Publish Date:Aug 26, 2022
పోటీలు అనగానే క్రీడారంగంలో పోటీలు, రాజకీయరంగంలో పోటీపడటాలు గురించే అందరికీ తెలు స్తుంది. కానీ చిత్రంగా అస్సలు ఎవ్వరూ ఊహంచని సరికొత్త పోటీ ఒకటి ఈమధ్య నిర్వహించారు. అపానవాయు పోటీ! ఆమధ్య ఏదో సినిమాలో ముగ్గురు కమెడియన్లు యూ.ఎస్లో ఒక నగరం వీధిలో నిలబడి అపానవాయు వదలుతారు, దాని ధాటికి చాలామంది పారిపోతారు!
ఇదో సినిమాలో కామెడీ సీన్ ! అది ప్రేక్షకులకు సరదా కోసం సినిమావారు కల్పించిన ఒక సీన్. తలచు కుంటే నవ్వొస్తుంది. కానీ అలా నిజంగానే అవుతుందా అంటే ! ఏమో అనే సందేహాస్పద సమాధానాలూ వినవలసివస్తుంది. మావూళ్లో ఒక పెళ్లి భోజనం చేసిన ఓ పెద్దాయన... అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఏదో ఒక విచిత్ర వివరణలతో ఇలాంటి సంఘటనలు గుర్తుచేసుకున్నా పెద్దగా ఆశ్చర్య పోనక్క ర్లేదు.
ఇలాంటి పోటీ ఏమిటన్నదే ఇపుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. ఇది ఎక్కడో విదేశాల్లో కాదు.. చక్కగా మన దేశంలోనే నిర్వహించారు. ఈపోటీలో పాల్గొనడానికి ఏకంగా ముంబై, జైపూర్, దుబాయ్ వంటి నగ రాల నుంచి కూడా పేర్లు నమోదయ్యాయి!
ఒక పెద్ద గది.. ఎంతో చక్కటి సుగంధద్రవ్యాలతో సువాసనలతో ఆకట్టుకుంటుంది. ఎంతో శుభ్రంగా అలంకరించి ఉంటుంది. ఆ గదిలోకి ఒక వ్యక్తిని పంపిస్తారు. అతను అపానవాయు వదులుతాడు.. అది ఎంతగా దారుణంగా వాతావరణాన్ని కంపుమయం చేస్తుందో అంచనా వేస్తారుట! ఎలా చేస్తారన్నది వదిలేద్దాం. అలా చేసిన తర్వాత. మరో వ్యక్తిని మరో గదిలోకి పంపుతారు. ఇలా ఉన్న రెండు గదుల్లోకి లెక్ ప్రకారం, సమయాన్ననుసరించి శుభ్రత జాగ్రత్తలు తీసుకుంటూ మరీ పంపుతారట! ఫైనల్గా ఎవరు ఎంతగా ఇబ్బందిపెడితే వారే విజేత! పరామర్ అనే మహిళ ఈ పోటీలకి జడ్జి. ఊహంచని ఈ పోటీలకు తనను జడ్జిగా నియమించడం గురించి చెబుతూ నవ్వు ఆపుకోలేకపోయిందామె.
ఇదే కాంపిటీషనండీ! అని చిరాకుపడొచ్చు. అనేకానేక వెర్రి ఆటలు, కాంపిటీషన్లలో ఇదోటి! విదేశాల్లో గిన్నిస్బుక్ రికార్డుల కోసం చిన్న చిన్న విషయాల్లోనూ పెద్ద పెద్ధ పోటీలు జరుగుతుంటాయిట. తినడం, రన్నింగ్, బస్కీలు తీయడం.. ఇలాంటివి. మరి మనవాళ్లు కనుగొన్న ఈ పోటీ కూడా ఆ స్థాయికి అను మతి లభిస్తుందేమో చూడాలి! చిత్రంగా ఉంది గదా. ఈమధ్యనే సూరత్లో ఈ పోటీ జరిగితే పెద్ద సంఖ్య లో ఎవ్వరూ పాల్గొనలేదు. కానీ విన్నవారు పడి పడి నవ్వుకుంటూనే ఉన్నారు! ఇలాంటి పోటీలూ ఉంటా యా అని! ఇదే కాదు త్రేణుపుల పోటీ కూడా ఉంటుంది. అయితే దీనికి మాత్రం మరింత కష్టపడాల్సి వస్తుం ది. త్రేణుపులు అంత సులభంగా రావు కదా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/variety-competition-39-142670.html
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.