నల్గొండలో అఖిలపక్షం దోపిడీ
Publish Date:Apr 21, 2012
Advertisement
రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా అధికారవిపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఒకరో లోగుట్టును మరొకరు బయటపెడుతున్నారు. నల్గొండ జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం, బిజెపి నాయకులు పలువ్యాపారాలు కలిసికట్టుగా చేసుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా కోట్లాదిరూపాయలు ఆర్జిస్తున్నారు. ఇక మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు కాంట్రాక్టులు కూడా వీరంతా కలిసే చేస్తూ సామరస్యంగా సహజీవనం చేస్తున్నారు. పార్టీలన్నీ ఏకంకావటంతో వారు ఎన్ని నిబంధనలు ఉల్లంఘించినా, ఎంత దోపిడీ చేసినా ఆ వివరాలు బయటకు రావటం లేదు. నల్లగొండ నియోజకవర్గంలో ఒక అధికారపార్టీ నాయకుడు, టిడిపి రాష్ట్రస్థాయి నాయకుడు కలిసి సుమారు 40 రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తున్నారు. వీటిలో వేటికీ సరైన అనుమతులు లేవు. వారిని ప్రశ్నించేవారు కూడా ఎవరూ లేకపోవటంతో వీరి వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. టిడిపికి చెందిన ఒక జిల్లా నాయకుడికి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీమంత్రికి మధ్య వ్యాపారలావాదేవీలున్నాయి. వీరిద్దరూ కోట్లాది రూపాయల విలువైన సివిల్ కాంట్రాక్టులతో పాటు సుమారు 60 మద్యం షాపుల్లో భాగస్వాములుగా ఉన్నారు. మిర్యాలగూడలో మద్యం సిండికేట్, రియల్ ఎస్టేట్ సిండికేట్లలో కాంగ్రెస్, టిడిపిలతో పాటు బిజెపి నాయకులు భాగస్వాములుగా కొనసాగుతున్నారు. అలాగే కోదాడమ్ నేలచెరువు, నేరేడుచర్ల, సుదూర్ నగర, సూర్యాపేట, అరవపల్లి, నూతనకల్, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో ఈ మూడు పార్టీల నాయకులు ఏకమై గుట్టుచప్పుడు కాకుండా అనేక వ్యాపారాలు చేస్తూ కోట్లాదిరూపాయలు ఆర్జ్హిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/nalgonda-district-24-13519.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





