తిరుమల లడ్డూ ప్రసాదం.. తప్పు చేసిందెవరు?.. పరిష్కారం ఏమిటి?
Publish Date:Feb 13, 2026
Advertisement
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో వాస్తవ వేదిక 12వ సంచిక గురువారం (ఫిబ్రవరి 12) విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అర్ధవంతమైన చర్చ జరిపారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం జగన్ హయాంలో సరఫరా అయినది అసలు నెయ్యే కాదని డోలేంద్ర ప్రసాద్ కుండ బద్దలు కొట్టారు.
పామాయిల్తో పాటు రసాయనాలు కలిపిన నూనె సరఫరా చేశారన్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు తెలివిగా నెయ్యిలో కల్తీ లేదని వాదిస్తూ ప్రజలను తొప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం దొంగే దొంగ దొంగా అని అరుస్తున్న చందంగా ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును వదిలి సుప్రీంకోర్టులో సీబీఐ విచారణ కోరడం అలాంటిదేనని కంఠంనేని రవిశంకర్ అన్నారు. అపచారం చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు బుకాయిస్తున్నారన్నారు. ఈ దశలో కంఠంనేని రవి శంకర్ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలకు ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలు అన్న విషయాన్ని అప్పట్లో వైఎస్ ఏకంగా ఏడు కొండలు కాదు రెండు కొండలే అంటూ జీవో ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించి.. వైఎస్ఆర్ కుటుంబం తిరుమలపై కక్ష కట్టిందా? అన్న ప్రశ్న సంధించారు. ఈ సంచికలో ఇంకా పింక్ డైమండ్ అన్న రమణదీక్షితులు వ్యవహారంపై కూడా చర్చకు వచ్చింది.
మొత్తంగా వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో అసలు నెయ్యిని వాడలేదనీ, నెయ్యిలా కనిపించేందుకు, పూసపూసలా నెయ్యి అనిపించేందుకు నూనెలో రసాయనాలు కలిపి సరఫరా చేశారని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. దీనివల్ల తిరుమల లడ్డూ ప్రసాదం మూడు నాలుగు రోజులలోనే బూజు పట్టేవన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం డిఫెన్స్ లో పడటానికి, ల్యాబ్ రిపోర్టులు పూర్తిగా అధ్యయనం చేయకుండా చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అని ప్రకటించడమేనన్నారు. ఇక నుంచైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి'అనడం మాని కల్తీ నూనె లేదా రసాయనాల మిశ్రమం అని పిలవాలని డోలేంద్ర ప్రసాద్ సూచించారు. ఎందుకంటే అసలు నెయ్యే లేనప్పుడు కల్తీ నెయ్యి అని ఎలా అనగలం అన్నారు.
ఇక తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఇంతటి అపచారం జరిగితే చిన్న జీయర్ స్వామి వంటి మతాధిపతులు, మఠాధిపతులు, హిందూ సంస్థలు ఎందుకు మౌనం వహిస్తున్నాయన్నారు. దర్యాప్తు సంస్థల విచారణలు, రాజకీయ ఆరోపణలు కాకుండా కంటే మతాధిపతులతో కూడిన కమిటీ విచారణ చేస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. దేవుడికి అపచారం చేసిన వారు ఎవరూ బాగుపడలేదన్నారు. జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్త హోమం నిర్వహించాలని, జగన్ తన హయాంలో జరిగిన తప్పుకు బహిరంగ క్షమాపణ కోరాలని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.
వాస్తవ వేదిక పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో వీక్షించండి
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.