వల్లభనేని వంశీ మెడకు నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఉచ్చు!

Publish Date:Nov 9, 2024

Advertisement

భూమి గుండ్రంగా ఉందని ఎక్కడ మొదలయ్యామో అక్కడికే రాక తప్పదని ఇప్పటికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అర్ధమై ఉంటుంది. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై.. వైసీపీ అధికారంలోకి రాగానే వంశీకి కేసుల భయం పట్టుకుంది. అధికారంలో ఉన్న వైసీపీ పంచన చేరితే ఇక ఆ కేసుల భయం ఉండదని పార్టీ మారిపోయారు. ఇక్కడే ఆయన భూమి గుండ్రంగా కాదు బల్ల పరుపుగా ఉంటుందని భావించారు. మరెన్నడూ తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు.. జగనే శాశ్వత సీఎం, కనుక తనపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఎప్పటికీ తేలదని నమ్మారు.

అందుకే వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వదిలేసి జగన్ పంచన చేరి వైసీపీ కండువా కప్పు కున్నారు. అంతేనా.. ఇన్నాళ్లూ ఆశ్రయం ఇచ్చిన పార్టీపై ఇష్టారీతిన ప్రేలాపనలు పేలారు. తెలుగు దేశం అధినేత సతీమణి భువనేశ్వరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు అండగా నిలబడిన గన్నవరం తెలుగుదేశం క్యాడర్ ను వేధించారు. ఐదేళ్లు తిరిగే సరికి సీన్ మారిపోయింది. జగన్ పార్టీ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది అని భావించారు. జగన్ సీఎం పదవి పోయింది. ఓటమి అనేదే లేకుండా తాను గెలుస్తూ వస్తున్న గన్నవరం అసెంబ్లీ స్థానంలో వల్లభనేని వంశీ కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. భూమి గుండ్రంగానే ఉందని, ఉంటుందని ఇప్పుడు వంశీకి బోధపడి ఉంటుంది. ఎందుకంటే ఏ కేసు భయంతో అయితే  వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వీడాడో.. అదే కేసు ఇప్పుడు ఆయనకు కటకటాల భయాన్ని చూపెడుతోంది.

బాపులపాడులో నకిలీ ఇల్ల పట్టాలు తయారు చేయించి పంచిన   కేసులో వల్లభనేని వంశీ ముద్దాయి.  2019 ఎన్నికలలో  వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసులో తనకు జైలు తప్పదన్న భయంతో ఆయన పార్టీ మారిపోయారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయన భావించినట్లే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ నకిలీ ఇళ్ల పట్టాల కేసు పట్టాలెక్కలేదు. ఆ కృతజ్ణతో లేక వైసీపీ అధినాయకత్వం ఒత్తిడో తెలియదు కానీ వంశీ వైసీపీ పంచన చేరి తెలుగుదేశం నేతలపై ఇష్టాను సారం వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్ ను వేధించారు. ఇప్పుడు కర్మఫలం అనుభవించక తప్పని పరిస్థితిలో ఉన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు వంశీపై కేసు నమోదు అవ్వనుంది. వైసీపీ నుంచి అండ లభించే అవకాశాలు లేశమాత్రంగానైనా కనిపించడం లేదు. దీంతో వంశీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడగా మారిపోయింది. కటకటాలు లెక్కిండానికి రోజులు లెక్కపెట్టుకోవడమే మిగిలింది.

By
en-us Political News

  
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.