చదువేరా అన్నిటికీ మూలం.. ఆ చదువు విలువ తెలుసుకొనుటే ధర్మం. ఇది అక్షర సత్యం. అయితే చదువుకోవడం అంటే మార్కులూ, ర్యాంకులూ కాదు. విలువలు, వివేకం. కేవలం పుస్తకాల పురుగులా బట్టీయం పడితే సరిపోదు. అలా బట్టీయం పట్టి ర్యాంకులు సాధించినా మనిషిగా విలువలకు దూరమైతే ప్రయోజనం లేదు. అటువంటి విలువలు లేని విద్యావంతులను చూసే చదవేస్తే ఉన్నమతి పోయింది, చదువుకు ముందు కాకరకాయ, చదివాకా కీకరకాయ వంటి సమేతలు పుట్టాయి. ఈ విషయాన్ని తెలుసుకోకుండా విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ కూడా మార్కులూ, ర్యాంకుల వెంట పడుతున్నారు. వ్యక్తిత్వ వికాసం కంటే.. పరీక్షల్లో వచ్చిన పర్సంటేజీ ఎంత, అధిక ప్యాకేజీతో కొలువులు సంపాదించడం ఎలా అన్నదానిపైనే దృష్టి పెడుతున్నారు. ఆ క్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచేస్తున్నారు. మంచి ర్యాంకు రాకపోతే ఎందుకూ పనికి రామన్న న్యూన్యతా భావం పిల్లలలో పెంచేలా వ్యవహరిస్తున్నారు. ఆ కారణంగానే పరిక్షా ఫలితాలు వచ్చిన తరువాత విద్యార్థుల ఆత్మహత్యల వార్తలను ఎక్కువగా వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదువు అంటే కేవలం ఉత్తీర్ణత మాత్రమే కాదనీ, ఒక వైఫల్యం భవిష్యత్ విజయానికి మొదటి మెట్టన్న సంగతి మరిచిపోతున్నారు. మార్కులు తక్కువ వచ్చినా, ఒక వేళ పరీక్షలో ఫెయిలైనా జీవితం ముగిసినట్లు కాదన్న విషయాన్ని విస్మరిస్తున్నారు.
ఏపీజే అబ్దుల్ కలాం చదువులో సాధారణ విద్యార్థే.. అయినా శాస్త్రవేత్త అయ్యారు. రాష్ట్రపతిగా గౌరవాన్ని అందుకున్నారు. భారత రత్న పురస్కారం తీసుకున్నారు. అలాగే క్రికెట్ గాడ్ గా అశేష అభిమానులను సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ విద్యార్థిగా టెన్త్ ఫెయిలయ్యారు. అటువంటి వారు ఇంకెందరో ఉన్నారు. చదువు అంటే మార్కులూ, ర్యాంకులే కాదనీ, తమకు నచ్చిన, తమకు నైపుణ్యం ఉన్న రంగాలలో సాధన చేసి ఉన్నత స్థాయిని అందుకోవచ్చనీ చాటిన ఎందరో ఉన్నారు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చదువు అనేది విజ్ణానసముపార్జనకు సాధనమే కానీ, చదువంటే ర్యాంకులూ, మార్కులు, కొలువులేకాదని చెప్పాలి. చదువులో వెనుకబడిన పిల్లలలో ఆత్మస్థైర్యం పెంచి.. భవిష్యత్ లో మరింత కష్టపడి పైకి వచ్చే విధంగా ప్రోత్సహించాలి.
సరిగ్గా అలాంటి పనే చేశారు ఆ తల్లిదండ్రులు.. అసలేం జరిగిందంటే.. కర్నాటకకు చెందిన అభిషేక్ ఇటీవల జరిగిన టెన్త్ పరీక్షలు రాశాడు. అయితే అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిలయ్యాడు. తోటి విద్యార్థల అవహేళలనతో కృంగిపోయాడు. ఇది గమనించిన అతడి తల్లిదండ్రులు.. అతడికి ధైర్యం చెప్పారు. ఈ సారి బాగా చదివి ప్యాసవ్వాలని బోధించారు. అంతే కాకుండా భవిష్యత్ విజయానికి ఈ ఫెయిల్యూల్ స్టెప్పింగ్ స్టోన్ గా భావించాలని చెబుతూ.. తమ కుమారుడి భవిష్యత్ విజయాన్ని కాంక్షిస్తూ కేట్ కట్ చేసి వేడుక చేశారు. ఈ వేడుకకు అభిషేక్ ను గేలి చేసిన తోటి విద్యార్థులనూ ఆహ్వానించారు. మొత్తంగా తమ కుమారుడిలో ఆత్మ స్థైర్యాన్ని ప్రోది చేయడమే కాకుండా, ఇతరులకూ ఆదర్శంగా నిలిచారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/values-are-more-important-than-marks-39-197418.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.