గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ వివిధ కేసులలో గత కొంత కాలంగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చివరాఖరుకు ఆయనపై నమోదైన అన్ని కేసులలోనూ బెయిలు లభించడంతో బుధవారం (జులై 2) ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఆయన బయటకు రావడంతోనే ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఏమిటంటే వైసీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేస్తారంటే రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేయడమే కాదు.. మొత్తంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పే అవకాశం ఉందని కూడా వినిపిస్తోంది.
కృష్ణా జిల్లా రాజకీయాలలో వంశీ కీలకమైన వ్యక్తి అనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ వరుసగా రెండు సార్లు తెలుగుదేశం తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలలో విజయం తరువాత.. అప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ గూటికి చేరారు వల్లభనేని వంశీ. అధికారం అండతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలతో చెలరేగిపోయార్న ఆరోపణలతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో సాక్షిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టైన వంశీపై ఆ తరువాత పలు కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసులలో బెయిలు లభించడంతో బయటకు వచ్చే అవకాశం ఉంది.
వంశీకి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. జైలు జీవితం, పెరిగిపోతున్న రాజకీయ ఒత్తిడుల కారణంగా వంశీ వైసీపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతే కాకుండా ప్రజాజీవితం నుంచి కూడి రిటైర్ కావాలని, రాజకీయాలకు పూర్తిగా దూరం అవ్వాలని వంశీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వంశీ కుటుంబం నుంచి కూడా ఈ దశగా ఆయనపై ఒత్తిడి ఉందంటున్నారు. వంశీ జైలులో ఉన్న సమయంలో వైసీపీ నాయకత్వం ఆయన భార్యను రాజకీయంగా క్రియాశీలంగా ఉండాలని కోరినప్పటికీ ఆమె సుముఖత వ్యక్తం చేయకపోవడమే వంశీ కుటుంబం ఇంకెంత మాత్రం వైసీపీతో కలిసి పయనించేందుకు అవకాశం లేదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఒత్తిడి కారణంగా వంశీ వైసీపీకి గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి రావడానికి కారణంగా చెబుతున్నారు. ఈ వార్తలలో వాస్తవం ఎంతన్నది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vallabhaneni-vamshi-goodbye-to-ycp-39-201063.html
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.