ఓడిశాకు వంశధార ట్రిబ్యునల్ మొట్టికాయ?
Publish Date:Oct 3, 2012
Advertisement
ఆంధ్రప్రదేశ్, ఓడిశా రాష్ట్రల మధ్య వంశధార నదీ జలాలు వినియోగ ఒప్పందంలో విబేధాలున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ కూడా గతంలో ఈ వివాదాలను ట్రిబ్యునల్ పరిష్కరిస్తుందని చెప్పారు. అయితే వంశధార కేటాయింపుల్లో వివక్షత జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర నీటి వినియోగ ఒప్పందాల ప్రకారం ఈ నీటిని సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన రెండు రాష్ట్రాలకూ సూచించారు. అయితే ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై ఓడిశా ఫిర్యాదు చేసింది. నీటి ఒప్పందం ప్రకారం తమకు అందాల్సి వాటాలో అన్యాయం జరుగుతోందని ఓడిశా ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. దీనిపై విచారణ ప్రారంభించిన ట్రిబ్యునల్ ఓడిశా అభ్యంతరాలను తోసిపుచ్చింది. అలానే ట్రిబ్యునల్ సభ్యుడిగా జస్టీస్ గులాం అహ్మద్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సభ్యుల నియామకం, తొలగింపు అధికారం తమకు లేదని ట్రిబ్యునల్ ఛైర్మన్ స్పష్టం చేశారు. ఎనిమిది వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఓడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ట్రిబ్యునల్ ఆదేశించింది. నదీజలాల పంపకంపై డిసెంబర్ 4 నుంచి మరోసారి విచారణ చేపడతామని ట్రిబ్యునల్ తెలిపింది. ఈ విచారణ సమయానికి ట్రిబ్యునల్కు అవసరమైన పూర్తి సమాచారం అందజేయలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రత్యేకించి పొరుగురాష్ట్రాలతో విభేదాలు లేకుండా చూసుకునేందుకు ట్రిబ్యునల్ ఇచ్చిన 8వారాల గడువు సరిపోతుందని రాష్ట్ర పాలకులు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/vamshadhara-tribunal-31-17870.html





