చిరంజీవికి ప్రాధాన్యత ఇస్తున్న సోనియా
Publish Date:Apr 21, 2012
Advertisement
అధిష్టానం ప్రత్యేక ప్రతినిధిగా హైదరాబాద్ విచ్చేసిన వాయలార్ రవి ఇటీవల రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన చిరంజీవి ఇంటికి విందుకు వెళ్ళడాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీలో కాపుల ప్రాధాన్యత పెరుగుతున్నట్టు కాపు సామాజికవర్గ నేతలు, కార్యకర్తలు సంతోషపడుతున్నారు. చిరంజీవి రాష్ట్రానికి చెందిన నాయకుడే కాదు జాతీయస్థాయిలో ప్రాధాన్యత కలిగిన నాయకుడని వాయలార్ రవి స్వయంగా ప్రకటించడం వల్ల రాష్ట్రంలో చిరంజీవి ప్రతిష్ట మరింతగా పెరిగినట్టుగా భావిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం కంటే కాపు సామాహిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రయోజనం ఎక్కువగా వుంటుందని, ఇదే సమయంలో చిరంజీచి ఇతర కాంగ్రెస్ నేతల మాదిరిగా కాకుండా సౌమ్యంగా, నమ్మకంగా వ్యవహరిస్తారనే భావనతోనే సోనియా గాంధీ, చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రధాన అగ్రకులాలుగా భావిస్తున్న రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాలలో సంఖ్యాపరంగా కాపు వర్గానిదే పైచేయి. కోస్తాఆంధ్రలో కాపు సామాజికవర్గం సంఖ్య మరింత ఎక్కువ. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రభావం కోస్తాప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్న ప్పటికీ తెలంగాణా ప్రాంతంలో నామమాత్రమే. ప్రస్తుతం ఇంటిలిజెన్సీ సమాచారం ప్రకారం కోస్తాప్రాంతంలో కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కోస్తాప్రాంతంలో కూడా జగన్ ప్రభావం తగ్గించవచ్చునని అధిస్థానం అంచనా వేస్తున్నట్టు సమాచారం.
http://www.teluguone.com/news/content/vayalar-ravi-visiting-chiranjeevis-house-24-13518.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





