలసిన కడప జిల్లాకు చెందిన జగన్.. వీరబ్రహ్మేంద్రస్వామిని విస్మరించడం ఏంటని ప్రజలంతా విస్తుపోతున్నారు. సామాజిక సంస్కరణ కోసం కులాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయిన వీరబ్రహ్మేంద్రస్వామి.. ఆనాడే కొందరు అగ్రకులస్తుల దురహంకారాన్ని భరించారు. వారిని తన మాటల ద్వారా, పాటల ద్వారా, బోధనల ద్వారా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయినా నిజాలు గ్రహించలేని సందర్భాల్లో వారి కళ్లు తెరిపించడానికి అనేక మహిమలు కూడా చూపారు. తన మహిమల ద్వారా నవాబులను సైతం శిష్యులుగా చేసుకున్నారు. తన అకుంఠిత దీక్షతో, దైవీచింతనతో పెద్దసంఖ్యలో శిష్యగణాన్ని పెంపొందించుకున్నారు. కులాతీత, మతాతీత సహజీవనం కోసం ఎంతో శ్రమించారు. జీవసమాధి నిష్ట వహించేవరకు ఇదే ఓ వ్రతంగా కొనగించారు. 

అంతటి మహిమాన్వితుడు, తపస్సంపన్నుడూ అయిన వీరబ్రహ్మేంద్రస్వామి ప్రస్తావనే లేకుండా చేయడంలో జగన్ ఆంతర్యమేంటని, ఇది కాకతాళీయమా లేక ఉద్దేశపూర్వకమా తెలియజేయాలని, ఒకవేళ పొరపాటున వీరబ్రహ్మేంద్రస్వామి పేరు గనక మిస్సయితే వెంటనే సరిదిద్దుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి వచ్చే ఉగాది లోగా జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

- టి.రమేశ్ బాబు

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.