కాంగ్రెస్ పార్టీపై అవినీతి పిడుగు

Publish Date:Dec 31, 2013

Advertisement

 

కాంగ్రెస్ పార్టీకి అవినీతికి ఉన్నఅవినాభావ సంబంధం గురించి ప్రజలకు కొత్తేమీ కాకపోయినా, ఈ మధ్యకాలంలో యువరాజు రాహుల్ గాంధీ వారికి అవినీతి పూనకం (అంటే అవినీతికి వ్యతిరేఖంగా లెక్చర్లు ఇవ్వడం) రావడంతో, కొంపదీసి ఆయన మాటలకు తలొగ్గి కాంగ్రెస్ నేతలందరూ నిజంగానే అవినీతిని విడిచిపెట్టేయబోతున్నారా? అని ప్రజలు ఒకటే అనుమానంపడిపోసాగారు. కానీ, మీకా భయం అక్కరలేదని కాంగ్రెస్ తరపున బీజేపీ నేతలు లికితపూర్వకంగా హామీ ఇచ్చారు.

 

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన అర్ధాంగి ప్రతిభా సింగ్ ఇద్దరూ కూడా గతంలో జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించలేక చేతేలేత్తేసిన వెంచర్ ఎనర్జీ కంపెనీ అనే ఒక ప్రైవేట్ విద్యుత్ సంస్థ వద్ద నుండి రూ.1.5కోట్లు, రూ.2.4 కోట్లు (మాత్రమే) ముడుపులు పుచ్చుకొని, దానికి మళ్ళీ పనులు మొదలుపెట్టడానికి అనుమతులు మంజూరు చేసారని, అంతే గాక సదరు కంపెనీకే చెందిన వేరే సంస్థ- తరిణి ఇన్ఫ్రా కంపెనీలో వీరభద్ర సింగ్ భార్య, కుమారుడు విక్రమాదిత్య సింగ్, కుమార్తె అపరాజిత కుమారిలు వాటాదారులుగా ఉన్నారని అన్ని ఆధారాలతో సహా బీజేపీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి పది పేజీల లేఖ వ్రాసిపడేసి, ఈ అవినీతి భాగోతం గురించి గురించి సోనియా, రాహుల్ గాంధీలు ఏమి జవాబు చెప్తారంటూ ప్రశ్నిస్తోంది. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కోరిన రాహుల్ గాంధీ మరి వీరభద్ర సింగ్ ముడుపుల వ్యవహారంపై కూడా పెదవి విప్పుతారా లేదా? అని బీజేపీ నిలదీస్తోంది.

 

అయితే షరా మామూలుగానే కాంగ్రెస్ ముందుగా ఆ ఆరోపణలను గట్టిగా ఖండించేసి పడేసింది. మరీ అంత ముచ్చటాగా ఉంటే ఆ కాయితాలు, సాక్ష్యాలు పట్టుకొని ఏ కోర్టుకో  సీబీఐ దగ్గరకో వెళ్ళండి కానీ మమ్మల్ని మాత్రం విసిగించొద్దని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసింది. అదేవిధంగా వీరభద్ర సింగ్ కూడా నేను, నా పెళ్ళాం పిల్లలు ఏ పాపం ఎరుగమని, కావాలంటే ఏ విచారణకయినా సిద్దం అని ఒక ఖండన ప్రకటన ఒకటి పడేసి చేతులు దులుపుకొన్నారు. ఇక మరో నాలుగు నెలలో దిగిపోయేవాడిని నాకెందుకు ఈ గొడవ? అనుకొంటూ మన్మోహన్ సింగ్ తన మౌనవ్రతంలో మునిగిపోయారు. కానీ, బీజేపీ మాత్రం ఇంతవీజీగా నిన్నొదల బొమ్మాళీ అంటూ కాంగ్రెస్ వెంట పడుతూ ఒకటే వేదిస్తోంది. ఇదంతా చూసి రాహుల్ గాంధీకి గానీ మళ్ళీ మూడొచేస్తే తనకు మూడుతుందని పాపం వీరభద్ర సింగ్ బిక్కుబిక్కుమంటూ డిల్లీ వైపు చూస్తున్నాడు.

By
en-us Political News

  
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయనీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలనీ కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో నేడో రేపో అరెస్టు కానున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ విశ్లేషకులు ఔననే అంటున్నారు.
పాకిస్తాన్‌లో నీటి కోసం ఆ దేశ హోంమంత్రి జియా ఉల్‌ హసన్‌ ఇంటిని తగలబెట్టారు. ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహావేశాలను అదుపు చేయడంలో పాక్ ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌‌పై భద్రతా బలగాలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
వైసీపీ నేత మాజీ సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల ఫ్యామిలీ ఆక్రమించిన 55 ఎకరాల ఫారెస్ట్ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో టాలీవుడ్ నిర్మాతలు సమావేశం ముగిసింది. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దని థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణించినట్లు తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరవధిక నిరాహా దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్ లో ఆకారణంగా విధుల నుంచి తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి దీక్షకు దిగారు.
వచ్చే ఏడాది మార్చి 31లోపు నక్సలిజాన్ని అంతం చేయాలని సంకల్పించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఎక్స్ వేదికగా తెలిపారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. నంబాల మృతిని అమిత్‌ షా అధికారికంగా ప్రకటించారు.
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. తిరుపతి గంగమ్మ జాతరలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (మే 22) హస్తిన పర్యటనకు వెడుతున్నారు. ఈ సారి ఆయన హస్తినలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని, ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, నాంపల్లి, చార్మినార్, కోఠి అబిడ్స్, రామంతపూర్, అంబర్‌పేట్ సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది.
కాదేదీ అవినీతికి అనర్హం. ఈ మాట ఏ కవీ అని ఉండకపోవచ్చును కానీ, అది నిజం. చారిత్రక సత్యం. అందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మినహాయింపు కాదు. అవును. చిన్న చిన్న చిల్లర పనుల్లోనే స్కాములు జరుగతున్న ప్రస్తుత పరిస్థితులలో వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరగక పోతే ఆశ్చర్య పోవాలే కానీ అవినీతి జరిగితే అందులో ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.