పిఠాపురంలో వంగా గీత ఎర్ర తువ్వాలు పంచాయతీ!
Publish Date:May 13, 2024
Advertisement
వైసీపీ భ్రమలు తొలగిపోయాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులూ ఆ పార్టీకీ ఛీ కొట్టేశారు. సంక్షేమం అంటూ తమ ఇంత కాలం భ్రమల్లో ఉంచి చేసిన నిర్వాకం చాలన్నట్లుగా వైసీపీకి వ్యతిరేకంగా పోలింగ్ బూత్ లకు పోటెత్తారు. సంక్షేమ లబ్ధాదారులు కదా, మనకే ఓటేస్తారు అన్న భ్రమల్లో ఉన్న వైసీపీకి తామెటు వైపో తమ ధిక్కారం ద్వారా విస్పష్టంగా తెలియజేశారు. నమస్కారానికి ప్రతినమస్కారం, తిరస్కారానికి తిరస్కారం అన్నట్లుగా ఏకంగా పోలింగ్ బూత్ లలోనే వైసీపీ నేతలపై తిరగబడ్డారు. మాటకు మాట చెబుతూ మీ పనైపోయిందన్న సంకేతాలు ఇచ్చారు. సరిగ్గా అలాంటి తిరస్కారమే పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ఎదురైంది. తమ వాళ్లేకదా అని ఓ ఓటరు వేసుకున్న ఎర్రకండువా తీసేయమని చెప్పిన వంగా గీతకు సదరు ఓటరు దిమ్మతిరిగిపోయేలా బదులిచ్చారు. నేను తీయను అయినా నా కండువా ఊసు మీకేందుకు అంటూ నిలదీశారు. ఇలా ఒంటిపై ఉన్న దుస్తులను చూసి కూడా భయపడే పరిస్థితి వైసీపీ నేతలకు స్వయంగా ఆ పార్టీ అధినేత జగనే కనిపించారు. నలుపు అంటే నిరసన, పసుపు అంటే తెలుగుదేశం అన్న భయాన్ని వారిలో ఏర్పడేలా చేసింది స్వయంగా జగనే. అందుకే ఆయన పార్టీ నేతలెవరూ నల్ల రంగు దుస్తులు వేసుకోరు. అది ఆ పార్టీలో అప్రకటిత నిషేధం. అంతెందుకు జుట్టుకు నల్ల రంగు వేసుకోవడానికి కూడా అంబటి వంటి వారు భయపడతారు. జగన్ కు ఎక్కడ కోపమొస్తుందోనని. ఇటీవల జగన్ ఓ ప్రచార సభలో చెల్లెలు షర్మిల పసుపు చీర కట్టుకోవడాన్ని కూడా ఆక్షేపించి భంగపడిన సంగతి తెలిసిందే. తన చీరపై కామెంట్ చేసిన అన్న జగన్ ను షర్మిల ఉతికి ఆరేశారు. పసుపు రంగు టీడీపీ పేంటంట్ హక్కా..? ఆ రంగుని బాబు కొనుక్కున్నారా..? ఏపీలో పసుపు రంగు నిషేదించారా..? అంటూ షర్మిల ప్రశ్నలతో జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేసేశారు. దీంతో ఆమె చీర ఊసెందుకెత్తాన్రా అంటూ జగన్ తలబాదుకున్న పరిస్థితి. ఒక్క షర్మిల మాత్రమే కాదు, విపక్ష పార్టీలూ, చివరాఖరికి సొంత పార్టీ శ్రేణులూ కూడా జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టాయి. ఇప్పుడు ఎర్ర కండువా లేదా తుండుపై పోలింగ్ బూత్ లోనే పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ వంగా గీత ఓటరుతో పంచాయతీ పెట్టుకున్నారు. వంగా గీత ఎర్ర తువ్వాలు తీసేయమంటూ ఓటరును దబాయించడం, నా ఒంటి మీద తువ్వాలు రంగుతో మీకేం పని అంటూ అతను తిరగబడటం సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. గీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వైసీపీ కి ఎర్ర తుండు ఓటమి భయం చూపించేసింది అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో వంగా గీతపై సెటైర్లు గుప్పిస్తున్నారు. గబ్బర్ సింగ్ అనే సినిమాలో హీరో పవన్ కల్యాణ్ వేసుకున్న ఎర్ర తువ్వాలు ఆ తరువాత ఆయన అభిమానులకు ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఇప్పుడు ఆ రంగు తుండు పోలింగ్ బూత్ లో కనిపించేసరికి వంగా గీతకు భయం పట్టుకుంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
వంగా గీత ఎర్ర తువ్వాలు పంచాయతీపై జనసేన నేత నాగబాబు ఎర్ర తువాల్ ను కాశీ తువ్వాలు అంటారు. దీనిని కష్టం చేసే ప్రతి కార్మికుడు ధరిస్తాడు. ఇది ధరించడం వారి హక్కు. తువ్వాలు ను వేసుకోవడాన్ని అడ్డుకోవడం చట్ట వ్యతిరేకమే తర్వాత మీ ఇష్టం అంటూ సోషల్ మీడియా వేదికగా వంగా గీతకు నాగబాబు చురకలంటించారు.
http://www.teluguone.com/news/content/vangageetha-red-towel-panchayat-39-175912.html